E.G: గోపాలపురం నియోజవర్గం రామన్నగూడెం గ్రామపంచాయతీ దేవినేనివారి గూడెంలో జరుగుతున్న బ్రిడ్జి నిర్మాణ పనులను శనివారం ద్వారకతిరుమల సొసైటీ ఛైర్మన్ పోలిన శ్రీనివాసరావు పరిశీలించారు. బ్రిడ్జి నిర్మాణానికి ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు రూ.50 లక్షలు నిధులు మంజూరు చేశారని తెలిపారు. ప్రభుత్వం నిర్దేశించిన నాణ్యతా ప్రమాణాలు పాటించి పనులు త్వరగా పూర్తి చేయాలన్నారు.
KMR: బిక్కనూర్ అర్చకుల అభివృద్ధికి తనవంతుగా కృషి చేస్తానని, అర్చక అభివృద్ధి సంఘ అధ్యక్షుడు కొడకండ్ల రామగిరి శర్మ చెప్పారు. శనివారం మండల కేంద్రంలోని స్థానిక సిద్ధిరామేశ్వర ఆలయంలో అర్చకులు ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. ఉగాది రోజు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉత్తమ అర్చకుడిగా ప్రశంసా పత్రం అందుకున్న సందర్భంగా అర్చకులు ఆయన్ని అభినందించారు.
TG: సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలంలో గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న వ్యభిచార గృహంపై పోలీసులు ఆకస్మిక దాడులు చేశారు. జనగామ-సూర్యాపేట జాతీయ రహదారి పక్కన వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. వివిధ ప్రాంతాల నుంచి మహిళలను తీసుకొచ్చి అక్రమ కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. పోలీసుల దాడిలో మైనర్లు పట్టుబడినట్లు తెలుస్తోంది.
AP: వ్యవసాయం చేసే చాలామంది రైతులకు ఆదాయం రావట్లేదని కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. ఒకే పంట కాకుండా ఎక్కువ పంటలు వేయాలని సూచించారు. మార్కెట్ డిమాండ్పై అవగాహన పెంచుకున్నాక పంటలు వేయాలని విజ్ఙప్తి చేశారు. రైతు ఉత్పత్తి సంఘాలుగా ఏర్పడితే లబ్ధి జరుగుతుందని తెలిపారు. మిద్దె తోటలకు బడ్జెట్ కేటాయింపుపైనా ప్రభుత్వంతో మాట్లాడతానని హామీ ఇచ్చారు.
CTR: కార్వేటి నగరం సర్కిల్ పోలీస్ స్టేషన్ పరిధిలో రంజాన్ సందర్భంగా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు సీఐ హనుమంతప్ప తెలిపారు. స్థానిక మసీదులు, ప్రార్థన మందిరాలను పోలీసు సిబ్బంది సందర్శించారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపి చాక్లెట్లు, పూలు పంపిణీ చేశారు. ప్రేమ ఆప్యాయతలను పంచుతూ.. సోదర భావాన్ని తెలియజేశారు.
WNP: కేంద్ర విశ్వవిద్యాలయాల్లో పిల్లలను చేర్పించాలని భావిస్తున్న తల్లిదండ్రులకు చక్కటి అవకాశం. 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి ఒకటో తరగతి, బాల వాటిక అడ్మిషన్ కోసం అధికారిక దరఖాస్తులు అవమానిస్తున్నట్లు ప్రిన్సిపల్ దశరథ్ రామ్ తెలిపారు. ఆసక్తి గలవారు http://admission.kvs.gov.in లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఆన్లైన్ ద్వారానే దరఖాస్తులు స్వీకరించబడతాయన్నారు.
NDL: అవుకు మండల టీడీపీ అధ్యక్షుడు ఉగ్రసేనారెడ్డి ఇవాళ మైలవరం మండలం వద్దిరాల గ్రామంలో పర్యటించారు. సుంకులమ్మ స్వామి అమ్మవారిని ఆయన దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉత్సవాల సందర్భంగా ఏర్పాటుచేసిన బండలాగుడు పోటీలను ఉగ్రసేనారెడ్డి ఘనంగా ప్రారంభించారు.
KRNL: ఆదోని నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జి, మాజీ ఎమ్మెల్యే వై.సాయి ప్రసాద్ రెడ్డిని గ్రామీణ, పట్టణ ప్రాంతాల ముస్లిం సోదరులు మర్యాదపూర్వకంగా కలిసి రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పవిత్ర ఉపవాసాలు, భక్తి ప్రార్థనలు, దువాలు, దానధర్మాలు, ఆధ్యాత్మిక చింతన, కరుణాభావంతో రంజాన్ మహిమను గుర్తుచేసుకుంటూ ఐక్యత, సౌభ్రాతృత్వం ఆకాంక్షించారు.
