TPT: తిరుపతి నగర పాలక సంస్థ కార్యాలయంలో అధికారులతో జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు మంగళవారం సమావేశమయ్యారు. నగరంలోని చెరువులలో జరుగుతున్న అభివృద్ధి, సుందరీకరణ పనులు గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. నాణ్యతతో కూడిన నిర్మాణాలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ బన్సల్, కమిషనర్ మౌర్య పాల్గొన్నారు