వివాహ బంధంపై మలయాళ నటి ఐశ్వర్య లక్ష్మి వ్యాఖ్యలు చర్చకు దారితీశాయి. బంధంలో కొనసాగడానికి పెళ్లి అనేది అవసరం లేదని ఆమె అభిప్రాయపడింది. పెళ్లి తర్వాత సంతోషంగా ఉన్నవాళ్లను తక్కువగా చూశానని.. వైవాహిక జీవితంలో వచ్చే విబేధాలు, ఒత్తిడి కెరీర్పై ప్రభావం చూపిస్తాయని చెప్పుకొచ్చింది. దీంతో పెళ్లి కంటే లివ్ ఇన్ రిలేషన్షిప్కే మొగ్గుచూపుతానని తేల్చి చెప్పింది.
W.G: జిల్లాలో ప్రజా సమస్యల పరిష్కారానికి చేపట్టిన సీపీఎం ప్రజా చైతన్య పాదయాత్ర ఇవాళ 24 రోజు 600 కిలోమీటర్లు చేరుకుంది. పాదయాత్ర భీమవరం సీపీఎం కార్యాలయానికి చేరుకుంది. జిల్లా ప్రధాన కార్యదర్శి గోపాలన్ మాట్లాడుతూ.. జిల్లాలో తాగునీరు, రోడ్ల సమస్యలు, టిట్కో గ్రుహాల సమస్యలపై ప్రజల నుంచి వినతులు వచ్చాయన్నారు. సోమవారం కలెక్టరేట్ వద్ద బహిరంగ సభ జరుగుతుందన్నారు.
KMR: కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శనివారం రంజాన్ మాసపు ఉపవాస దీక్షలు, ప్రార్థనలకు చివరి అంకమైన ఈద్-ఉల్-ఫితర్ సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సోదరభావం, సమానత్వం, సమైక్యతా స్ఫూర్తి సమాజంలో మరింత బలపడాలని ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీని బోకే, శాలువాతో సన్మానించి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.
TG: కాసేపట్లో న్యాయవాదులు, బీఆర్ఎస్ లీగల్ సెల్ సభ్యులతో మాజీ మంత్రి కేటీఆర్ సమావేశం కానున్నారు. ఆరు గ్యారెంటీలకు చట్టబద్ధత కోసం ప్రైవేటు బిల్లుపై చర్చించనున్నారు. కాగా, అసెంబ్లీలో ఆరు గ్యారెంటీలకు చట్టబద్ధత కల్పించాలని ప్రైవేటు బిల్లు పెడుతామని కేటీఆర్ చెప్పిన విషయం తెలిసిందే.
MNCL: లక్షెట్టిపేట మున్సిపాలిటీ పరిధిలోని అన్ని వార్డులలో అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయని మున్సిపల్ కమిషనర్ విజయ్ కుమార్ వెల్లడించారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. మున్సిపాలిటీలో చాలా కాలంగా డిమాండ్లో ఉన్న రోడ్డు విస్తరణ పనులను ప్రారంభించామని పేర్కొన్నారు. అలాగే ప్రధాన రహదారితో పాటు పలు రోడ్లను విస్తరిస్తున్నామని తెలిపారు. డ్రైనేజీలు రోడ్ల నిర్మాణం జరుగుతున్నాయన్నారు.
ATP: కళ్యాణదుర్గం మాజీ ఎమ్మెల్యే హనుమంతరాయ చౌదరి పార్థివ దేహానికి ప్రభుత్వ విప్ కాలువ శ్రీనివాసులు, ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు నివాళులర్పించారు. యర్రంపల్లిలోని ఆయన నివాసంలో పార్టీ జెండా కప్పి నివాళి అర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించారు. వార్డు సభ్యుని నుంచి రాష్ట్ర స్థాయి నాయకుడిగా ఎదిగిన ఆయన మరణం తీరని లోటని నేతలు అన్నారు.
E.G: మండపేట(మం) ద్వారపూడి, కేశవరంలో చేపట్టిన సీసీ రోడ్ల నిర్మాణ పనులను శనివారం రాష్ట్ర అంచనాల కమిటీ ఛైర్మన్, ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు పరిశీలించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రజలకు మెరుగైన రహదారి సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా ఈ పనులు చేపట్టినట్లు తెలిపారు. పనులు నాణ్యతతో త్వరగా పూర్తయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు.
