• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

నూతన SIను సన్మానించిన నిజాంపల్లీ నాయకులు

BHPL: గోరికొత్తపల్లి మండల నూతన SIగా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన సాయి త్రిలోక్నాథ్ రెడ్డిని ఇవాళ నిజాంపల్లీ గ్రామ మాజీ సర్పంచ్ శ్రీనివాస్, ఐదవ వార్డు సభ్యుడు రాజేందర్, BRS సీనియర్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా SIకు పూల మొక్క అందజేసి.. శాలువాతో ఘనంగా సన్మానించారు. ఎల్లస్వామి, చందు, రాజు తదితరులు ఉన్నారు.

March 21, 2026 / 09:40 AM IST

తిరుమలలో అల్పాహారం వడ్డించిన చంద్రబాబు

AP: తిరుమలలో భక్తులకు సీఎం చంద్రబాబు అల్పాహారం వడ్డించారు. శ్రీవారి దర్శనం అనంతరం కుటుంబ సమేతంగా ఆయన వెంగమాంబ అన్నప్రసాద కేంద్రానికి వెళ్లారు. అక్కడ CBN, భువనేశ్వరి, లోకేష్, దేవాన్ష్ వడ్డించారు. తర్వాత వారు అల్పాహారం స్వీకరించారు. దేవాన్ష్ పేరుతో ఒక్కరోజు అన్నదాన వితరణకు రూ.44 లక్షలు విరాళం అందించారు. ఏటా తన మనవడి పుట్టిన రోజు సందర్భంగా విరాళం అందజేస్తున్నారు.

March 21, 2026 / 09:37 AM IST

లాడ్జిల్లో తనిఖీలు.. అనుమానితులపై కఠిన చర్యలు..!

కడప జిల్లాలో ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఆదేశాలతో జిల్లా వ్యాప్తంగా నైట్ పెట్రోలింగ్ ముమ్మరం చేశారు. నేరాల నియంత్రణ, శాంతి భద్రతల పరిరక్షణ లక్ష్యంగా పోలీసులు అప్రమత్తంగా గస్తీ విధులు నిర్వహిస్తున్నారు. లాక్‌డ్ హౌస్‌ల వద్ద ప్రత్యేక నిఘా ఉంచడంతో పాటు లాడ్జిల్లో తనిఖీలు చేపట్టి, అనుమానితుల వివరాలు సేకరిస్తున్నారు.

March 21, 2026 / 09:36 AM IST

అక్షరాంధ్రా పరీక్షలు 99.6 శాతం పూర్తి చేశాం: MPDO

PPM: ఇటీవల నిర్వహించిన అక్షరాంధ్రా కార్యక్రమానికి కురుపాం మండల పరిధిలోని 20 సచివాలయాల్లో 4096 మంది హాజరు కాగా, అందులో 99.6 శాతం పరీక్షలు నిర్వహించి ఫలితాల నమోదు పూర్తి చేసినట్లు స్థానిక MPDO జె. ఉమామహేశ్వరి తెలిపారు. శుక్రవారం ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను సకాలంలో పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నామని పెర్కొన్నారు.

March 21, 2026 / 09:35 AM IST

ఈ నెల 24న ఆలయ వార్షికోత్సవ ఉత్సవాలు

ADB: తలమడుగు మండలంలోని దేవాపూర్ గ్రామంలో వెలిసిన శ్రీ మహంకాళి ఆలయంలో ఈ నెల 24, 26, 27 తేదీల్లో ఆలయ 3వ వార్షికోత్సవ ఉత్సవాలు నిర్వహించనున్నారు. ఈ మేరకు శనివారం ఆలయ కమిటీ సభ్యులు ఉత్సవాల వివరాలను వెల్లడించారు. 4 రోజుల పాటు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి ఉత్సవాలను విజయవంతం చేయాలన్నారు.

March 21, 2026 / 09:34 AM IST

రాజోలి పంచాయతీ తైబజార్, వధశాల వేలం

GDWL: రాజోలి గ్రామ పంచాయతీలో మార్చి 23న ఉదయం 11 గంటలకు తైబజార్, వధశాల వేలంపాటలు నిర్వహించనున్నట్లు కార్యదర్శి కృష్ణయ్య తెలిపారు. ఆసక్తిగలవారు తైబజార్‌కు రూ.30,000, వధశాలకు రూ.10,000 డిపాజిట్ చెల్లించి పాల్గొనవచ్చని సూచించారు. శుక్రవారం జరగాల్సిన వేలం వాయిదా పడి, తాజా ప్రకటన వెలువడిందని పేర్కొన్నారు.

March 21, 2026 / 09:33 AM IST

రామాయంపేటలో రంజాన్ వేడుకలకు సర్వం సిద్ధం

మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలో రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని ఈద్గా వద్ద వేడుకలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. పట్టణ మసీదు కమిటీ ఆధ్వర్యంలో ఈద్గా పరిసరాలను శుభ్రం చేయించి, పవిత్రమైన నమాజ్ నిర్వహించడానికి అన్ని వసతులను సిద్ధం చేశారు. ముస్లిం సోదరులు భక్తిశ్రద్ధలతో పండుగ జరుపుకోవాలని కమిటీ సభ్యులు కోరారు.

