ASR: సదరం ధృవపత్రాలు జారీ చేయడం కోసం ఏప్రిల్, మే, జూన్ నెలల్లో వైద్య పరీక్షలు నిర్వహిస్తామని కొయ్యూరు ఎంపీడీవో ఎస్కేవీ ప్రసాద్ మంగళవారం తెలిపారు. ధృవపత్రాలు అవసరమైన వవారు ముందుగా స్లాట్లు బుక్ చేసుకోవాలన్నారు. ఈనెల 4న మండలంలోని గ్రామ సచివాలయాలు, మీసేవా కేంద్రాల్లో స్లాట్లు నమోదు చేస్తారన్నారు. ఈమేరకు తమ పరిధిలోని కేంద్రాల్లో నమోదు చేసుకోవాలన్నారు.