• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే

SS: తిరుమలలో కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారిని మడకశిర ఎమ్మెల్యే MS రాజు, శ్రీ సత్యసాయి జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి హనుమప్ప శనివారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి, ప్రజలందరికీ ఆయురారోగ్యాలు, దీర్ఘాయుష్షు కలగాలని ప్రార్థించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో కొంతసేపు గడిపి భక్తులకు అభివాదం చేశారు.

March 21, 2026 / 03:42 PM IST

‘క్రమశిక్షణ, సేవాభావంతో ఉన్నత శిఖరాలు సాధ్యం’

VZM: మహాశివరాత్రి సందర్భంగా రామతీర్థం, పుణ్యగిరి ఆలయాల్లో భక్తుల క్యూలైన్ నిర్వహణలో సహకరించిన ఎన్‌సీసీ విద్యార్థులను ఎస్పీ దామోదర్ తన కార్యాలయంలో శనివారం అభినందించారు. విద్యార్థులు క్రమశిక్షణతో మెలిగి, భవిష్యత్తుకు ముందస్తు ప్రణాళికలు రూపొందించుకోవాలని సూచించారు. ఎన్‌సీసీ ద్వారా సేవాభావం పెంపొందించుకుని ఉత్తమ పౌరులుగా ఎదగాలని ఆకాంక్షించారు.

March 21, 2026 / 03:41 PM IST

పండిట్ దీన్ దయాళ్ అడుగుజాడలు అనుసరణీయం: రవికుమార్

WGL: పండిట్ దీన్ దయాళ్ అడుగుజాడలు అనుసరణీయనమని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంటా రవికుమార్ అన్నారు. గిర్మాజీపేటలో ‘దీన్ దయాళ్ ప్రశిక్షణ అభియాన్’ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు పాల్గొన్నారు. నిరంతర శ్రమ, సైద్ధాంతిక నిబద్ధతతోనే సంస్థాగత నిర్మాణం మరింత పటిష్టమవుతుందని రవికుమార్ అన్నారు.

March 21, 2026 / 03:40 PM IST

రాష్ట్రానికి రానున్న 18 బ్రిటన్‌ స్కూళ్లు

TG: యూకే (బ్రిటన్‌)కు చెందిన స్కూళ్లు హైదరాబాద్‌ నగరానికి రానున్న విషయం తెలిసిందే. ఈ స్కూళ్లను ఫ్యూచర్‌సిటీతోపాటు, ఓఆర్‌ఆర్‌ శివారు ప్రాంతాల్లో ఏర్పాటు చేయనున్నట్టు సమాచారం. ఈ మేరకు స్కూళ్ల ఏర్పాటుపై హైదరాబాద్‌లో అధికారులు అత్యున్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఆయా స్కూళ్లకు అనుమతులిచ్చే అంశంపై ఈ సమావేశంలో చర్చించారు.

March 21, 2026 / 03:40 PM IST

మొబైల్ ఫోన్లలో సెక్యూరిటీపై IIIT పరిశోధనలు

HYD: మన మొబైల్ ఫోన్లలో యాప్స్ మన అనుమతి లేకుండా డేటా దొంగిలించకుండా ఉండేందుకు IIIT హైదరాబాద్ పరిశోధనలు చేస్తోదని ఆచార్య అంకిత్ గంగ్వాల్ తెలిపారు. ఫేస్ లాక్ వంటి బయోమెట్రిక్ పద్ధతులు హ్యాక్ అయితే వ్యక్తిగత సమాచారం ప్రమాదంలో పడుతుంది. దీనికి పరిష్కారంగా మల్టీ లేయర్ సెక్యూరిటీపై అధ్యయనం జరుగుతోంది.

March 21, 2026 / 03:40 PM IST

ఆలూరులో ప్రజా వినతుల స్వీకరణకు స్పందన

KRNL: ఆలూరులో టీడీపీ ఇన్‌ఛార్జ్ వైకుంఠం జ్యోతి ఆధ్వర్యంలో నిర్వహించిన గ్రీవెన్స్ కార్యక్రమానికి ప్రజలు భారీగా ఇవాళ హాజరయ్యారు. పలు గ్రామాల ప్రజలు డ్రైనేజీ, సీసీ రోడ్లు, పెన్షన్ల సమస్యలపై వినతిపత్రాలు సమర్పించారు. సమస్యలను శ్రద్ధగా విన్న జ్యోతి, వాటిని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి త్వరితగతిన పరిష్కారం చేస్తామని వెల్లడించారు.

March 21, 2026 / 03:39 PM IST

దేవరకొండలో కాంగ్రెస్‌లోకి వలసలు

NLG: దేవరకొండ మండలం జిల్లేపల్లికి చెందిన బీఆర్ఎస్ నాయకులు శనివారం ఎమ్మెల్యే బాలునాయక్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి ఎమ్మెల్యే పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ప్రజా ప్రభుత్వంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఇతర పార్టీల వారు కాంగ్రెస్‌లో చేరడం శుభసూచకమని పేర్కొన్నారు. పార్టీలో చేరిన వారిలో సుధాకర్ రెడ్డి తదితరులు ఉన్నారు.

