• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

గురుకులాల ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం

NLR: జిల్లాలోని  అక్కచెరువు పాడు, గండిపాళెం, తుమ్మల పెంట, ఆత్మకూరు గురుకుల పాఠశాలలో 2025-26 సంవత్సరానికి గాను 5,6,7,8 తరగతులలో ప్రవేశం ఉందని గురుకులాల జిల్లా కన్వీనర్ జీ.మురళీకృష్ణ ఒక ప్రకటనలో తెలిపారు. అర్హులు ఆన్లైన్‌ https://aprs.apcfss.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చుసుకోవాలన్నారు. ఈ నెల 6 తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని, 25న ప్రవేశ పరీక్ష ఉంటుందన్నారు.

April 2, 2025 / 07:11 AM IST

పర్చూరులో విషాదం.. యువకుడు మృతి

BPT: బాపట్ల జిల్లా పర్చూరు పంచాయతీ పరిధిలోని నెహ్రూనగర్‌లో మంగళవారం విషాదం చోటుచేసుకుంది. చుక్కా వంశీ అనే యువకుడు ఆరు మంది స్నేహితులతో కలిసి సముద్ర స్నానానికి వాడరేవు వెళ్ళాడు. వంశీ స్నానం చేస్తుండగా సముద్రంలో మునిగి చనిపోయాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చీరాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

April 2, 2025 / 07:01 AM IST

పెట్రోల్ పోసి నిప్పంటించిన మహిళ

PLD: క్రోసూరు మండలంలోని ఉయ్యందన గ్రామంలో శ్రీలక్ష్మి అనే మహిళ తమ్మిశెట్టి చిరంజీవిపై పెట్రోల్ పోసి నిప్పు అంటించింది. తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నాడని కోపంతో ఈ దాడి చేసినట్లు యువతి స్థానికులకు తెలిపింది. కాగా క్షతగాత్రుడిని సత్తెనపల్లి ప్రభుత్వ వైద్యశాలకు కుటుంబ సభ్యులు తరలించి వైద్య సేవలు అందిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

April 2, 2025 / 06:51 AM IST

బొబ్బిలి సీఐను అభినందించిన ఎస్పీ

VZM: గంజాయి కేసును ఛేదించినందుకు గాను బొబ్బిలి రూరల్ సీఐ నారాయణరావును ఎస్పీ వకుల్ జిందాల్ అభినందించారు. ఫిబ్రవరి 10న కారులో తరలిస్తున్న గంజాయిని రామభద్రపురం మండలం కొట్టక్కి చెక్ పోస్ట్ వద్ద పోలీసులను చూసి నిందితులు పరారయ్యారు. ఈ  కేసును సమగ్ర దర్యాప్తు చేసి నలుగురు నిందితులను అరెస్టు చేయడంతో రూరల్ సీఐ నారాయణరావుకు ప్రశంస పత్రం ఇచ్చి ఎస్పీ అభినందించారు.

April 2, 2025 / 06:27 AM IST

అందుకే కొన్నాళ్లు బ్రేక్‌: మాధవన్‌

నటుడు మాధవన్ తాజాగా పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘ఒకానొక సమయంలో తీరిక లేకుండా పని చేయాల్సి వచ్చింది. ఆ విసుగుతో నటనకు కొన్నాళ్లు విరామం ఇచ్చి, కేరళ వీధుల్లో తిరిగేవాడిని. పొటాటో, పప్పుల ధరలెంత? ప్రజలు వేటిని ఎక్కువగా ఇష్టపడుతున్నారు? తదితర విషయాలు తెలుసుకోవాలనుకున్నా. గడ్డం పెంచి, దేశం మొత్తం తిరిగా’ అని పేర్కొన్నాడు.

April 1, 2025 / 08:22 PM IST

అభయ ఆంజనేయస్వామి ఆలయంలో దుండగులు చోరీ

ATP: గుత్తి పట్టణంలోని బీసీ కాలనీ నందుగల అభయ ఆంజనేయ స్వామి దేవాలయంలో మంగళవారం గుర్తుతెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు. ఆలయంలో ఎవరు లేని సమయంలో హుండీ తాళాలు పగలగొట్టి సుమారు రూ. 20,000 నగదు ఎత్తుకెళ్లినట్లు ఆలయ అర్చకులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆలయ కమిటీ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

April 1, 2025 / 07:50 PM IST

నాణ్యతతో కూడిన నిర్మాణాలు చేపట్టండి: కలెక్టర్

TPT: తిరుపతి నగర పాలక సంస్థ కార్యాలయంలో అధికారులతో జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు మంగళవారం సమావేశమయ్యారు. నగరంలోని చెరువులలో జరుగుతున్న అభివృద్ధి, సుందరీకరణ పనులు గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. నాణ్యతతో కూడిన నిర్మాణాలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ బన్సల్, కమిషనర్ మౌర్య పాల్గొన్నారు

April 1, 2025 / 07:28 PM IST

బండి సంజయ్ కలలు ఫలించవు: కోమటిరెడ్డి

TG: సన్నబియ్యం పంపిణీ చరిత్రలో నిలిచిపోయే కార్యక్రమం అని మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి అన్నారు. సన్నబియ్యం పథకంలో కేంద్రం వాటా ఉందని బండి సంజయ్ చేస్తున్న విమర్శల్లో అర్థం లేదని ఆయన మండిపడ్డారు. రూ.500కే గ్యాస్, సన్నబియ్యం దేశంలో తెలంగాణ తప్ప ఏ రాష్ట్రం ఇవ్వడం లేదన్నారు. అధికారంలోకి వచ్చిన 12 నెలల్లోనే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశామని తెలిపారు.

