• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

సన్న బియ్యం పథకం ప్రారంభించిన అదనపు కలెక్టర్

NRPT: పేద ప్రజలకు ప్రభుత్వం నాణ్యమైన సన్న బియ్యం అందజేస్తున్నదని అదనపు కలెక్టర్ రెవెన్యూ బెన్ షాలోమ్ తెలిపారు. బుధవారం కృష్ణా మండల కేంద్రంలోని చౌక ధర దుకాణంలో ప్రభుత్వం పంపిణీ చేస్తున్న సన్న బియ్యం పథకాన్ని ప్రారంభించి లబ్ధిదారులకు బియ్యం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రేషన్ కార్డులు ఉన్న ప్రతి ఒక్కరికీ సన్న బియ్యం అందజేస్తామని తెలిపారు.

April 2, 2025 / 04:48 PM IST

ఈనెల 14 వరకు రాజీవ్ యువ వికాసం దరఖాస్తుల స్వీకరణ

NLG: దేవరకొండ మున్సిపల్ కార్యాలయంలోని ప్రజా పాలన సేవ కేంద్రం ద్వారా రాజీవ్ యువ వికాసం పథకానికి దరఖాస్తు చేసుకోవాలని మున్సిపల్ కమిషనర్ వై. సుదర్శన్ బుధవారం తెలిపారు. జిల్లా కలెక్టర్ ఆదేశానుసారం ఈనెల 14 వరకు దరఖాస్తులను స్వీకరించినట్లు తెలిపారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకొని, సంబంధిత పత్రాలను మున్సిపల్ కార్యాలయంలో అందజేయాలని సూచించారు.

April 2, 2025 / 04:40 PM IST

సీపీఎం ఆధ్వర్యంలో రాస్తారోకో

NLG: చిట్యాల పట్టణంలో బుధవారం సీపీఎం ఆధ్వర్యంలో స్థానిక భువనగిరి రోడ్డుపై రాస్తారోకో, నల్ల జెండాల ప్రదర్శన నిర్వహించారు. HCU భూమిని ప్రైవేటు వారికి అప్పగించాలనే ప్రభుత్వ యోచన విరమించుకోవాలని సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు జిట్ట నగేష్, అవిశెట్టి శంకరయ్యలు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. 400 ఎకరాల HCU భూములను చౌకగా అక్రమ పద్ధతుల్లో కొళ్ళగొడుతున్నారన్నారు.

April 2, 2025 / 04:33 PM IST

ఎమ్మెల్యే కార్యాలయంలో ప్రజా దర్బార్

ప్రకాశం: ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య ఆదేశాలతో చీరాలలోని టీడీపీ క్యాంపు కార్యాలయంలో బుధవారం ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో మండల అధ్యక్షులు గంజి పురుషోత్తం, పట్టణ అధ్యక్షులు గజవల్లి శ్రీనివాసరావులు పాల్గొని ఆయా సమస్యలపై వచ్చిన అర్జీలను స్వీకరించారు. మొత్తం 130 అర్జీలు వచ్చాయని, ఎమ్మెల్యే దృష్టికి తీసుకు వెళ్తామని చెప్పారు.

April 2, 2025 / 04:32 PM IST

‘ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి’

NLG: ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే సామేలు అన్నారు. బుధవారం శాలిగౌరారం మండల కేంద్రంలోని వసాయ మార్కెట్ యార్డ్ నందు పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆర్డీవో అశోక్ రెడ్డితో కలిసి ప్రారంభించి మాట్లాడారు. రైతులు నాణ్యమైన ధాన్యాన్ని కేంద్రాలకు తీసుకువచ్చి ప్రభుత్వ మద్దతు ధర పొందాలన్నారు.

April 2, 2025 / 04:24 PM IST

‘వక్ఫ్ బోర్డ్ బిల్లు రాజ్యాంగ విరుద్ధం’

NDL: వివాదస్పద వక్ఫ్ బోర్డ్ చట్ట సవరణ బిల్లు రాజ్యాంగ విరుద్ధమని, దాన్ని వెంటనే ఉపసంహరించాలని సీపీఎo పార్టీ జిల్లా కార్యదర్శి నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. బుధవారం నంది కోట్కూరు సీపీఎం పార్టీ కార్యాలయంలో గోపాలకృష్ణ అధ్యక్షతన మీడియా సమావేశం నిర్వహించారు. ప్రతిపక్షాల సూచనలు పరిగణనలోకి తీసుకోకుండా వక్ఫ్ బోర్డు చట్ట సవరణ బిల్లు ముందుకు తీసుకురావడం విచారకరమన్నారు.

April 2, 2025 / 04:09 PM IST

‘అరాచకాలు ఎదుర్కొనేందుకు సిద్ధం’

ATP: అధికార పార్టీ అరాచకాలను ఎదుర్కొనేందుకు వైసీపీ ఎప్పటికీ సిద్ధంగా ఉంటుందని వైసీపీ అనంతపురంజిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి స్పష్టం చేశారు. పస్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో మెజార్టీ లేదని తెలిసినా అధికార పార్టీ ప్రజాప్రతినిధులు బెదిరింపులు, దాడులు, దౌర్జన్యాలు చేశారని మండిపడ్డారు. అయినా 51 స్థానాలకు గాను 39 స్థానాల్లో వైసీపీ విజయం సాధించిందని తెలిపారు.

