• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

కలెక్టర్‌తో ఎమ్మెల్యే నారాయణ రెడ్డి భేటీ

ప్రకాశం: మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి కలెక్టర్ తమిమ్ అన్సారీయను ఒంగోలులోని కలెక్టరేట్ కార్యాలయంలో శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మార్కాపురం నియోజకవర్గంలోని పలు సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. నియోజకవర్గంలో సమస్యలు లేకుండా పరిష్కరిస్తానని కలెక్టర్ హామీ ఇచ్చినట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు.

February 7, 2025 / 04:43 PM IST

శ్రేయస్‌ను పక్కన పెట్టొద్దు: జహీర్ ఖాన్

ఇంగ్లండ్‌తో జరిగిన తొలి వన్డేలో శ్రేయస్ అయ్యర్ హాఫ్ సెంచరీతో అదరగొట్టిన విషయం తెలిసిందే. కోహ్లీ స్థానంలో తుది జట్టులోకి వచ్చిన శ్రేయస్ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. దీనిపై భారత మాజీ పేసర్ జహీర్ ఖాన్ స్పందించాడు. శ్రేయస్ ఆత్మవిశ్వాసం అద్భుతమని.. తర్వాతి మ్యాచుల్లోనూ ఇలాగే కొనసాగిస్తే బాగుంటుందని తెలిపాడు. మంచి ఫామ్‌లో ఉన్న బ్యాటర్‌ను పక్కనపెట్టడం సరికాదన్నాడు.

February 7, 2025 / 02:29 PM IST

నా స్థానం మెరుగుపరచుకోవాలి: CM

AP: ఫైల్స్ క్లియరెన్స్‌లో మంత్రుల ర్యాంకులపై CM చంద్రబాబు స్పందిస్తూ.. వేగవంతమైన, మెరుగైన పనితీరుతో సత్వర ఫలితాలు సాధిద్దామన్నారు. ‘బృందంగా పనిచేసినప్పుడే ఉత్తమ ఫలితాలు సాధించగలం. ఎప్పటికప్పుడు సమీక్షించుకుని పనిచేయాలన్నదే మా ఆలోచన. పోటీపడి పనిచేసి పాలనలో వేగం పెంచేందుకు చేసిన ప్రయత్నంలో భాగమే మంత్రులకు ర్యాంకులు. నేను కూడా నా స్థానం మెరుగుపరచుకోవాలి’ అని తెలిపారు.

February 7, 2025 / 02:24 PM IST

కిక్ బాక్సింగ్ పోటీల్లో బెల్లంపల్లి వాసి ప్రతిభ

MNCL: బెల్లంపల్లి మండలం చంద్రవెల్లి గ్రామానికి చెందిన అంతర్జాతీయ కిక్ బాక్సింగ్ క్రీడాకారుడు రాసకొండ సంజీవ్ మరోసారి ప్రతిభ చూపి పోటీల్లో బహుమతి సాధించాడు. ఈనెల 1 నుండి 5 వరకు కేడి జాదవ్ ఇండోర్ స్టేడియం ఐజి కాంప్లెక్స్ న్యూఢిల్లీలో జరిగిన ఏడవ వాకో అంతర్జాతీయ కిక్ బాక్సింగ్ రిఫ్రి సెమినార్ లో పాల్గొని సర్టిఫికెట్, అవార్డు పొందారు. అతన్ని గ్రామస్తులు అభినందించారు. 

February 7, 2025 / 02:06 PM IST

కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం: పటేల్ రమేష్ రెడ్డి

SRPT: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అందిస్తుందని టూరిజం కార్పొరేషన్ ఛైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఆయన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ.. కులగణన సర్వే సక్రమంగా నిర్వహిస్తే కొంతమంది బీఆర్ఎస్ నాయకులు కావాలని దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఎమ్మెల్సీ, లోకల్ బాడీ ఎన్నికల్లో పోటీ చేయాలని సవాల్ విసిరారు.

