NDL: ఇజ్రాయెల్-అమెరికా-ఇరాన్ యుద్ధ ప్రభావంతో కోడిగుడ్ల ఎగుమతులు నిలిచిపోవడంతో ధరలు భారీగా పడిపోయాయి. గత వారం జిల్లాలో ఒక్క గుడ్డు రూ.6.50కు పైగా ఉండగా, ప్రస్తుతం రూ.4.50కు పడిపోయిందని వ్యాపారులు తెలిపారు. ఈ పరిణామం జిల్లాలోని పౌల్ట్రీ పరిశ్రమపై తీవ్ర ప్రభావం చూపుతుందని నిర్వాహకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
AP: తిరుమల పిండిమర ప్రాంతంలో ఏర్పాటు చేసిన ఫుడ్ సేఫ్టీ ల్యాబ్ను సీఎం చంద్రబాబు ప్రారంభించారు. ఇక్కడ నీరు, ఆహార పదార్థాలు, ముడి సరకుల నాణ్యతను ల్యాబ్లో పరీక్షించనున్నారు. 12 వేల చదరపు అడుగుల్లో రెండంతస్తుల్లో వాటర్ అండ్ ఫుడ్ అనాలసిస్ లేబరేటరీ నిర్మించారు. రూ. 20 కోట్లతో అత్యంత ఆధునిక యంత్రాలతో కూడిన లేబరేటరీని ఏర్పాటు చేశారు.
W.G: తాడేపల్లిగూడెంలోని పాతూరు మసీదు సమీపంలోని ఖబరిస్తాన్ (స్మశాన వాటిక) అభివృద్ధికి రూ.2 లక్షలు ఇస్తానని ఫిబ్రవరి 13న జరిగిన ముస్లింల ఆత్మీయ సమావేశంలో నియోజకవర్గ వైసీపీ ఇంఛార్జ్ వడ్డి రఘురామ్ నాయుడు హామీ ఇచ్చారు. శనివారం రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని పెద్ద మసీదు కమిటీకి ఆ నగదు అందచేశారు. అనంతరం వారికి రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
BHPL: గణపురం మండలం చెల్పూర్ గ్రామానికి చెందిన హరి సంపత్ కుమార్ శర్మ ఇటీవల అనారోగ్యంతో మరణించారు. ఈ విషయం తెలుసుకున్న మాజీ MLA గండ్ర వెంకటరమణారెడ్డి మృతుడి నివాసానికి వెళ్లి ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం బాధిత కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో BRS నాయకులు తదితరులు ఉన్నారు.
KDP: ఒంటిమిట్ట మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువతి (19) అదృశ్యమైనట్లు కుటుంబసభ్యులు శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. తెల్లవారుజామున ఇంటి నుంచి వెళ్లిపోయి ఆ తర్వాత కనిపించలేదని తెలిపారు. యువతి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు ఎస్సై శ్రీనివాసులు వెల్లడించారు.
వొడాఫోన్-ఐడియా, BSNL కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నాయి. ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో టవర్లు, ఫైబర్, స్పెక్ట్రమ్ను పంచుకోవాలని రెండు సంస్థలు చర్చలు జరుపుతున్నాయి. ఉమ్మడిగా మౌలిక సదుపాయాలను వినియోగించుకోవడం ద్వారా నిర్వహణ ఖర్చులను తగ్గించుకోవాలని భావిస్తున్నాయి. ఈ రెండు దిగ్గజాలు చేతులు కలిపితే టెలికాం రంగంలో కొత్త సమీకరణాలు మొదలయ్యే అవకాశం ఉంది.
HNK: మార్చి 23న జరిగే బీసీల ఢిల్లీ చలో విజయవంతం చేయాలని కాకతీయ యూనివర్సిటీ విద్యార్థి జేఏసీ ఛైర్మన్, బీసీ విద్యార్థి జేఏసీ రాష్ట్ర కోఆర్డినేటర్ ఆరేగంటి నాగరాజు గౌడ్ కోరారు. ఇవాళ కేయూలో ఆయన మాట్లాడుతూ.. కులగణనపై కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదని విమర్శించారు. జనగణన గెజిట్లో ఎస్సీ, ఎస్టీ వివరాలు అడిగినా, బీసీ వివరాలు అడగకపోవడం అనుమానాస్పదమన్నారు.
NLG: రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని శనివారం దేవరకొండలోని ఈద్గా మైదానంలో నిర్వహించిన ఈద్-ఉల్-ఫితర్ సామూహిక ప్రార్థన కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే బాలునాయక్ ముస్లిం మైనార్టీ సోదరులతో కలిసి పాల్గొని ముస్లిం మత పెద్దలతో ఆలింగనం చేసుకొని రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. రంజాన్ పర్వదినం అందరి జీవితాల్లో వెలుగులు నింపాలన్నారు.
