NTR: విజయవాడ మధురానగర్ నేతాజీ కాలనీలో నివాసం ఉంటున్న బుక్త జ్యోతి ప్రజా దర్బార్ కార్యక్రమంలో పాల్గొని, గత కొంతకాలంగా కంటి సమస్యతో బాధపడుతూ,సరిగ్గా చూడలేకపోతున్నానని ఎమ్మెల్యే బోండా ఉమా దృష్టికి తీసుకువెళ్లారు. ఎమ్మెల్యే తక్షణమే స్పందించి, జ్యోతికు అవసరమైన కళ్ళజోళ్లను శుక్రవారం ఉచితంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
RR: శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ ఇంఛార్జ్ జగదీశ్వర్ గౌడ్ ఆదిత్య నగర్ ఈద్గాలో నిర్వహించిన రంజాన్ వేడుకల్లో పాల్గొని ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం అన్ని మతాలను సమానంగా గౌరవిస్తూ ముస్లింల సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని కొనియాడారు.
NLR: కందుకూరి ఎమ్మెల్యే నాగేశ్వరరావు ముస్లిం సోదర సోదరీమణులకు పవిత్ర రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. పవిత్ర దివ్య ఖురాన్ అవతరించిన ఈ మాసంలో కఠిన ఉపవాస దీక్షలకు రంజాన్ ఒక ముగింపు వేడుక అన్నారు. ఈద్ పండుగ అందరి ఇంట కొత్త వెలుగులు తీసుకురావాలని, అల్లాహ్ దీవెనలతో ఆరోగ్యం, ఐశ్వర్యం నిండాలన్నారు. రంజాన్ పండుగను సుఖసంతోషాలతో జరుపుకోవాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు.
NZB: జక్రాన్పల్లి మండలం అర్గుల్లో ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద శనివారం శ్రీనివాస్ గౌడ్ దంపతులు గృహ ప్రవేశం చేశారు. ఈ కార్యక్రమానికి మాజీ జిల్లా సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు రాజేందర్ హాజరయ్యారు. నిరుపేదల సొంతింటి కల నెరవేరుస్తున్న ప్రభుత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ వేడుకలో లబ్ధిదారుల కుటుంబ సభ్యులు పాలుగోన్నారు.
SRCL: వేములవాడలో జరిగిన రంజాన్ పండుగ వేడుకల్లో ప్రభుత్వ విప్, వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రభుత్వం ముస్లింల సంక్షేమానికి కృషి చేస్తుందన్నారు. అలాగే ముస్లింలకు రంజాన్ పవిత్ర మాసం అన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ పుల్కం రాజు, వైస్ ఛైర్మన్ నరాల శేఖర్, మున్సిపల్ కౌన్సిలర్లు పాల్గొన్నారు.
MDK: పాపన్నపేటలో వాహనాల తనిఖీలలో 224 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. హైదరాబాద్ నుంచి తరలిస్తున్న లారీని ఆపి తనిఖీ చేయగా బియ్యం బయటపడింది. సమాచారం అందుకున్న సివిల్ సప్లై అధికారులు ఘటనాస్థలానికి చేరుకుని బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా, అక్రమ రవాణాపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
MLG: జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నిర్మాణం కోసం భూమి కేటాయించాలని ఇవాల జిల్లా కలెక్టర్ టి.ఎస్. దివాకర్కు, జిల్లా DCC అధ్యక్షుడు అశోక్ వినతిపత్రం అందజేశారు. పార్టీ కార్యాలయం లేకపోవడంతో కార్యకలాపాలు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని, పార్టీ సంస్థాగత కార్యక్రమాలు సాగించలేకపోతున్నాయని తెలిపారు. త్వరగా భూమి కేటాయించాలని కోరారు.
NRML: మామడ మండలం బండల్ ఖానాపూర్ గ్రామంలో సర్పంచ్ జాదవ్ కళ్యాణి కోతుల సమస్యను అద్భుతంగా పరిష్కరించారు. పంచాయతీ కార్మికుడిని చింపాంజీ వేషంలో గ్రామంలో తిప్పించినందున భయపడిన కోతులు పారిపోయి, దీంతో గ్రామస్థులకు ఉపశమనం లభించింది. స్థానికులు సర్పంచ్ ఆలోచనను ప్రశంసిస్తూ, ఇది కోతుల సమస్యకు సరికొత్త పరిష్కారం అని తెలిపారు.
