AP: కాసేపట్లో రాష్ట్రంలో పదో తరగతి పరీక్షా ఫలితాలు విడుదల కానున్నాయి. 10వ తరగతి పబ్లిక్ పరీక్షలతో పాటు ఓపెన్ స్కూల్ పదో తరగతి, ఓపెన్ స్కూల్ ఇంటర్ ఫలితాలను కూడా విడుదల చేయనున్నట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం తెలిపింది. ఈ ఏడాది పబ్లిక్ పరీక్షలకు దాదాపు 6 లక్షల మందికిపైగా విద్యార్థులు హాజరయ్యారు. కాగా.. విద్యార్థులు తమ ఫలితాల వివరాలను HIT TV యాప్లో చూసుకోవచ్చు.