February 7, 2025 / 02:04 PM IST

వాట్సాప్ గ్రూప్ ద్వారా ఆర్థిక సహాయం అందజేత

BHNG: మోత్కూరు మున్సిపాలిటీ సాయినగర్ కాలనీకి చెందిన వాట్సాప్ గ్రూప్ సభ్యులు గొప్ప మనస్సు చాటుకున్నారు. కాలనీకి చెందిన మధు(భాష ) ఇటీవల అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందాడు. కాలనికి చెందిన వాట్సాప్ గ్రూప్ సభ్యులు తలో రూపాయి కూడబెట్టి, 9,001 రూపాయలు, 50 కేజీల బియ్యంను బాధిత కుటుంబనికి అందించారు.

February 7, 2025 / 01:52 PM IST

‘అబద్దాల్లో ఆస్కార్ అవార్డు తీసుకున్న జగన్’

GNTR: మాజీ సీఎం వైఎస్ జగన్ అబద్ధాల్లో ఆస్కార్ అవార్డు తీసుకున్నారని మంత్రి గుమ్మడి సంధ్యారాణి ఎద్దేవా చేశారు. మంగళగిరి టీడీపీ కార్యాలయంలో శుక్రవారం మంత్రి గుమ్మడి సంధ్యరాణి మీడియాతో మాట్లాడారు. గత ఏడాది ఏప్రిల్, మే నెలలో వైఎస్ జగన్ ప్రభుత్వం చేసిన అప్పు రూ.20వేల కోట్లను ఏం చేశారో చెప్పాలని అన్నారు.

February 7, 2025 / 01:51 PM IST

‘తునికాకు సేకరణకు టెండర్లు పిలవాలి’

NRML: తునికాకు సేకరణకు టెండర్లు పిలవాలని టీఏజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి శంభు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతిఏటా డిసెంబర్ జనవరి నుంచి సేకరణ ప్రత్యేక సంబంధించి పనులను అటవీశాఖ మొదలు పెట్టేదని, ఈ ఏడాది మాత్రం ఆ ప్రక్రియ నత్తనడకను తలపిస్తున్నదని అన్నారు. టెండర్ల ప్రక్రియను వెంటనే పూర్తిచేసి గిరిజన పేదలకు ఉపాధి కల్పించాలన్నారు.

February 7, 2025 / 01:48 PM IST

రుణమాఫీ నేటికీ పూర్తిస్థాయిలో అమలు చేయలేదు: సీపీఐ

SRPT: పూర్తిస్థాయిలో రుణమాఫీ చేయకుండా రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తుందని సీపీఐ పార్టీ మండల కార్యదర్శి పోకల వెంకటేశ్వర్లు అన్నారు. శుక్రవారం గరిడేపల్లి మండలం కాల్వపల్లి గ్రామంలో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్ ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో ఒక్కటైన రుణమాఫీ నేటికీ పూర్తిస్థాయిలో అమలు చేయలేదన్నారు.

February 7, 2025 / 01:48 PM IST

రీ-సర్వేపై సందేహాల నివృత్తికి ప్రత్యేక సెల్

AKP: భూ యజమానులకు, సర్వే సిబ్బంది, రెవిన్యూ సిబ్బందికి, రీ-సర్వేలో వచ్చిన సందేహాలు నివృత్తి చేయడానికి జిల్లా స్థాయిలో రీ-సర్వే నిపుణుల సెల్ ఏర్పాటు చేసిన‌ట్టు అన‌కాప‌ల్లి జాయింట్ కలెక్టర్ ఎమ్.జాహ్నవి తెలిపారు. పైలెట్ ప్రోజెక్టుగా మండలానికి ఒక గ్రామం చొప్పున రీ-సర్వే నిర్వహించడం జరుగుందన్నారు.

