NTR: విజయవాడ-మచిలీపట్నం జాతీయ రహదారిపై చిట్టి గూడూరు వద్ద మంగళవారం మధ్యాహ్నం రోడ్డు ప్రమాదం జరిగింది. విజయవాడ నుండి పాలకొల్లు వెళ్తున్న ఏపీ39 HQ6336 కారుకు బైకు అడ్డం రావడంతో ఈ ప్రమాదం జరిగింది. రెండు ఒకే వైపు వస్తుండగా జరిగినా ఈ ప్రమాదంతో పొదల్లోకి కారు పల్టీలు కొడుతూ దూసుకెళ్ళింది. కారులో ఉన్న వారికి తీవ్ర గాయాలు కాగా, పోలీసులు ఆసుపత్రికి తరలించారు.