• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

బ్రహ్మోత్సవాలకు దేవాలయం ముస్తాబు

SRPT: హుజూర్ నగర్‌లోని శ్రీ వేణుగోపాల సీతారామచంద్ర స్వామి వారి దేవాలయం వార్షిక బ్రహ్మోత్సవాలకు ముస్తాబు కానున్నది. శనివారం నుంచి నాలుగు రోజులపాటు అధ్యయనోత్సవాలు, 11వ తేదీ నుంచి వారం రోజులు వార్షిక బ్రహ్మోత్సవాలు వేడుకగా కొనసాగనున్నాయి. వేడుకలను సాంప్రదాయబద్ధంగా, ఘనంగా జరిపేందుకు సన్నాహాలు పూర్తి చేశామని ఈవో గుజ్జుల కొండారెడ్డి తెలిపారు.

February 7, 2025 / 08:20 AM IST

విజయవాడలో యువతి అదృశ్యం.. కేసు నమోదు

NTR: యువతి అదృశ్యంపై పోలీసుల కేసు నమోదు చేశారు. అజిత్ సింగ్ నగర్ పోలీసుల వివరాల ప్రకారం.. ఎర్రబాలెంకి చెందిన నిహారిక (25) ఎర్రబాలెం నుంచి విజయవాడ అజిత్ సింగ్ నగర్‌కు ఫిబ్రవరి 5న వివాహ నిమిత్తం వచ్చింది. వివాహం అనంతరం ఇంటికి వెళ్లకపోవడంతో కుటుంబ సభ్యులు అన్నిచోట్ల గాలించారు. భవాని ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు.

February 7, 2025 / 08:04 AM IST

‘మెదక్ నుంచి మిర్జాపల్లి రైల్వే లైన్‌ మంజూరు చేయండి’

MDK: మెదక్ నుంచి మిర్జాపల్లి రైల్వే స్టేషన్ వరకు కొత్త రైల్వే లైన్‌ను మంజూరు చేయాలని రాజ్యసభ సభ్యులు కె.ఆర్.సురేష్ రెడ్డి రైల్వే మంత్రికి విజ్ఞప్తి చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి మొత్తం ఖర్చు ప్రాజెక్టులో 50 శాతం భరించిన విషయాన్ని గుర్తు చేశారు. మెదక్ మాజీ ఎమ్మెల్యే పట్లోళ్ల శశిధర్ రెడ్డి లేఖ రాసినట్లు తెలిపారు.

February 7, 2025 / 08:03 AM IST

8న ఒంగోలులో నవోదయ ప్రవేశపరీక్ష

ఒంగోలులోని జవహర్ నవోదయ విద్యాలయంలో 9, 11 తరగతుల ప్రవేశ పరీక్ష శనివారం జరుగుతుందని ప్రిన్సిపల్ గీతలక్ష్మి చెప్పారు. నగరంలోని జవహర్ నవోదయ, పీవీఆర్ బాలికోన్నత పాఠశాల, బండ్లమిట్టలోని ప్రభుత్వ బాలికోన్నత పాఠశాల, డీఆర్ఆర్ మున్సిపల్ హైస్కూలు, కేంద్రీయ విద్యాలయం, రామనగర్ మున్సిపల్ హైస్కూలు, సెయింట్ జేవియర్స్ స్కూలులో ఉంటుందన్నారు.

February 7, 2025 / 07:48 AM IST

‘చేనేత కళారూపాలను ఆదరించాలి’

SRPT: చేనేత వస్త్రాలను, హస్త కళారూపాలను ఆదరించి కార్మికులను ఆదుకోవాలని సూర్యాపేట జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ వంగవీటి రామారావు అన్నారు. గురువారం కోదాడలో టీటీడీ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన చేనేత హస్తకళ ప్రదర్శనను ఆయన ప్రారంభించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు శ్రావణ్, వినోద్ కుమార్, గురుమూర్తి, పబ్బా గీత, సైదారావు, లోకేష్, వెంకటేశ్వర్లు ఉన్నారు.

February 7, 2025 / 07:36 AM IST

కానూరు పరిధిలో మరికాసేపట్లో పవర్ కట్

కృష్ణా: కానూరు పరిధిలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. ఉదయం 8 నుంచి 12 గంటల వరకు కానూరులోని కామయ్యతోపు, మహాదేవపురం కాలనీ, సనత్ నగర్, 80 అడుగుల రోడ్డు పరిసర ప్రాంతాలలో విద్యుత్ సరఫరా ఉండదన్నారు. వినియోగదారులు సహకరించాలని కోరారు.

February 7, 2025 / 07:36 AM IST

కంకిపాడులో యువకుడు సూసైడ్

కృష్ణా: కంకిపాడు మండలంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువకుడు(17) ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. చదువు మానేశాడని ఇంట్లో కుటుంబ సభ్యులు మందలించారు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన యువకుడు ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గమనించిన తండ్రి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. 

February 7, 2025 / 07:32 AM IST

బీఈడీ పరీక్షల ఫలితాలు విడుదల

కృష్ణా: ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలో నవంబర్-2024లో నిర్వహించిన బీఈడీ 2వ సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షల ఫలితాలు గురువారం విడుదలయ్యాయి. పరీక్షల ఫలితాలకై అధికారిక వెబ్‌సైట్ https://www.nagarjunauniversity.ac.in/ చెక్ చేసుకోవాలని ANU పరీక్షల విభాగం సూచించింది. కాగా స్పెషల్ బీఈడీ 1వ సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షల ఫలితాలు నిన్న విడుదల అయ్యాయి.