NRML: పట్టణంలోని రామ్ మందిర్లో గల శ్రీ సీత రామాంజనేయ మందిరంలో ఈ నెల 27న జరిగే సీతారాముల కళ్యాణం మహోత్సవ ఆహ్వాన పోస్టర్లను శనివారం మున్సిపల్ వైస్ ఛైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కల్యాణ మహోత్సవానికి పట్టణ ప్రజలు అధిక సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు. ఈ ఆవిష్కరణలో కౌన్సిలర్లు, కత్తి నరేందర్ పాల్గొన్నారు.
నంద్యాల పట్టణంలోని ఫరూక్ నగర్లో ఇవాల ఆర్టీసీ బస్సు అదుపుతప్పి కరెంటు స్తంభాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో స్తంభం విరిగి పడడంతో ప్రాంతంలో భయాందోళన నెలకొంది. ఘటన సమయంలో పెద్ద ప్రమాదం తప్పిందని ప్రయానికులు ఊపిరి పీల్చుకున్నారు. స్థానికులు వెంటనే స్పందించి విద్యుత్ శాఖ సబ్స్టేషన్కు సమాచారం అందించడంతో అధికారులు విద్యుత్ సరఫరాను నిలిపివేసారు.
మైక్రోసాఫ్ట్ ఇటీవల తీసుకొచ్చిన విండోస్ 11 అప్డేట్ లక్షలాది మంది వినియోగదారులకు ఒక కొత్త సమస్యను సృష్టించింది. 24H2, 25H2 వెర్షన్లలోని ఒక బగ్ కారణంగా మైక్రోసాఫ్ట్ ఖాతాతో లాగిన్ అవ్వడం కష్టంగా మారింది. ఇంటర్నెట్ ఉన్నప్పటికీ, వన్డ్రైవ్, ఆఫీస్, టీమ్స్ వంటి యాప్లలో వినియోగదారులకు నో ఇంటర్నెట్ అనే ఎర్రర్ కనిపిస్తోంది.
E.G: ఏపీ పర్యాటక రంగాన్ని అంతర్జాతీయ పటంలో అగ్రస్థానంలో నిలిపే లక్ష్యంతో ప్రభుత్వం పని చేస్తుందని నిడదవోలు MLA, మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. శనివారం విశాఖపట్నంలో ‘హయత్’ ఫైవ్ స్టార్ హోటల్ నిర్మాణానికి మంత్రి భూమి పూజ నిర్వహించారు. సీఎం చంద్రబాబు నేతృత్వంలో జరిగిన సీఐఐ సమ్మిట్ ఫలితంగా కుదిరిన ఎంవోయూలు నేడు కార్యరూపం దాల్చుతున్నాయని తెలిపారు.
NZB: బోధన్ మండలం కల్దుర్కిలో నాఫెడ్, స్థానిక సొసైటీ ఆధ్వర్యంలో శనగ కొనుగోలు కేంద్రాన్ని శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. శనగ దిగుబడిని ఎకరాకు 7.5 క్వింటాళ్ల నుంచి 10 క్వింటాళ్లకు పెంచాలని, కౌలునామా విధానం ద్వారా కొనుగోలు చేయాలని కోరారు. కార్యక్రమంలో డీసీసీ డెలిగేట్ గంగ శంకర్, ఏఎంసీ ఛైర్మన్ చీల శంకర్ పాల్గొన్నారు.
KDP: మధ్యాహ్న భోజన పథకాన్ని ఎగతాళి చేస్తూ ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు చేసిన వ్యాఖ్యలపై RSF రాష్ట్ర అధ్యక్షుడు DM ఓబులేసు యాదవ్ ఇవాళ తీవ్రంగా ఖండించారు. గరికపాటి బేషరత్తుగా క్షమాపణ చెప్పాలని, ఆయన పద్మశ్రీ అవార్డును రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పేదల ఆకలిని, విద్యార్థుల ఆత్మగౌరవాన్ని అవమానిస్తే చూస్తూ ఊరుకోబోమన్నారు.
ASR: భూమి మనుగడకు అడవులు అవసరమని అరకు ఎఫ్ఆర్వో కోటేశ్వరరావు అన్నారు. శనివారం ప్రపంచ అటవీ దినోత్సవం, స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాలలో భాగంగా అరకులోయ అటవి శాఖ కార్యాలయ ఆవరణలో సిబ్బందితో కలిసి ఆయన మొక్కలు నాటారు. అడవుల ప్రాముఖ్యత, పరిరక్షణ, జీవవైవిధ్యంపై అవగాహన కల్పించడమే ప్రపంచ అటవీ దినోత్సవ ముఖ్య ఉద్దేశమని ఆయన తెలిపారు.