NLG: ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే సామేలు అన్నారు. బుధవారం శాలిగౌరారం మండల కేంద్రంలోని వసాయ మార్కెట్ యార్డ్ నందు పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆర్డీవో అశోక్ రెడ్డితో కలిసి ప్రారంభించి మాట్లాడారు. రైతులు నాణ్యమైన ధాన్యాన్ని కేంద్రాలకు తీసుకువచ్చి ప్రభుత్వ మద్దతు ధర పొందాలన్నారు.
NDL: వివాదస్పద వక్ఫ్ బోర్డ్ చట్ట సవరణ బిల్లు రాజ్యాంగ విరుద్ధమని, దాన్ని వెంటనే ఉపసంహరించాలని సీపీఎo పార్టీ జిల్లా కార్యదర్శి నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. బుధవారం నంది కోట్కూరు సీపీఎం పార్టీ కార్యాలయంలో గోపాలకృష్ణ అధ్యక్షతన మీడియా సమావేశం నిర్వహించారు. ప్రతిపక్షాల సూచనలు పరిగణనలోకి తీసుకోకుండా వక్ఫ్ బోర్డు చట్ట సవరణ బిల్లు ముందుకు తీసుకురావడం విచారకరమన్నారు.
ATP: అధికార పార్టీ అరాచకాలను ఎదుర్కొనేందుకు వైసీపీ ఎప్పటికీ సిద్ధంగా ఉంటుందని వైసీపీ అనంతపురంజిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి స్పష్టం చేశారు. పస్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో మెజార్టీ లేదని తెలిసినా అధికార పార్టీ ప్రజాప్రతినిధులు బెదిరింపులు, దాడులు, దౌర్జన్యాలు చేశారని మండిపడ్డారు. అయినా 51 స్థానాలకు గాను 39 స్థానాల్లో వైసీపీ విజయం సాధించిందని తెలిపారు.
ATP: కళ్యాణదుర్గం పట్టణంలో ప్రజావేదిక వద్ద గత వారంరోజులపాటు అక్కమ్మ జాతరలో ప్రదర్శనలు ఇచ్చిన ఉరుముల కళాకారులను ఎమ్మెల్యే సత్కరించారు. అనంతరం వారికి అర్థిక సహాయం రూ. లక్ష వారికి అందజేశారు. మా కష్టాన్ని గుర్తించి మమ్మల్ని గౌరవించి మాకు అండగా ఉంటానని తెలియజేసిన ఎమ్మేల్యే సురేంద్రబాబుకు కళాకారులు కృతజ్ఙతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు.
సత్యసాయి: సోమందేపల్లిలో గంజాయి బ్యాచ్ను అరికట్టాలని ప్రజా సంఘాలు పోలీసులకు వినతిపత్రం అందజేశారు. మద్యం, జూదం, మట్కా పెరిగిపోతున్నాయని, మండలంలో ప్రశాంతతకు భంగం కలుగుతోందని ప్రజా సంఘాల నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. గంజాయి నివాస ప్రాంతాలను రెడ్ జోన్లుగా ప్రకటించి, యువతను రక్షించాలని కోరారు.
SRD: ప్రజలకు సరఫరా చేస్తున్న సన్నబియ్యం ఘనత కేంద్ర ప్రభుత్వాన్ని దేనిని బీజేపీ జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి అన్నారు. రామచంద్రపురంలోని రేషన్ దుకాణాన్ని బుధవారం ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఒక్కొక్కరికి 5 కిలోల ఉచిత బియ్యాన్ని కేంద్ర ప్రభుత్వం ఇస్తుంటే.. ఒక్క కిలో మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందని చెప్పారు.
AP: వైసీపీ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిపై నమోదైన కేసుకు సంబంధించి మూడోసారి నోటీసులు ఇవ్వాలని పోలీసులు భావిస్తున్నారు. కాకాణి నెల్లూరుకు చేరుకున్న వెంటనే నోటీసులు ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు. ఈ కేసులో విచారణకు హాజరు కావాలని కాకాణికి ఇప్పటికే రెండుసార్లు నోటీసులు జారీ చేశారు. అయితే, విచారణకు హాజరు కాకపోవడంతో తదుపరి కార్యాచరణకు సంబంధించి పోలీసులు చర్చిస్తున్నారు.