March 21, 2026 / 03:39 PM IST

ఈద్గా వద్ద నమాజ్ ప్రార్థనల్లో ఎమ్మెల్యే కోట్ల

NDL: రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని డోన్ పట్టణంలోని ఈద్గా ప్రాంగణంలో జరిగిన ప్రత్యేక ప్రార్థనల్లో ఎమ్మెల్యే కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి పాల్గొన్నారు. ఆయన ముస్లిం సోదరులకు ఈద్ ముబారక్ శుభాకాంక్షలు తెలిపారు. మత సామరస్యాన్ని కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, సమాజంలో శాంతి, సౌభ్రాతృత్వం నెలకొనాలని ఆకాంక్షించారు.

March 21, 2026 / 03:38 PM IST

సాగునీటి పథకం పనుల పరిశీలన

ATP: ఎమ్మెల్యే పరిటాల సునీత శనివారం జీడిపల్లి రిజర్వాయర్ నుంచి అప్పర్ పెన్నార్‌కు నీరందించే సాగునీటి పథకం కాలువ పనులను పరిశీలించారు. కనగానపల్లి, రామగిరి మండలాల పరిధిలో జరుగుతున్న ఈ పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం శివపురం కొట్టాల గ్రామంలో రూ.90 లక్షల ఎన్.ఆర్.ఈ.జీ.ఎస్ నిధులతో నిర్మిస్తున్న సీసీ రోడ్డును తనిఖీ చేశారు.

March 21, 2026 / 03:38 PM IST

పెద్దాపురంలో ఘనంగా ఈదుల్ ఫితర్ వేడుకలు

KKD: పెద్దాపురం పట్టణంలో ఈదుల్ ఫితర్ (రంజాన్) పర్వదినాన్ని ముస్లిం సోదరులు భక్తిశ్రద్ధలతో అత్యంత వైభవంగా జరుపుకున్నారు. శనివారం పట్టణ శివారు కట్టమూరు పుంతలో ఉన్న చారిత్రాత్మక ఈద్గా మెట్టపై ముస్లింలు భారీ సంఖ్యలో తరలి వచ్చి సామూహిక పండుగ నమాజ్ ఆచరించారు. షాహీ జామియా మస్జీద్ ఇమామ్ అబ్దుల్ గఫ్ఫార్ ఖాన్ ఆధ్వర్యంలో ఈ ప్రార్థనలు నిర్వహించారు.

March 21, 2026 / 03:37 PM IST

‘దేవాలయాలకు పూర్వ వైభవం తీసుకురావాలి’

కోనసీమ: మలికిపురం(మం) శంకరగుప్తంలో ఉన్న శ్రీ మదన గోపాల స్వామి దేవాలయ నూతన ధర్మకర్తల కమిటీ ప్రమాణస్వీకార కార్యక్రమం శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా స్థానిక ఎమ్మెల్యే దేవా వరప్రసాద్ పాల్గొని మాట్లాడుతూ.. దేవాలయాల కీర్తి ప్రతిష్టలను కాపాడుతూ, వాటికి పూర్వ వైభవం తెచ్చేందుకు పాలకవర్గాలు కృషి చేయాలని సూచించారు.

March 21, 2026 / 03:35 PM IST

అందులో మన జిల్లా లాస్ట్..!

MDCL: స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ 2025లో భాగంగా 2002 నుంచి ఉన్న ఓటర్ జాబితాను 2025 జాబితాతో మ్యాపింగ్ చేసే ప్రక్రియలో మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా రాష్ట్రంలో చివరి స్థానంలో నిలిచింది. ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ మనూ చౌదరి తెలిపారు. ఈ సందర్భంగా అధికారులు, సూపర్వైజర్లు నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.

March 21, 2026 / 03:35 PM IST

హెల్త్ క్లినిక్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే

TPT: నాగలాపురం మండలం వినోబా నగర్‌లో నూతనంగా నిర్మించిన బీటీ రోడ్డు, హెల్త్ క్లినిక్‌ను ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే ప్రభుత్వ ధ్యేయమని తెలిపారు. రోడ్డు నిర్మాణం, క్లినిక్‌తో స్థానికులకు సౌకర్యాలు మెరుగుపడతాయని పేర్కొన్నారు.

March 21, 2026 / 03:34 PM IST

గండి అంజన్న స్వామికి ప్రత్యేక పూజలు

KDP: చక్రాయపేట మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ గండి వీరాంజనేయస్వామి ఆలయాన్ని ఇవాళ ఉదయం భక్తులు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అర్చకులు స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామివారిని భక్తులు దర్శించుకుని, తీర్థ ప్రసాదాలు అందుకున్నారు. భక్తులు తలనీలాలు సమర్పించి పాపాగ్ని నదిలో స్నానమాచరించారు.

March 21, 2026 / 03:33 PM IST

‘నిరుద్యోగ యువతను ప్రభుత్వం మోసం చేసింది’

SKLM: కూటమి ప్రభుత్వం నిరుద్యోగ యువతను మోసం చేసిందని, వారి సమస్యలు పరిష్కరించడంలో పూర్తిగా విఫలమైందని AIYF రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యుగంధర్ విమర్శించారు. శనివారం శ్రీకాకుళంలోని స్థానిక క్రాంతి భవన్‌లో ఇవాళ మీడియా సమావేశం నిర్వహించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల ప్రకారం నిరుద్యోగులకు నెలకు రూ.3000 నిరుద్యోగ భృతి ఇవ్వాలన్నారు.

March 21, 2026 / 03:33 PM IST