April 2, 2025 / 04:05 PM IST

కళాకారులకు ఎమ్మెల్యే రూ.లక్ష సాయం

ATP: కళ్యాణదుర్గం పట్టణంలో ప్రజావేదిక వద్ద గత వారంరోజులపాటు అక్కమ్మ జాతరలో ప్రదర్శనలు ఇచ్చిన ఉరుముల కళాకారులను ఎమ్మెల్యే సత్కరించారు. అనంతరం వారికి అర్థిక సహాయం రూ. లక్ష వారికి అందజేశారు. మా కష్టాన్ని గుర్తించి మమ్మల్ని గౌరవించి మాకు అండగా ఉంటానని తెలియజేసిన ఎమ్మేల్యే సురేంద్రబాబుకు కళాకారులు కృతజ్ఙతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు.

April 2, 2025 / 03:56 PM IST

సోమందేపల్లి పోలీసులకు గంజాయి నిరోధంపై వినతిపత్రం

సత్యసాయి: సోమందేపల్లిలో గంజాయి బ్యాచ్‌ను అరికట్టాలని ప్రజా సంఘాలు పోలీసులకు వినతిపత్రం అందజేశారు. మద్యం, జూదం, మట్కా పెరిగిపోతున్నాయని, మండలంలో ప్రశాంతతకు భంగం కలుగుతోందని ప్రజా సంఘాల నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. గంజాయి నివాస ప్రాంతాలను రెడ్ జోన్‌లుగా ప్రకటించి, యువతను రక్షించాలని కోరారు.

April 2, 2025 / 03:51 PM IST

సన్న బియ్యం ఇస్తున్న ఘనత కేంద్ర ప్రభుత్వానిదే

SRD: ప్రజలకు సరఫరా చేస్తున్న సన్నబియ్యం ఘనత కేంద్ర ప్రభుత్వాన్ని దేనిని బీజేపీ జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి అన్నారు. రామచంద్రపురంలోని రేషన్ దుకాణాన్ని బుధవారం ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఒక్కొక్కరికి 5 కిలోల ఉచిత బియ్యాన్ని కేంద్ర ప్రభుత్వం ఇస్తుంటే.. ఒక్క కిలో మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందని చెప్పారు.

April 2, 2025 / 03:28 PM IST

మాజీ మంత్రి కాకాణికి మళ్లీ నోటీసులు

AP: వైసీపీ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిపై నమోదైన కేసుకు సంబంధించి మూడోసారి నోటీసులు ఇవ్వాలని పోలీసులు భావిస్తున్నారు. కాకాణి నెల్లూరుకు చేరుకున్న వెంటనే నోటీసులు ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు. ఈ కేసులో విచారణకు హాజరు కావాలని కాకాణికి ఇప్పటికే రెండుసార్లు నోటీసులు జారీ చేశారు. అయితే, విచారణకు హాజరు కాకపోవడంతో తదుపరి కార్యాచరణకు సంబంధించి పోలీసులు చర్చిస్తున్నారు.

April 2, 2025 / 02:28 PM IST

సన్న బియ్యం పంపిణీ ప్రక్రియ సాఫీగా జరపాలి: కలెక్టర్

NRML: సన్న బియ్యం పంపిణీ ప్రక్రియ సాఫీగా జరిగేలా పకడ్బందీ పర్యవేక్షణ జరపాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. మామడ మండల కేంద్రంలోని రేషన్ షాపును కలెక్టర్ బుధవారం సందర్శించి, లబ్దిదారులకు స్వయంగా సన్న బియ్యం పంపిణీ చేశారు. రేషన్ దుకాణానికి కేటాయించిన సన్న బియ్యం నాణ్యతను పరిశీలించి, రేషన్ యజమానులకు పలు సూచనలు సలహాలు చేశారు.

April 2, 2025 / 02:28 PM IST

99 పరుగుల్లో సెంచరీ మిస్‌.. మాస్ ట్రోలింగ్

పాకిస్తాన్ స్టార్ క్రికెటర్ బాబర్ అజామ్ మళ్లీ ట్రోలింగ్‌కు గురయ్యాడు. న్యూజిలాండ్‌తో జరిగిన రెండో వన్డేలో బాబర్ కేవలం ఒక్క పరుగుకే పెవిలియన్‌కు చేరాడు. దీంతో బాబర్ కొద్దిలో సెంచరీ మిస్ చేసుకున్నాడని.. మరో 99 పరుగులు చేస్తే సెంచరీ చేసేవాడని నెట్టింట పోస్టులు పెడుతున్నారు. తృటిలో సెంచరీ చేజారిపోయిందంటూ మాస్ ట్రోలింగ్ చేస్తున్నారు.

April 2, 2025 / 02:28 PM IST

విజయ డెయిరీ వద్ద సీపీఐ ధర్నా

కృష్ణా: పెంచిన పాల ధరలను వెంటనే తగ్గించాలని విజయ డెయిరీ వద్ద సీపీఐ ధర్నా చేపట్టింది. సీపీఐ నగర కార్యదర్శి కోటేశ్వరావు మాట్లాడుతూ.. సామాన్య వర్గాలకు పౌష్టికాహారం దూరం చేయడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. పాల ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు. విజయవాడ విజయ డెయిరీ రెండు రూపాయలు చొప్పున పెంచిన పాల ధరలను తగ్గించాలని సీపీఐ డిమాండ్ చేసింది.

April 2, 2025 / 02:21 PM IST

‘సన్న బియ్యం పథకం పేదల గుండెల్లో నిలిచిపోతుంది’

KNR: సన్న బియ్యం పథకం పేదల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోతుందని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పేర్కొన్నారు. బుధవారం రామడుగు మండలం వేదిర గ్రామంలో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కలెక్టర్ పమేలా సత్పతి, అడిషనల్ కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్‌తో కలిసి సన్న బియ్యం ఉచిత పంపిణి ప్రారంభించారు. దేశ చరిత్రలో సీఎం రేవంత్ రెడ్డి విప్లవాత్మకంగా చేపట్టారన్నారు.

April 2, 2025 / 02:20 PM IST