March 21, 2026 / 09:33 AM IST

హనుమంతరాయ చౌదరి మృతిపై రఘువీరారెడ్డి దిగ్భ్రాంతి

సత్యసాయి: కళ్యాణదుర్గం మాజీ ఎమ్మెల్యే హనుమంతరాయ చౌదరి మరణం పట్ల కాంగ్రెస్ సీనియర్ నేత రఘువీర రెడ్డి ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. నాలుగు దశాబ్దాలుగా కళ్యాణదుర్గం ప్రజా సేవలో ‘పెద్దాయన’గా పేరుగాంచిన ఆయన మృతి అత్యంత బాధాకరమని పేర్కొన్నారు. భగవంతుడు మృతుని ఆత్మకు శాంతి ప్రసాదించాలని కోరుకుంటూ.. వారి కుటుంబ సభ్యులకు, అనుచరులకు సానుభూతి తెలియజేశారు. 

March 21, 2026 / 09:32 AM IST

రంజాన్ వేళ జిల్లాలో పటిష్ట భద్రత

ATP: రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని అనంతపురం జిల్లా ఎస్పీ పి.జగదీష్ ఆదేశాల మేరకు పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. జిల్లాలోని ప్రధాన మసీదులు, ఈద్గాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. సోషల్ మీడియా వేదికలపై అభ్యంతరకర పోస్టులు పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు.

March 21, 2026 / 09:32 AM IST

సిద్ధినగట్టులో రాష్ట్ర స్థాయి పోటీలు

NDL: శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా ఈ నెల 26న ప్యాపిలి మండలం సిద్ధినగట్టు గ్రామంలో రాష్ట్ర స్థాయి బండలాగుడు పోటీలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు శుక్రవారం తెలిపారు. విజేతలైన ఎద్దుల యజమానులకు దాతల సహకారంతో నగదు బహుమతులు అందజేస్తామని పేర్కొన్నారు. ప్రథమ బహుమతి రూ.30,000, ద్వితీయ రూ.20,000, తృతీయ రూ.12,500, నాలుగో బహుమతి రూ.10,000గా నిర్ణయించారు.

March 21, 2026 / 09:32 AM IST

జిల్లా వ్యాప్తంగా ఘనంగా ఈద్-ఉల్-ఫితర్ వేడుకలు

KDP: జిల్లా వ్యాప్తంగా ఈద్-ఉల్-ఫితర్ వేడుకలు ఘనంగా జరిగాయి. కడప రిమ్స్ ఈద్గా వద్ద ప్రత్యేక నమాజు ప్రార్థనల్లో ముస్లిం సోదరులు భారీగా పాల్గొన్నారు. పరస్పరం ఈద్ ముబారక్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చింతకొమ్మదిన్నే సీఐ బాల మద్దిలేటి ఆధ్వర్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.

March 21, 2026 / 09:32 AM IST

ఉరి వేసుకొని వ్యక్తి ఆత్మహత్య

SRCL: వీర్నపల్లి మండలం శాంతినగర్ గ్రామంలో శనివారం గుగులోతు గోపాల్ అనే వ్యక్తి చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికులు మృతదేహాన్ని గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న మృతుడి బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గోపాల్ అప్పుల బాధతోనే ఈ దారుణానికి పాల్పడినట్లు సమాచారం.

March 21, 2026 / 09:30 AM IST

‘ప్రకృతి విషయంలో సానుకూల దృక్పథం అవసరం’

MNCL: ప్రకృతిపై ప్రతి ఒక్కరూ సానుకూల దృక్పథాన్ని పెంచుకోవాలని జన్నారం అటవీశాఖ అధికారి రామ్మోహన్ సూచించారు. ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఫారెస్ట్ సందర్భంగా శనివారం ఆయన మాట్లాడుతూ.. మనుషులకు ప్రకృతి ఇచ్చిన మంచి కానుక వన్యప్రాణులని అన్నారు. వాటిని ఎంత కాపాడుకుంటే మనిషికి అంత భవిష్యత్తు ఉంటుందన్నారు. ప్రతి జీవి ప్రకృతితో మమేకమై జీవించడమే మంచిదన్నారు.

March 21, 2026 / 09:30 AM IST

రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించిన మేయర్

PDPL: రామగుండం సింగరేణి సంస్థ బీ-గెస్ట్ హౌస్ సమీపంలోని మూలమలుపు వద్ద జరుగుతున్న రోడ్డు నిర్మాణ పనులను నగర మేయర్ మహంకాళి స్వామి అధికారులు తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆ ప్రాంతంలో ప్రమాదాలు జరగకుండా రోడ్డు పనులు నాణ్యంగా నిర్వహించాలని సూచించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని తెలిపారు.

March 21, 2026 / 09:30 AM IST

సమ్మె విరమించిన కోల్ ట్రాన్స్ పోర్ట్ డ్రైవర్లు, క్లీనర్లు

MNCL: బెల్లంపల్లి ప్రాంతంలో గత నాలుగు రోజులుగా కొనసాగుతున్న కోల్ ట్రాన్స్‌పోర్ట్ డ్రైవర్లు, క్లీనర్ల నిరవధిక సమ్మె విరమించారు. గోలేటిలో డ్రైవర్లకు రూ.22 వేల వేతనం, క్లీనర్లకు రూ.11 వేల వేతనం చెల్లించడంతో పాటు ఇతర సమస్యలను పరిష్కరించేందుకు ఒప్పందం కుదిరింది. దీంతో సమ్మెను విరమిస్తున్నట్లు AITUC రీజియన్ అధ్యక్షుడు బోగే ఉపేందర్ తెలిపారు. 

March 21, 2026 / 09:30 AM IST