• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

ఆవిష్కరణకు నోచుకోని అంబేద్కర్ విగ్రహం

NGKL: అమ్రాబాద్ మండలం కల్ములోనిపల్లిలో ఎనిమిదేళ్ల క్రితం తెచ్చిన డాక్టర్ బీఆర్. అంబేడ్కర్ విగ్రహం ఇప్పటికీ ఆవిష్కరణకు నోచుకోలేదు. ప్రస్తుత ఎమ్మెల్యే వంశీకృష్ణ గతంలో అందించిన ఈ విగ్రహాన్ని రాజకీయ కారణాలతో ఒక మూల పడేశారు. ప్లాస్టిక్ కవర్ కప్పి చెత్త కుప్పలో ఉంచడంపై గ్రామ యువత తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు.  ఈ ఘటనపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

March 21, 2026 / 11:28 AM IST

సంబేపల్లిలో ఘనంగా రంజాన్ వేడుకలు

అన్నమయ్య: సంబేపల్లిలో రంజాన్ వేడుకలు శనివారం ఘనంగా జరిగాయి. నెలరోజులు ఉపవాస దీక్షలో పాల్గొన్న ముస్లింలు చివరి రోజు ఈద్గా వద్దకు వెళ్లారు. అందరూ కలిసి ప్రార్థనలు చేశారు. ఒకరినొకరు ఆలింగనం చేసుకుని రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం పేదలకు దానధర్మాలు చేశారు.

March 21, 2026 / 11:28 AM IST

రైతు సంఘం రాష్ట్ర మహాసభ ఆహ్వాన సమావేశం

ELR: రేపు ఉదయం 10 గంటలకు ఏలూరులోని యూటీఎఫ్ భవనంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర మహాసభల ఆహ్వాన సంఘ సమావేశం నిర్వహిస్తున్నట్లు ఆ సంఘం జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాస్ ఇవాళ తెలియజేశారు. ఏలూరు పవర్ పేట అన్నే భవనంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఏలూరులో మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర 23వ మహాసభలు జూన్ 3, 4, 5 తేదీలలో నిర్వహిస్తున్నామన్నారు.

March 21, 2026 / 11:28 AM IST

బ్రహ్మంగారిమఠం బయలు దేరిన తీలేరు భక్తులు

NRPT: మరికల్ మండలం తీలేరులో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. గత మూడు రోజుల క్రితం గ్రామంలో ప్రదర్శించిన శ్రీశ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి జీవిత చరిత్ర వీధి నాటకంలో పాల్గొన్న భక్తులు, కళాకారులు శనివారం కడప జిల్లాలోని బ్రహ్మంగారిమఠం దర్శనార్థం బయలుదేరి వెళ్లారు. స్వామి వారి పాత్రలు పోషించిన అనంతరం క్షేత్ర దర్శనం చేసుకుంటే శుభం జరుగుతుందన్నారు.

March 21, 2026 / 11:27 AM IST

MLA శ్రీధర్‌పై హర్ష వీణ మరో వీడియో రిలీజ్

AP: MLA అరవ శ్రీధర్ బాధితురాలు హర్ష వీణ మరో వీడియో రిలీజ్ చేసింది. అరవ శ్రీధర్‌కు పవన్ కళ్యాణ్ క్లీన్‌చిట్ ఇచ్చారా. కేసులపై మాట్లాడకూడదని ఆంక్షలు ఉన్నాయి. పార్టీ కార్యక్రమాల్లో శ్రీధర్ పాల్గొంటున్నారు. ఇప్పటివరకు శ్రీధర్‌పై ఎలాంటి చర్యలు లేవు. నాకు న్యాయం చేయండి’ అని పేర్కొన్నారు.

March 21, 2026 / 11:27 AM IST

116 ఏళ్ల చరిత్ర గల రామాలయం

KDP: కొండాపురం మండలంలోని 67 జాతీయ రహదారిలో ఉన్న వెంకటాపురం సీతారామయ్యస్వామి ఆలయానికి 116 ఏళ్ల చరిత్ర ఉంది. ఈ దేవాలయాన్ని 1910లో ఒక భక్తుడు నిర్మించాడు. ఈ నెల 27న శ్రీరామనవమి పండగ పర్వదినం సందర్భంగా.. పంచామృత అభిషేకం, ప్రత్యేక పూజలు పానకం, వడపప్పు వితరణ, రామ భజనలు ఈ ప్రాచీన ఆలయంలో జరగనున్నట్లు స్థానికులు తెలిపారు.

March 21, 2026 / 11:27 AM IST

మహిళకు కళ్ళజోళ్లను అందజేసిన ఎమ్మెల్యే

NTR: విజయవాడ మధురానగర్ నేతాజీ కాలనీలో నివాసం ఉంటున్న బుక్త జ్యోతి ప్రజా దర్బార్ కార్యక్రమంలో పాల్గొని, గత కొంతకాలంగా కంటి సమస్యతో బాధపడుతూ,సరిగ్గా చూడలేకపోతున్నానని ఎమ్మెల్యే బోండా ఉమా దృష్టికి తీసుకువెళ్లారు. ఎమ్మెల్యే తక్షణమే స్పందించి, జ్యోతికు అవసరమైన కళ్ళజోళ్లను శుక్రవారం ఉచితంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

March 21, 2026 / 11:26 AM IST

రంజాన్ ప్రార్థనలో పాల్గొన్న నియోజకవర్గ కాంగ్రెస్ ఇంఛార్జ్

RR: శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ ఇంఛార్జ్ జగదీశ్వర్ గౌడ్ ఆదిత్య నగర్ ఈద్గాలో నిర్వహించిన రంజాన్ వేడుకల్లో పాల్గొని ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం అన్ని మతాలను సమానంగా గౌరవిస్తూ ముస్లింల సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని కొనియాడారు.

