• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

OTTలోకి వచ్చేస్తున్న ‘టుక్ టుక్’ మూవీ

హర్ష్ రోషన్, కార్తికేయ దేవ్, శాన్వి మేఘన ప్రధాన పాత్రల్లో సీ. సుప్రీత్ కృష్ణ తెరకెక్కించిన సినిమా ‘టుక్ టుక్’. ఇది ఈ నెల 10 నుంచి ప్రముఖ OTT సంస్థ ఈటీవీ విన్‌లో స్ట్రీమింగ్ కానుంది. దీంతో పాటు పలు సినిమాలు సదరు సంస్థలో రిలీజ్ కాబోతున్నాయి. రేపు ‘ఉద్వేగం’ మూవీ విడుదల కానుండగా..  ‘కొత్త కొత్తగా’ అనే మూవీ ఈ నెల 24 నుంచి అందుబాటులో ఉండనుంది.

April 2, 2025 / 11:20 AM IST

నూకాలమ్మ జాతరలో విషాదం.. ఇద్దరు గల్లంతు

KKD: పెద్దాపురం మండలం కాండ్రకోట నూకాలమ్మ జాతరలో విషాదం చోటు చేసుకుంది. మంగళవారం రాత్రి ఇద్దరు వ్యక్తులు ఏలేరు కాలువలోకి స్థాన్నానికి దిగి గల్లంతు అయ్యారు. స్థానికులు వివరాలు.. కాకినాడ, జగన్నాధపురం బిర్యానీ పేటకు చెందిన పిరమాడి విశాల్ (7), కొప్పాడి బాలు (22) ఇద్దరిలో ఒకరి మృతదేహం బుధవారం లభ్యమైంది. మరో మృతదేహం కోసం గాలిస్తున్నారు.

April 2, 2025 / 11:20 AM IST

ట్యాంకర్ బుకింగ్.. డెలివరీలపై ఎండీ జూమ్ మీటింగ్

HYD: టాంకర్ బుకింగ్.. డెలివరీలపై జలమండలి ఎండీ అశోక్ రెడ్డి జీఎంలతో జూమ్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎండీ మాట్లాడుతూ.. వరుసగా వచ్చిన సెలవులతో కొన్ని ప్రాంతాల్లో ట్యాంకర్ బుకింగ్‌ల పెండింగ్ పెరిగినట్టు రానున్న 2 రోజులు అదనపు గంటలు పనిచేయడానికి ఏర్పాట్లు చేయాలి అధికారులను ఆదేశించారు. రెండు షిఫ్టుల్లో ట్యాంకర్ డెలివరీ చేయడానికి ఏర్పాటు చేసుకోవాలన్నారు. 

April 2, 2025 / 11:17 AM IST

శాంతి భద్రతలకు భంగం కలిగిస్తే చర్యలు

KKD: ఎవరైనా సరే గ్రామాల్లో శాంతిభద్రతలకు భంగం కలిగించేలా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తప్పవని జగ్గంపేట సీఐ వై ఆర్.కే శ్రీనివాస్ హెచ్చరించారు. బుధవారం గండేపల్లి మండలం ఉప్పలపాడు గ్రామంలో రిప్ రాప్ తిరుగుతున్న 9 మందిని పోలీసులు పట్టుకొని బుధవారం జగ్గంపేట సర్కిల్ ఆఫీసుకి తరలించారు. వారికి జగ్గంపేట సీఐ వై ఆర్.కే శ్రీనివాస్ వారికి కౌన్సెలింగ్ ఇచ్చారు.

April 2, 2025 / 11:14 AM IST

పన్ను వసూళ్లలో రాజమండ్రి నగరపాలక సంస్థ ఫస్ట్

E.G: రాజమహేంద్రవరం కార్పొరేషన్ పన్నుల వసూళ్లలో రాష్ట్రంలోనే తొలి స్థానంలో నిలిచింది. ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి ఇంటి పన్ను, నీటి పన్ను, ఖాళీ స్థలాల పై వేసే పన్నులతో పాటు ఇతర పన్నులతో కలిసి రూ.65.19 కోట్లు వసూలు చేసినట్లు అధికారులు ప్రకటించారు. చివరి రోజున హౌస్ ట్యాక్స్ రూ.2.19 కోట్లు, ఖాళీ స్థలాల పన్నులు రూ.44.87లక్షలు, వాటర్ ఛార్జిలు రూ.24 లక్షలు వసూలయ్యయి.

April 2, 2025 / 11:13 AM IST

మాతాశిశు ఆరోగ్య కేంద్రంలో గైనకాలజిస్ట్ నియామకం

PDPL: మంథని మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో గైనకాలజిస్టును నియమించినట్లు కలెక్టర్ శ్రీహర్ష తెలిపారు. కాంట్రాక్టు పద్ధతిలో నియమితులైన డాక్టర్ బి.సోని విధుల్లో చేరినట్లు పేర్కొన్నారు. ఆసుపత్రిలో స్త్రీ వైద్య సేవలను మరింత మెరుగ్గా అందించడానికి చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. పరిసర ప్రాంత మహిళలు సేవలను వినియోగించుకోవాలని సూచించారు.

