• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

పాతబస్తీలో వ్యక్తి దారుణ హత్య

HYD: వ్యక్తి దారుణ హత్యకు గురైన ఘటన పాతబస్తీలోని బండ్లగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం మధ్యాహ్నం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. స్థానిక ఇందిరా నగర్‌కు చెందిన షాబాజ్ (23) అనే వ్యక్తిపై దుండగులు కిరాతకంగా కత్తులతో దాడి చేసి చంపేశారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్లూస్ టీం సహాయంతో దర్యాప్తు చేపట్టారు.

February 6, 2025 / 06:33 PM IST

‘గంజాయి నిర్మూలనకు భాగస్వామ్యం కావాలి’

NLR: గంజాయి నిర్మూలనలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని ఆత్మకూరు DSP వేణుగోపాల్ తెలిపారు. డివిజన్ పరిధిలో గంజాయి నిర్మూలనకు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని, ఇందులో భాగంగా నిరంతరం దాడులు కొనసాగుతాయని ఆయన స్పష్టం చేశారు. గంజాయి నిర్మూలనలో తల్లిదండ్రుల పాత్ర కీలకమని డీఎస్పీ పేర్కొన్నారు.

February 6, 2025 / 06:19 PM IST

జిల్లా మంత్రులకు ర్యాంకులు ప్రకటించిన సీఎం

ATP: అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల మంత్రులకు సీఎం చంద్రబాబు నాయుడు ర్యాంకులు ప్రకటించారు. గతేడాది జూన్ 12న మంత్రులుగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి డిసెంబర్ వరకు ఫైళ్ల క్లియరెన్స్‌లో పనితీరు ఆధారంగా ఈ ర్యాంకులను ప్రకటించారు. ఈ నేపథ్యంలో మంత్రి సత్యకుమార్ యాదవ్-7, సవిత-11, పయ్యావుల కేశవ్-24వ ర్యాంకులు సాధించారు.

February 6, 2025 / 05:30 PM IST

రైల్వే ట్రాక్ సురక్షితపై డిఆర్ఎం పరిశీలన

ATP: గుంతకల్ డివిజన్ రైల్వే మేనేజర్ శాఖా కార్యాలయాలతో కలిసి గుంతకల్-నల్వార్ స్టేషన్ మధ్య రైల్వే ట్రాక్ సురక్షితతను గురువారం సమీక్షించారు. ట్రాక్, సిగ్నల్ సిస్టమ్, సేఫ్టీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిచూసేందుకు రియర్ విండో పరిశీలన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖా అధికారులు, టెక్నికల్ టీమ్‌లు పాల్గొన్నారు.

February 6, 2025 / 05:25 PM IST

మెట్‌పల్లిలో డ్రోన్ ద్వారా పలు సర్వే పాయింట్లు గుర్తింపు

JGL: తెలంగాణ ప్రభుత్వం అమృత్ 2.0 కింద మెట్‌పల్లిలో గురువారం నూతన మాస్టర్ ప్లాన్ కొరకు డ్రోన్ ద్వారా సర్వే ఆఫ్ ఇండియా డిపార్ట్మెంట్ ద్వారా సర్వే నిర్వహించాలని అదేశించారు. ఈ మేరకు మున్సిపల్ ప్రత్యేక అధికారి అదనపు కలెక్టర్ గౌతమ్ రెడ్డి సర్వేను ప్రారంభించారు. పట్టణములో 50 సర్వే పాయింట్లు గుర్తించామని, ఈ సర్వేకు పట్టణ ప్రజలు అందరూ సహకరించాలని కోరారు.

February 6, 2025 / 05:19 PM IST

సైబర్ నేరాలు, డ్రగ్స్ అనర్థాలపై అవగాహన

ATP: అనంతపురం జిల్లా ఎస్పీ శ్రీ పి. జగదీష్ గురువారం సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్‌తో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సైబర్ నేరాలు, రోడ్డు సేఫ్టీ, డ్రగ్స్ అనర్థాలపై ప్రజల్లో అవగాహన తెచ్చేందుకు సృజనాత్మక రీల్స్, పోస్ట్లు, వీడియోలు తయారు చేయాలని కోరారు. యువతకు చేరేలా సామాజిక బాధ్యతగా ఈ విషయాలపై కంటెంట్ సృష్టించాలని ఎస్పీ జగదీష్ తెలిపారు.

February 6, 2025 / 05:12 PM IST

‘ఎమ్మెల్సీ అభ్యర్థి విజయానికి కృషి చేయాలి’

E.G: ఉభయగోదావరి జిల్లాల పట్టబద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో పోటీ చేస్తున్న పేరాబత్తుల రాజశేఖర్ విజయానికి కూటమి పార్టీ నాయకులు కృషి చేస్తున్నారు. కొత్తపేట కళానగర్ వినాయకుని గుడిలో పూజలు జరిపించి కొత్తపేట నియోజక వర్గ ఎమ్మెల్యే సత్యానందరావు తనయుడు బండారు సంజీవ్ ఆధ్వర్యంలో కొత్తపేటలో గురువారం ప్రచారం నిర్వహించారు. అనంతరం సంజీవ్ పట్టభద్రులను కలిసి ఓటు అభ్యర్థించారు.