NRML: సన్న బియ్యం పంపిణీ ప్రక్రియ సాఫీగా జరిగేలా పకడ్బందీ పర్యవేక్షణ జరపాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. మామడ మండల కేంద్రంలోని రేషన్ షాపును కలెక్టర్ బుధవారం సందర్శించి, లబ్దిదారులకు స్వయంగా సన్న బియ్యం పంపిణీ చేశారు. రేషన్ దుకాణానికి కేటాయించిన సన్న బియ్యం నాణ్యతను పరిశీలించి, రేషన్ యజమానులకు పలు సూచనలు సలహాలు చేశారు.
పాకిస్తాన్ స్టార్ క్రికెటర్ బాబర్ అజామ్ మళ్లీ ట్రోలింగ్కు గురయ్యాడు. న్యూజిలాండ్తో జరిగిన రెండో వన్డేలో బాబర్ కేవలం ఒక్క పరుగుకే పెవిలియన్కు చేరాడు. దీంతో బాబర్ కొద్దిలో సెంచరీ మిస్ చేసుకున్నాడని.. మరో 99 పరుగులు చేస్తే సెంచరీ చేసేవాడని నెట్టింట పోస్టులు పెడుతున్నారు. తృటిలో సెంచరీ చేజారిపోయిందంటూ మాస్ ట్రోలింగ్ చేస్తున్నారు.
కృష్ణా: పెంచిన పాల ధరలను వెంటనే తగ్గించాలని విజయ డెయిరీ వద్ద సీపీఐ ధర్నా చేపట్టింది. సీపీఐ నగర కార్యదర్శి కోటేశ్వరావు మాట్లాడుతూ.. సామాన్య వర్గాలకు పౌష్టికాహారం దూరం చేయడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. పాల ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు. విజయవాడ విజయ డెయిరీ రెండు రూపాయలు చొప్పున పెంచిన పాల ధరలను తగ్గించాలని సీపీఐ డిమాండ్ చేసింది.
KNR: సన్న బియ్యం పథకం పేదల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోతుందని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పేర్కొన్నారు. బుధవారం రామడుగు మండలం వేదిర గ్రామంలో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కలెక్టర్ పమేలా సత్పతి, అడిషనల్ కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్తో కలిసి సన్న బియ్యం ఉచిత పంపిణి ప్రారంభించారు. దేశ చరిత్రలో సీఎం రేవంత్ రెడ్డి విప్లవాత్మకంగా చేపట్టారన్నారు.
టాప్ ర్యాంక్ ఆటగాళ్ల పేర్లను తాజాగా ఐసీసీ విడుదల చేసింది. యువ బ్యాటర్ శుభమన్ గిల్ వన్డేల్లో అగ్రస్థానంలో నిలువగా, టీ20ల్లో నెంబర్ వన్ ఆల్రౌండర్గా హార్థిక్ పాండ్య స్థానం దక్కించుకున్నాడు.
TG: ఢిల్లీలో బీసీ సంఘాల ఆధ్వర్యంలో జరుగుతున్న ధర్నాలో సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘రాహుల్ గాంధీ ఇచ్చిన మాట ప్రకారం కులగణన చేపట్టాం. దేశానికి ఓ రోల్ మోడల్గా తెలంగాణ నిలిచింది. రిజర్వేషన్లు పెంచడం కేంద్రం పరిధిలోని అంశం. మా రాష్ట్రంలో రిజర్వేషన్లు పెంచుకుంటామని మేం కోరాం. ఇందుకు అనుమతి ఇచ్చేందుకు మోదీకి ఇబ్బంది ఏంటి?’ అని ప్రశ్నించారు.
కృష్ణా: ఉయ్యూరు మున్సిపల్ కార్యాలయంలో బుధవారం ఎమ్మెల్యే బోడె ప్రసాద్ ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి ప్రజా వేదిక ఏర్పాటు చేశామన్నారు. గత ప్రభుత్వం ప్రజలకు ఇవ్వాల్సిన టిడ్కో ఇళ్లను నిర్లక్ష్యం చేసిందని పేర్కొన్నారు.
కృష్ణా: ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ ఆదేశాల మేరకు కృత్తివెన్ను మండలం చినపాండ్రాక పంచాయతీ పరిధిలోని గ్రామాలలో ఓఎన్జీసీ సంస్థ సభ్యులు మంచినీటి ట్యాంకర్లను ఏర్పాటు చేశారు. వేసవి దృష్ట్యా నీటి ఎద్దడి ఎక్కవగా ఉండటంతో ప్రజలకు ట్యాంకర్ల ద్వారా మంచినీటిని సరఫరా చేస్తున్నామని సభ్యులు తెలిపారు.