February 7, 2025 / 07:25 AM IST

బీసీ రుణాల దరఖాస్తు గడువు పెంపు

ప్రకాశం: బీసీ కార్పొరేషన్ ద్వారా అర్హులైన వారు రాయితీ రుణాలకు దరఖాస్తు చేసుకునే గడువు ఈ నెల 12వ తేదీ వరకు పొడిగించినట్లు ప్రకాశం జిల్లా బీసీ కార్పొరేషన్ ఈడీ ఎం.వెంకటేశ్వరరావు తెలిపారు. ముందుగా సూచించిన ప్రకారం ఈ నెల 7వ తేదీతో ముగిసింది. అయితే గడువును పొడిగిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసినట్లు ఆయన పేర్కొన్నారు.

February 7, 2025 / 07:21 AM IST

మినీలారీని ఢీకొని గుర్తుతెలియని యువకుడు మృతి

ప్రకాశం: మినీలారీని ఢీకొని యువకుడు మృతి చెందిన ఘటన గురువారం రాత్రి పామూరు మండలంలోని వగ్గంపల్లె గ్రామ సమీపంలో 565 జాతీయ రహదారిపై చోటుచేసుకుంది. 24 ఏళ్ల యువకుడు తాటాకులతో వెళ్తున్న రిక్షాను ఓవర్‌ టేక్‌ చేయబోయాడు. తాటాకులు తగిలి బైక్‌ అదుపుతప్పడంతో ఎదురుగా వస్తున్న లారీని ఢీకొని మృతి చెందాడు. మృతుడి వివరాలకోసం పోలీసులు ఆరా తీస్తున్నారు.

February 7, 2025 / 06:50 AM IST

99తో హైదరాబాద్ టు విజయవాడ

NTR: విజయవాడ హైదరాబాద్ బస్సు ప్రయాణికులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. గురువారం హైదరాబాదులో తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ ఎలక్ట్రిక్ బస్సులు ప్రారంభించారు. 3,4 వారాల తర్వాత ఇవి ప్రారంభం అవుతాయని చెప్పారు. బస్సు సేవలు మొదలైన తర్వాత 4 వారాలపాటు రూ. 99తో హైదరాబాదు నుంచి విజయవాడకు ఉంటుందన్నారు.

February 7, 2025 / 06:44 AM IST

ఘన, ద్రవ వర్థ్య పదార్థాల నిర్వహణపై శిక్షణ

పల్నాడు: ఎడ్లపాడు మండల పరిషత్‌ కార్యాలయంలో గురువారం ఘన, ద్రవ వర్థ్య పదార్థాల నిర్వహణపై శిక్షణ కార్యక్రమాన్ని ఎంపీడీఓ  హేమలత దేవి ప్రారంభించారు. ఆమె మాట్లాడుతూ.. సురక్షితమైన మరుగుదొడ్డిని విధిగా వినియోగించాలన్నారు. తడి, పొడి వ్యర్థాలను గ్రామపంచాయతీ ట్రాక్టర్లకు ఇచ్చి వాటిని ఎరువుగా మార్చేందుకు సహకరించాలన్నారు. నీటిని వృథా చేయరాదని సూచించారు.

February 7, 2025 / 06:42 AM IST

రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి గాయాలు

BDK: బూర్గంపాడు మండలం గొమ్మూరు ఇసుక ర్యాంపు సమీపంలో గురువారం రాత్రి రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కర్రలతో వెళుతున్న ట్రాక్టర్‌ను వెనుక నుంచి ద్విచక్ర వాహనంపై వస్తున్న వ్యక్తి ఢీకొట్టాడని స్థానికులు చెప్పారు. ఈ ప్రమాదంలో బైక్‌పై ప్రయాణిస్తున్న వ్యక్తికి గాయాలు అయ్యాయని తెలిపారు. ప్రమాదంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

February 7, 2025 / 06:30 AM IST

నేడు పినపాకలో విద్యుత్ సరఫరా నిలిపివేత

BDK: 11కేవీ పినపాక ఫీడర్లో లైన్ మరమ్మతుల కారణంగా శుక్రవారం పినపాక మండలంలో విద్యుత్ నిలిపివేస్తున్నట్లు ఏఈ వేణు ప్రకటనలో తెలిపారు. నేడు ఉదయం 9 నుంచి 12 గంటల వరకు పినపాక, సీతంపేట, గోపాలరావుపేట, తోగ్గూడెం, గోవిందాపురం, నారాయణపురం, బోటిగూడెం, మడతనకుంట, ఉప్పాక, ఎల్లాపురం ఏరియాలలో విద్యుత్ సరఫరా నిలిచిపోతుందని, వినియోగదారులు సహకరించాలని కోరారు.

February 7, 2025 / 06:29 AM IST

ఐటీడీఏలో ఈనెల 12న జాబ్ మేళా

BDK: జిల్లాలోని ఐటీడీఏ గిరిజన నిరుద్యోగ యువకులకు పలు ప్రైవేట్ రంగంలో ఉద్యోగ అవకాశాలు కల్పించడం కోసం ఈనెల 12న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు శుక్రవారం పీవో రాహుల్ ప్రకటించారు. ఉపాధి కోసం పలు ఇన్సూరెన్స్ కంపెనీలు, ఐటీసీ ప్రథమ సంస్థ ద్వారా బ్యూటీషియన్, అసిస్టెంట్ ఎలక్ట్రిషియన్‌లో రెండు నెలల ఉచిత భోజన వసతితో శిక్షణ ఇస్తారని తెలిపారు.

February 7, 2025 / 06:28 AM IST