JG: మల్యాల మండలం కొండగట్టు ఆంజనేయస్వామిని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ఇవాళ దర్శించుకున్నారు. కరీంనగర్ మేయర్ కొలగాని శ్రీనివాస్ తోపాటు పలువురు కార్పొరేటర్లతో కలిసి అంజనేయ స్వామిని దర్శించుకున్నారు . కేంద్ర మంత్రి రాకను పురస్కరించుకుని మేళతాళాలతో ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. అంజన్న ఆలయం చుట్టూ బండి సంజయ్ ప్రదిక్షణలు చేశారు.
MHBD: నెల్లికుదురు మండలంలోని మునిగలవీడు గ్రామ శివారు ఆకేరు వాగు నుంచి ఇసుకతో వస్తున్న ట్రాక్టర్ ఎదురుగా వచ్చే ట్రాక్టర్లను తప్పించబోయి అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో ఎవరికి ఏలాంటి గాయాలు కాకపోవడంతో గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు. సంబంధిత ట్రాక్టర్ డ్రైవర్ పార్వతమ్మగూడెం గ్రామానికి చెందిన జల్లక ప్రవీణ్గా గుర్తించారు.
ATP: పుట్లూరు(మం) ఎల్లుట్లలో అకాల వర్షం, గాలివానకు దెబ్బతిన్న అరటి తోటలను YCP మండల కన్వీనర్ మహేశ్వర్ రెడ్డి శనివారం పరిశీలించారు. పంట కోత దశలో నేలపాలు కావడంతో రైతులు కన్నీరుమున్నీరవుతున్నారని తెలిపారు. బాధితులకు ధైర్యం చెప్పిన మహేశ్వర్ రెడ్డి, పంట నష్టం వివరాలను ప్రభుత్వం దృష్టికితీసుకెళ్లి పరిహారం అందేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
నాగర్ కర్నూల్ పట్టణంలో ఈద్గా వద్ద రంజాన్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి ముస్లిం సోదరులను కలిసి ప్రత్యేకంగా అలయ్ బలయ్ తీసుకున్నారు. రంజాన్ మాసం మతసామరస్యానికి ప్రతిక అని, అందరు సోదర భావంతో మెలగాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ ఛైర్మన్ రమణ రావు, తీగల సురేంద్ర, తదితరులు పాల్గొన్నారు.
ASF: జైనూర్ లో ఈనెల 15న జరిగిన అర్జున్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. మద్యం మత్తులో డబ్బుల వివాదంతోనే ఈ హత్య జరిగినట్లు CI రమేశ్ శనివారం తెలిపారు. నిందితులు ఆరుగురు కలిసి మృతుడిపై సిమెంట్ ఇటుకలు, కట్టెలతో దాడి చేశారని, ఒక నిందితుడు అమానవీయంగా పురుషాంగాన్ని కోసినట్లు విచారణలో తేలిందని వివరించారు. నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ తరలించామన్నారు
సత్యసాయి: పరిగి(మం) హైవే వద్ద ట్రాఫిక్ నియంత్రణ కోసం ఏర్పాటు చేసిన సిగ్నల్ గుర్తులు గత మూడు రోజులుగా పడిపోయి ఉండడంతో ప్రయాణికులకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ఈ విషయాన్ని గమనించిన పరిగి చిన్నపల్లి గ్రామానికి చెందిన యువకులు శనివారం స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సిగ్నల్ గుర్తులను సరిచేశారు. యువకుల ఈ సేవా భావాన్ని గ్రామ పెద్దలు అభినందించారు.
PPM: వీరఘట్టం మండలంలోని రేగులపాడు- య. వెంకమ్మరేట మధ్యలో సీఎస్పీ రహదారిపై శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో తేజ అనే యువతికి గాయాలయ్యాయి. తెట్టంగి గ్రామానికి చెందిన ఈ యువతి తన బంధువులతో కలిసి స్కూటీపై పార్వతీపురం వెళుతుండగా మార్గం మధ్యలో స్కూటీ అదుపుతప్పి రోడ్డు ప్రమాదానికి గురైంది. ఆమెను వైద్య చికిత్సల కోసం వీరఘట్టంకు తరలించారు.