MDK: మనోహరాబాద్ మండలం దండుపల్లి వద్ద గల తూప్రాన్ అటవీశాఖ రేంజ్ కార్యాలయంలో ప్రపంచ అటవీ దినోత్సవం వేడుకలు నిర్వహించారు. తూప్రాన్ రేంజ్ ఆఫీసర్ అంబర్ సింగ్ ఆధ్వర్యంలో రేంజ్ కార్యాలయ ఆవరణలో మొక్కలు నాటారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని అంబర్ సింగ్ సూచించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ చంద్రశేఖర్ రెడ్డి, సెక్షన్ ఆఫీసర్ ఓంకార్ తదితరులు పాల్గొన్నారు.