శ్రీకాకుళం: నగరంలోని సూర్య మహల్ జంక్షన్ వద్ద ఉన్న జమియా మసీదులో రంజాన్ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు ఘనంగా నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్ ముఖ్య అతిథిగా హాజరై ముస్లిం సోదర సోదరీమణులతో కలిసి ప్రార్థనల్లో పాల్గొన్నారు. రంజాన్ పర్వదినం శాంతి, సహనం, సౌహార్దానికి ప్రతీకగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు.
TG: రాష్ట్ర ప్రజల పాలిట కాళేశ్వరం ప్రాజెక్ట్ వరం అని బీఆర్ఎస్ నేత, మాజీమంత్రి హరీష్ రావు అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు వల్లే పంటల దిగుబడి పెరిగిందని పేర్కొన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఒత్తిడితోనే మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ప్రారంభించారని తెలిపారు. పంటలకు మద్ధతు ధర లేక రైతులు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం మొక్కజొన్న రైతులను ఆదుకోవాలని కోరారు.
WGL: ఖానాపూర్ (M) పాకాల సరస్సు ప్రకృతి సోయగాలకు ప్రసిద్ధి చెందింది. కాకతీయుల కాలంలో నిర్మితమైన ఈ సరస్సు సాగునీటి అవసరాలను తీర్చడంలో కీలక పాత్ర పోషిస్తోంది. ఇటీవల వర్షాలతో నీటి మట్టం పెరిగి పరిసర ప్రాంతాలు పచ్చదనంతో కళకళలాడుతున్నాయి. పర్యాటకులు అధిక సంఖ్యలో తరలివచ్చి ప్రకృతి అందాలను ఆస్వాదిస్తున్నారు. అధికారులు తెలిపారు.
KMR: బాన్సువాడ మండలం బొర్లంలో శనివారం మతసామరస్యం వెల్లివిరిసింది. హనుమాన్ మాలధారణ చేసిన స్వాములకు ముస్లిం సోదరుడు సద్దాం ప్రత్యేకంగా భిక్ష (అన్నదానం) ఏర్పాటు చేశారు. భక్తి, మానవత్వం మతాల కంటే గొప్పవని ఆయన చాటిచెప్పారు. ఇలాంటి కార్యక్రమాలు సమాజానికి మంచి సందేశాన్ని ఇస్తాయని, అందరూ ఐక్యంగా ఉండాలని స్వాములు ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.
మన్యం: మక్కువ మండలం కన్నంపేట గ్రామంలో శుక్రవారం పిడుగు పడి నల్ల గోపి అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. శుక్రవారం సాయంత్రం ఈదురు గాలులతో కూడిన భారీ వర్షంతో పిడుగులు పడ్డాయి. అదే సమయంలో పొలంలో ఉన్న నల్ల గోపి, బలగ సాయి అనే ఇద్దరి వ్యక్తులకు పిడుగు పాటు వల్ల గాయాలయ్యాయి.
KKD: ఈ నెల 24న జిల్లా ఉపాధి కార్యాలయంలో 62 ఉద్యోగాలకు జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి జి.శ్రీనివాసరావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఫోన్ పే, రామకృష్ణ ఎలక్ట్రికల్ వర్క్స్ వంటి సంస్థలలో పనిచేసేందుకు అభ్యర్థుల ఎంపిక జరుగుతుందన్నారు. 18 నుంచి 35 ఏళ్ల వయసు ఉన్న వారు టెన్త్ నుంచి డిగ్రీ అర్హత కలిగిన వారు ఉదయం 10 గంటలకు ధ్రువపత్రాలతో రావాలన్నారు.
TG: కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి పార్టీ మారుతారనే ప్రచారం జోరుగా సాగుతుంది. అయితే కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్తో జీవన్ రెడ్డి సమావేశం కావాల్సి ఉండగా.. జగిత్యాలలో రంజాన్ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ క్రమంలో BRS నేతలతో సరదాగా ముచ్చటించారు. అధిష్ఠానం నుంచి ఎలాంటి ఫోన్ రాలేదని.. ఈనెల 25న భవిష్యత్ కార్యచరణ ప్రకటిస్తారని ప్రచారం జరుగుతుంది.