March 21, 2026 / 11:26 AM IST

ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు : ఎమ్మెల్యే

NLR:  కందుకూరి ఎమ్మెల్యే నాగేశ్వరరావు ముస్లిం సోదర సోదరీమణులకు పవిత్ర రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. పవిత్ర దివ్య ఖురాన్ అవతరించిన ఈ మాసంలో కఠిన ఉపవాస దీక్షలకు రంజాన్ ఒక ముగింపు వేడుక అన్నారు. ఈద్ పండుగ అందరి ఇంట కొత్త వెలుగులు తీసుకురావాలని, అల్లాహ్ దీవెనలతో ఆరోగ్యం, ఐశ్వర్యం నిండాలన్నారు. రంజాన్ పండుగను సుఖసంతోషాలతో జరుపుకోవాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు.

March 21, 2026 / 11:25 AM IST

ఇందిరమ్మ ఇళ్ల మొదటి గృహ ప్రవేశం

NZB: జక్రాన్‌పల్లి మండలం అర్గుల్లో ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద శనివారం శ్రీనివాస్ గౌడ్ దంపతులు గృహ ప్రవేశం చేశారు. ఈ కార్యక్రమానికి మాజీ జిల్లా సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు రాజేందర్ హాజరయ్యారు. నిరుపేదల సొంతింటి కల నెరవేరుస్తున్న ప్రభుత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ వేడుకలో లబ్ధిదారుల కుటుంబ సభ్యులు పాలుగోన్నారు.

March 21, 2026 / 11:24 AM IST

రంజాన్ వేడుకల్లో పాల్గొన్న ప్రభుత్వ విప్

SRCL: వేములవాడలో జరిగిన రంజాన్ పండుగ వేడుకల్లో ప్రభుత్వ విప్, వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రభుత్వం ముస్లింల సంక్షేమానికి కృషి చేస్తుందన్నారు. అలాగే ముస్లింలకు రంజాన్ పవిత్ర మాసం అన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ పుల్కం రాజు, వైస్ ఛైర్మన్ నరాల శేఖర్, మున్సిపల్ కౌన్సిలర్లు పాల్గొన్నారు.

March 21, 2026 / 11:24 AM IST

పాపన్నపేటలో భారీగా రేషన్ బియ్యం పట్టివేత

MDK: పాపన్నపేటలో వాహనాల తనిఖీలలో 224 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. హైదరాబాద్ నుంచి తరలిస్తున్న లారీని ఆపి తనిఖీ చేయగా బియ్యం బయటపడింది. సమాచారం అందుకున్న సివిల్ సప్లై అధికారులు ఘటనాస్థలానికి చేరుకుని బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా, అక్రమ రవాణాపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

March 21, 2026 / 11:24 AM IST

త్వరగా జిల్లా కార్యాలయానికి భూమి కేటాయించాలి: అశోక్

MLG: జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నిర్మాణం కోసం భూమి కేటాయించాలని ఇవాల జిల్లా కలెక్టర్ టి.ఎస్. దివాకర్‌కు, జిల్లా DCC అధ్యక్షుడు అశోక్ వినతిపత్రం అందజేశారు. పార్టీ కార్యాలయం లేకపోవడంతో కార్యకలాపాలు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని, పార్టీ సంస్థాగత కార్యక్రమాలు సాగించలేకపోతున్నాయని తెలిపారు. త్వరగా భూమి కేటాయించాలని కోరారు.

March 21, 2026 / 11:24 AM IST

కోతుల బెడదకు వినూత్న పరిష్కారం

NRML: మామడ మండలం బండల్ ఖానాపూర్ గ్రామంలో సర్పంచ్ జాదవ్ కళ్యాణి కోతుల సమస్యను అద్భుతంగా పరిష్కరించారు. పంచాయతీ కార్మికుడిని చింపాంజీ వేషంలో గ్రామంలో తిప్పించినందున భయపడిన కోతులు పారిపోయి, దీంతో గ్రామస్థులకు ఉపశమనం లభించింది. స్థానికులు సర్పంచ్ ఆలోచనను ప్రశంసిస్తూ, ఇది కోతుల సమస్యకు సరికొత్త పరిష్కారం అని తెలిపారు.

March 21, 2026 / 11:24 AM IST

జమియా మసీదులో రంజాన్ ప్రార్థనలు

శ్రీకాకుళం: నగరంలోని సూర్య మహల్ జంక్షన్ వద్ద ఉన్న జమియా మసీదులో రంజాన్ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు ఘనంగా నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్ ముఖ్య అతిథిగా హాజరై ముస్లిం సోదర సోదరీమణులతో కలిసి ప్రార్థనల్లో పాల్గొన్నారు. రంజాన్ పర్వదినం శాంతి, సహనం, సౌహార్దానికి ప్రతీకగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు. 

March 21, 2026 / 11:23 AM IST