April 2, 2025 / 11:08 AM IST

4న దివ్యాంగులకు ఆర్టీసీ పాసుల జారీ

KKD: ఏప్రిల్ 4వ తేదీన కరప గ్రామ పంచాయతీ వద్ద దివ్యాంగులకు రాయితీతో కూడిన ఆర్టీసీ బస్సు పాసులు జారీ చేస్తామని కాకినాడ ఆర్టీసీ డిపో మేనేజర్ ఓ ప్రకటనలో తెలిపారు. వైద్యులు జారీ చేసిన సదరం సర్టిఫికెట్, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, ఆధార్ కార్డు,100 రూపాయలుతో దివ్యాంగులు నాలుగో తేదీ ఉదయం పంచాయతీ కార్యాలయానికి రావాలని సూచించారు. ఈ బస్సు పాస్‌కు 3సంవత్సరాల కాలపరిమితి కలదు.

April 2, 2025 / 11:05 AM IST

సిద్దిపేటలో అర్ధరాత్రి అగ్నిప్రమాదం

SDPT: జిల్లా కేంద్రంలోని మారుతీ నగర్లో అర్ధరాత్రి ఓ ఇంట్లో అగ్నిప్రమాదం జరిగింది. ప్రమాదంలో ఒక కారు, 3 బైక్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. కరెంట్ షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

April 2, 2025 / 10:59 AM IST

సీతానగరం – పురుషోత్తపట్నం రోడ్డుకు గ్రీన్ సిగ్నల్

E.G: రాజానగరం నియోజకవర్గంలో రోడ్ల మరమ్మతులకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందని ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ వెల్లడించారు. సీతానగరం నుంచి పురుషోత్తపట్నం వరకు రోడ్డు వేయడానికి ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. ఈ సందర్భంగా ఆయా గ్రామాలకు చెందిన నాయకులు, గ్రామస్తులు బుధవారం ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు.

April 2, 2025 / 10:52 AM IST

సాంకేతిక పరిజ్ఞానంతో నేరాల నియంత్రణ: ఎస్పీ

GNTR: పోలీసులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి, నేరాల నియంత్రణతో పాటు నేరస్థులను పట్టుకోవాలని గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ అన్నారు. ఈ సందర్భంగా జిల్లా పోలీసు కార్యాలయ ఆడిటోరియంలో జిల్లాలోని డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలతో నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. అధికారులు తదితరులు పాల్గొన్నారు.

April 2, 2025 / 10:52 AM IST

గ్రంథాలయ పర్సన్ ఇన్ఛార్జిగా జేసీ నియామకం

NLR: జిల్లా గ్రంథాలయ సంస్థ పర్సన్ ఇన్ఛార్జిగా జాయింట్ కలెక్టర్ కార్తీక్‌ను నియమిస్తూ గవర్నర్ తరఫున ప్రభుత్వ కార్యదర్శి కోన శశిధర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆరు నెలల పాటు కొత్త ఛైర్మన్ నియామకం అయ్యేంత వరకు శశిధర్ ఈ పదవిలో కొనసాగునున్నారు. రాష్ట్రంలోని పలు జిల్లాలకు స్పెషల్ ఆఫీసర్లుగా జిల్లా జాయింట్ కలెక్టర్లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయిన విషయం తెలిసిందే.

April 2, 2025 / 10:52 AM IST

రైలు ఢీకొని గుర్తుతెలియని యువకుడు మృతి

KMM: బోనకల్లు రైల్వే స్టేషన్ సమీపంలో బుధవారం రైలు ప్రమాదంలో గుర్తు తెలియని యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. రైల్వే పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం..రైల్వే ట్రాక్‌పై దాదాపు 30 సం.యువకుడు మృతిచెంది కనిపించాడు. ఖమ్మం అన్నం ఫౌండేషన్ నిర్వాహకుడు శ్రీనివాసరావు సహాయంతో మృతదేహాన్ని ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రి మార్చురికి తరలించారు. పోలీసులు ఘటనపై కేసు నమోదు చేశారు

April 2, 2025 / 10:50 AM IST

‘సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి’

SRCL: సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు పాటుపడాలని, కలెక్టర్ సందీప్ కుమార్ జా అన్నారు. కలెక్టరేట్ లో వర్ధంతి సందర్భంగా సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ చిత్రపటానికి జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా నివాళులర్పించారు

April 2, 2025 / 10:38 AM IST

శ్రీ సత్యసాయి జిల్లాలో నేటి నుంచి వర్షాలు

శ్రీ సత్యసాయి జిల్లా వ్యాప్తంగా నేటి నుంచి 3 రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని వాతావరణ శాఖ (APSDMA) పేర్కొంది. కాబట్టి రైతులు, కూలీలు, జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. అంతే కాకుండా వర్షాలు పడే సమయంలో రైతులు పొలాల్లోని చెట్ల కింద ఉండరాదని, వాతావరణంలో మార్పులు రాగానే ఇళ్లకు చేరుకోవాలని హెచ్చరించింది.

April 2, 2025 / 10:35 AM IST

జిల్లాకు రూ. 2.58 కోట్లు

NLR: జిల్లా వ్యాప్తంగా మహాత్మా గాంధీ జాతి ఉపాధి హామీ పథకంలో భాగంగా నీటితొట్లు నిర్మాణానికి నిధులు మంజూరైనట్లు డ్వామా పీడీ గంగాభవానీ తెలిపారు. మనుబోలులో జరుగుతున్న ఉపాధి పనులను పరిశీలించి ఆమె మాట్లాడారు. 964 నీటి తొట్టెల నిర్మాణాలకి రూ. 2.58 కోట్లు మంజూరయ్యాయన్నారు. ఒక్కో తొట్టె నిర్మాణానికి రూ.30 వేలు అందిస్తామన్నారు.

April 2, 2025 / 10:15 AM IST