MHBD: మరిపెడ మున్సిపల్ కేంద్రంలో శనివారం ఓ ప్రముఖ భక్తి ఛానల్ ఆధ్వర్యంలో రూపొందించిన హిందూధర్మం ఉగాది పంచాంగం ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. మున్సిపల్ ఛైర్మన్ వీసారపు ప్రగతి- శ్రీపాల్ రెడ్డి ఈ పంచంగాన్ని ఆవిష్కరించారు. ఈ కొత్త సంవత్సరం ప్రజలందరికీ మంచి జరగాలని ఆకాంక్షించారు. కౌన్సిలర్లు జాటోతు సురేష్, నీలా లచ్చిరాం, కాంగ్రెస్ నాయకులు, తదితరులున్నారు.
W.G: ఉమ్మడి పశ్చిమ వాసులకు గుడ్ న్యూస్. కోడిగుడ్డు ధర అమాంతంగా పడిపోయింది. జిల్లాలో గుడ్ల స్టాకు లక్షల్లో పేరుకు పోయింది. పౌల్ట్రీలలోనే కోడిగుడ్ల స్టాక్ నిల్వ ఉండిపోయింది. దీంతో ధర అమాంతంగా పడిపోయింది. ఇరాన్-ఇరాక్ యుద్ధం నేపథ్యంలో విదేశాలకు గుడ్లు ఎగుమతి లక్షల్లో నిలిచిపోయాయి. పౌల్ట్రీ రైతులు తక్కువ రూ.130కే విక్రయిస్తున్నట్లు తెలిపారు.
GDWL: మాచర్లలో రంజాన్ పర్వదినాన్ని ముస్లింలు భక్తిశ్రద్ధలతో ఘనంగా జరుపుకున్నారు. మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి, శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. గ్రామ ప్రజలు కులమతాలకు అతీతంగా పరస్పర సౌహార్దంతో పాల్గొని పండుగను ఆనందంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో ఐక్యత, సోదరభావం స్పష్టంగా కనిపించింది.
AP: ఉత్తరాంధ్ర అభివృద్ధిలో భాగంగా శ్రీకాకుళం నుండి హైదరాబాద్, తిరుపతి నగరాలకు నేరుగా రైళ్లు నడపనున్నట్లు కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు ప్రకటించారు. ప్రస్తుతం దీనిపై సర్వే జరుగుతోందని, త్వరలోనే పనులు పూర్తవుతాయని తెలిపారు. గతంలోని లోపాలను సరిదిద్ది రైల్వే రంగాన్ని అభివృద్ధి చేస్తామని మంత్రి ఈ సందర్భంగా ప్రజలకు భరోసా ఇచ్చారు.
NGKL: కల్వకుర్తి నియోజకవర్గంలోని మంగళపల్లి సమీపంలో శుక్రవారం రాత్రి రోడ్డుపై వెళ్తున్న కారులో అకస్మాత్తుగా మంటలు అంటుకుని దగ్ధమైంది. సమాచారం అందుకున్న కల్వకుర్తి ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ఘటనలో ప్రాణనష్టం జరగలేదు. కారు పూర్తిగా దెబ్బతిన్నది. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేశారు.
MHBD: పవిత్ర రంజాన్ పండుగ సందర్భంగా డోర్నకల్ నియోజకవర్గ ప్రజలకు ప్రభుత్వం విప్, MLA డా. రామచంద్ర నాయక్ శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్ పండుగ ప్రేమ,సహనం, పరస్పర గౌరవానికి ప్రతీకగా నిలుస్తుందన్నారు. ఈ పవిత్రమాసంలో ఉపవాసాలు ఆచరించిన ముస్లిం సోదరులు సమాజానికి శాంతి, ఐక్యత సందేశాన్ని అందిస్తున్నారని తెలిపారు. ప్రతిఒక్కరి జీవితాల్లో ఆనందం వెల్లువిరియాలన్నారు.
VKB: రంజాన్ పండుగను పురస్కరించుకుని యాలాల ఈద్గాలో కాంగ్రెస్ మండల మాజీ అధ్యక్షుడు అక్బర్ బాబా ఆధ్వర్యంలో ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం కాంగ్రెస్ నాయకులు పేరి రాజేందర్ రెడ్డి, సర్పంచ్ శివయ్య ముస్లిం సోదరులను ఆలింగనం చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో భక్తులందరికీ కీర్ పంపిణీ చేయడం జరిగింది.