April 1, 2025 / 05:29 PM IST

పరారీలోకి వెళ్లినట్లు వార్తలు.. కాకాణి స్పందన

AP: తను అజ్ఞాతంలోకి వెళ్లినట్లు వస్తున్న వార్తలపై మాజీమంత్రి కాకాణి గోవర్ధన్ స్పందించారు. తను ఎక్కడికి వెళ్లలేదని.. ఇంట్లోనే ఉన్నట్లు తెలిపారు. తను నెల్లూరులో లేని టైంలో తన ఇంటి గోడకు పోలీసులు నోటీసులు అంటించారని చెప్పారు. బెయిల్ రాకుండా చేసేందుకే SC, ST కేసు నమోదు చేశారని.. ఇటువంటి కేసులకు బయపడే ప్రసక్తే లేదన్నారు. మంత్రిగా ఉన్న టైంలో ఎలాంటి అవినీతికి పాల్పడలేదని అన్నారు.

April 1, 2025 / 05:25 PM IST

‘HCU భూముల విక్రయం విరమించుకోవాలి’

SRCL: HCU భూముల విక్రయం విరమించుకోవాలని BRSV నేత పోతు అనిల్ కుమార్ అన్నారు. మంగళవారం వేములవాడలో విలేకరులతో మాట్లాడుతూ.. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో 400ఎకరాలు అన్యాక్రతం అవుతున్న దానికి విద్యార్థులు చేస్తున్న నిరసనను పోలీసులు అడ్డుకొని విద్యార్థుల పై దాడి చేస్తూ కనీసం మహిళలు అని కూడా చూడకుండా వారిని అరెస్టు చేశారన్నారు.

April 1, 2025 / 05:18 PM IST

పల్టీలు కొట్టిన కారు.. పలువురికి గాయాలు

NTR: విజయవాడ-మచిలీపట్నం జాతీయ రహదారిపై చిట్టి గూడూరు వద్ద మంగళవారం మధ్యాహ్నం రోడ్డు ప్రమాదం జరిగింది. విజయవాడ నుండి పాలకొల్లు వెళ్తున్న ఏపీ39 HQ6336 కారుకు బైకు అడ్డం రావడంతో ఈ ప్రమాదం జరిగింది. రెండు ఒకే వైపు వస్తుండగా జరిగినా ఈ ప్రమాదంతో పొదల్లోకి కారు పల్టీలు కొడుతూ దూసుకెళ్ళింది. కారులో ఉన్న వారికి తీవ్ర గాయాలు కాగా, పోలీసులు ఆసుపత్రికి తరలించారు.

April 1, 2025 / 05:17 PM IST

వర్ధన్నపేటలో భారీగా గంజాయి పట్టివేత

WGL: వర్ధన్నపేట బస్టాండ్ సమీపంలో గంజాయిని విక్రయించడానికి ప్రయత్నిస్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసి 25 కిలోల శుద్ధి గంజాయిని పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. వర్ధన్నపేట బస్టాండ్ సమీపంలో గంజాయి విక్రయాలు జరుగుతున్నట్లు అందిన సమాచారం మేరకు అనుమానాస్పదంగా ఉన్న ఇద్దరు యువకులను అరెస్ట్ చేసి విచారణ జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.

April 1, 2025 / 05:11 PM IST

ఈనెల 4న నమోదు చేయించుకోవాలి

ASR: సదరం ధృవపత్రాలు జారీ చేయడం కోసం ఏప్రిల్, మే, జూన్ నెలల్లో వైద్య పరీక్షలు నిర్వహిస్తామని కొయ్యూరు ఎంపీడీవో ఎస్కేవీ ప్రసాద్ మంగళవారం తెలిపారు. ధృవపత్రాలు అవసరమైన వవారు ముందుగా స్లాట్లు బుక్ చేసుకోవాలన్నారు. ఈనెల 4న మండలంలోని గ్రామ సచివాలయాలు, మీసేవా కేంద్రాల్లో స్లాట్లు నమోదు చేస్తారన్నారు. ఈమేరకు తమ పరిధిలోని కేంద్రాల్లో నమోదు చేసుకోవాలన్నారు.

April 1, 2025 / 05:11 PM IST

బాపట్లలో రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్

BPT: బాపట్ల రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రౌడీ షీటర్లకు, అనుమానాస్పద వ్యక్తులకు పోలీసులు మంగళవారం కౌన్సెలింగ్ నిర్వహించారు. స్టేషన్ పరిధిలో ఎవరైనా చట్ట వ్యతిరేక, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే ఉపేక్షించమని హెచ్చరించారు. అనునిత్యం పట్టణంలో పోలీసు నిఘా ఉంటుందని తెలిపారు. 

April 1, 2025 / 04:57 PM IST

నిజాం పరిపాలన కొనసాగిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం

WNP: సెంట్రల్ యూనివర్సిటీ HCU 400ఎకరాల భూమిని కాంగ్రెస్ ప్రభుత్వం వేలంవెయ్యడాన్ని జిల్లా బీజేపీ అధ్యక్షులు నారాయణ ఖండించారు. మంగళవారం పార్టీ ఆఫీస్‌లో ఆయన మాట్లాడుతూ.. విద్యసంస్థలను అభివృద్ధి చేయకుండా భూములను వేలంవేస్తూ విద్యావ్యవస్థను కూని చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో 9వ నిజాం పరిపాలన కొనసాగిస్తుందని విమర్శించారు.

April 1, 2025 / 04:43 PM IST