February 6, 2025 / 05:06 PM IST

‘రైతుల పొలాలకు దారి ఇప్పించండి’

NDL: బేతంచెర్ల మండలంలోని రంగాపురం గ్రామం వద్ద ఎన్‌హెచ్ 340B హైవే రహదారికి తూర్పున ఉన్న పొలాలకు రస్తా కోసం రైతులు నిరసన చేపట్టారు. ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి పొలాలకు వెళ్లే రాస్తాను గురువారం పరిశీలించారు. అనంతరం ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు. గ్రామ రైతులు ఎమ్మెల్యే కోట్లకు వినతిపత్రం అందజేశారు.

February 6, 2025 / 04:49 PM IST

బాధిత కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే

ATP: ఎమ్మెల్యే బండారు శ్రావణి బుక్కరాయసముద్రం మండలంలో పర్యటించారు. రేగడికొత్తూరుతో అనారోగ్యంతో బాధపడుతున్న ఈశ్వరయ్యను ఆమె పరామర్శించారు. అనంతరం ఆకులేడు గ్రామంలో నాగరాజు భౌతికకాయానికి నివాళి అర్పించారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

February 6, 2025 / 04:18 PM IST

బుచ్చిలో రేపు పర్యటించనున్న ఎమ్మెల్యే ప్రశాంతి

NLR: బుచ్చి మండలంలో శుక్రవారం సాయంత్రం ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి పర్యటించనున్నారు. పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయంలో దివ్యాంగులకు బ్యాటరీ సైకిల్, వినికిడి యంత్రాలు పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారని ఆమె కార్యాలయ సిబ్బంది తెలిపారు. మండలంలోని కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొనాలని కోరారు.

February 6, 2025 / 04:16 PM IST

టీపీసీసీ అధ్యక్షులను కలిసిన రంజిత్ రెడ్డి

MHBD: నెల్లికుదురు మండలం రామన్నగూడేనికి చెందిన జిల్లా కాంగ్రెస్ నాయకులు కాసం రంజిత్ రెడ్డి ఈరోజు టీపీసీసీ రాష్ట్ర అధ్యక్షులు మహేశ్ కుమార్ గౌడ్‌ని హైదరాబాద్‌లోని తన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులపై చర్చించినట్లు తెలిపారు.

February 6, 2025 / 04:00 PM IST

సిమెంట్ రోడ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే సోమిరెడ్డి

NLR: ముత్తుకూరు మండలం వల్లూరులోని పశువైద్యశాలతోపాటు సిమెంట్ రోడ్లను MLA సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గురువారం ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అభివృద్ధి ధ్యేయంగా పని చేస్తుందని చెప్పారు. ఎంపీడీవో, సచివాలయం సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉంటూ సంక్షేమ పథకాలు అమలుపై ఆరా తీయాలన్నారు.

February 6, 2025 / 03:58 PM IST

సినిమా రంగంలో.. కురవి కుర్రాడు!

MHBD: కురవి మండలానికి చెందిన శ్రీనాథ్ సినీ రంగంలో తొలి అడుగు వేశారు. సినీ రంగంపై మక్కువ పెంచుకున్న శ్రీనాథ్.. తల్లిదండ్రుల ఆశీస్సులతో, కాలాన్ని భవిష్యత్తుని ఫణంగా పెట్టి కఠోర శ్రమతో నేడు అసోసియేట్ డైరెక్టర్‌గా ఎదిగారు. ఈనెల 7న విడుదల కాబోయే, నాగచైతన్య, సాయిపల్లవి నటించిన తండేల్ చిత్రంలో తన ప్రతిభ పరిచయం చేస్తున్నాడు.

February 6, 2025 / 03:56 PM IST

సీఐ కిషన్‌కు వినతి పత్రం అందించిన గ్రామస్తులు

WGL: గ్రేటర్ వరంగల్ పరిధిలోని 46వ డివిజన్ రాంపురం శివారులో ఉన్న డంపింగ్ యార్డ్‌ను వెంటనే ఎత్తివేసేలా చేపట్టే ఉద్యమానికి సహకరించాలని కోరుతూ మడికొండ సీఐ పీ.కిషన్‌కు పలు గ్రామాల ప్రజలు వినతి పత్రం అందజేశారు. రాంపురం, మడికొండ గ్రామాల ప్రజలు నేడు సీఐని కలిసి సమస్య తీవ్రతను వివరించి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

February 6, 2025 / 03:52 PM IST

తాడేపల్లిగూడెంలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం

W.G: రాష్ట్రంలోని పట్టభద్రులంతా జనసేన వైపు చూస్తున్నారని తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. గురువారం తాడేపల్లిగూడెం జనసేన పార్టీ కార్యాలయంలో కూటమి నాయకులతో సమావేశం నిర్వహించారు. ఉద్యోగాలు లేక ఇతర రాష్ట్రాలకు యువత వెళ్ళిపోతున్నారన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలంటే కూటమి అభ్యర్థి రాజశేఖరంను గెలిపించుకోవాలన్నారు.

February 6, 2025 / 02:36 PM IST