February 7, 2025 / 01:45 PM IST

మంగళగిరి గ్రీవెన్స్ లో పాల్గొన్న మంత్రి

PPM: సాలూరు ఎమ్మెల్యే, గిరిజన సంక్షేమ శాఖా మంత్రి గుమ్మిడి సంధ్యారాణి శుక్రవారం మంగళగిరి టీడీపీ సెంట్రల్ ఆఫీసులో ప్రజల నుండి ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు ప్రజలు తమ సమస్యలను మంత్రికి తెలియజేశారు. ఆమె ప్రతి ఫిర్యాదును ఓపిగ్గా వినిపించి, తగిన పరిష్కార చర్యలు తీసుకోవడానికి అధికారులకు సూచనలు ఇచ్చారు.

February 7, 2025 / 01:42 PM IST

‘ఐటీడీఏ పీవోగా అభిషేక్ సేవలు మరువలేనివి’

ASR: పాడేరు ఐటీడీఏ పీవోగా వీ.అభిషేక్ అందించిన సేవలు మరువలేనివని అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం కొనియాడారు. బదిలీపై వెళుతున్న పీవోకు శుక్రవారం పాడేరులో నిర్వహించిన అభినందన సభలో పాల్గొని మాట్లాడారు. ఐటీడీఏ పరిధిలోని 11 మండలాల్లో రహదారి నిర్మాణాలు, తాగునీటి సౌకర్యాల కల్పనకు పీవో వీ.అభిషేక్ కృషి చేశారని తెలిపారు. ఆయన మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని కోరారు.

February 7, 2025 / 01:39 PM IST

‘నులిపురుగుల నివారణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి’

W.G: ఆరోగ్యవంతమైన పిల్లల కోసం నులిపురుగుల నివారణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఇరగవరం మండల పరిషత్ అభివృద్ధి అధికారి ఎ.శ్రీనివాస్ కోరారు. ఈ నెల 10న జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమాన్ని పురస్కరించుకుని శుక్రవారం మండల పరిషత్ కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేశారు. అనంతరం నులిపురుగుల నివారణ మాత్రలను అందజేసి వాల్ పోస్టర్లు ఆవిష్కరించారు.

February 7, 2025 / 01:31 PM IST

శిక్షణ పొందిన డ్రైవర్లకు సర్టిఫికెట్లు అందజేత

పల్నాడు: ఏపీఎస్ ఆర్టీసీ హెవీ మోటర్ వెహికల్ డ్రైవింగ్ ట్రైనింగ్ స్కూల్లో శిక్షణ పూర్తిచేసుకున్న డ్రైవర్లకు డిపో మేనేజర్ జీవీఎస్‌వీవీ కుమార్ శుక్రవారం సర్టిఫికెట్లను అందజేశారు. 18వ బ్యాచ్ శిక్షణ పూర్తిచేసుకున్న వారికి సర్టిఫికెట్ల ప్రదానం చేసినట్లు చెప్పారు. 19వ బ్యాచ్ అడ్మిషన్లు జరుగుతున్నట్లు తెలిపారు.

February 7, 2025 / 01:31 PM IST

సబ్సిడీ రుణాలను మంజూరు చేయాలి

NRML: జిల్లాలోని 19 మండలాలలో ఎంపికైన 256 మందికి సంబంధించిన ఎస్సీ కార్పొరేషన్ రుణాల సబ్సిడీని వెంటనే మంజూరు చేయాలని సీపీఎమ్  జిల్లా కార్యదర్శి బొమ్మెన సురేష్ అన్నారు. శుక్రవారం వారు మాట్లాడుతూ బ్యాంకు మేనేజర్ ద్వారా ఎంపిక చేసిన 2020-21 సంవత్సరానికి సంబంధించి లబ్ధిదారులకు సంబంధించి సబ్సిడీ రుణాలను ఇప్పటివరకు మంజూరు చేయలేదని వాపోయారు

February 7, 2025 / 01:27 PM IST