KMR: ఎల్లారెడ్డి నర్సరిలో మొక్కల సంరక్షణ సక్రమంగా చేపట్టాలని ఆర్డీవో ప్రభాకర్ శుక్రవారం సూచించారు. మండలంలోని బ్రాహ్మణపల్లి నర్సరీని అయిన శుక్రవారం పరిశీలించారు. నర్సరీలో పెరుగుతున్న మొక్కల వివరాలు అడిగి తెలుసుకున్నారు. వర్షాకాలంలో మొక్కలు నాటేందుకు సంసిద్ధం చెయాలనీ నిర్వహకులకు సూచించారు.
సత్యసాయి: భారతదేశంలో ప్రసిద్ధిగాంచిన హోరనాడులోని శ్రీ అన్నపూర్ణేశ్వరి అమ్మవారిని మాజీ మంత్రి, పెనుకొండ నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ ఉషశ్రీ చరణ్ శుక్రవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా శ్రీ అన్నపూర్ణేశ్వరి ఆలయంలో ఆమె ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. మాజీ మంత్రి వెంట పెనుకొండ వైసీపీ నాయకులు ఉన్నారు.
ATP: బుక్కరాయసముద్రం మండల కేంద్రంలో శుక్రవారం పాత కక్షల కారణంగా ఇరు వర్గాల మధ్య మాట మాట పెరిగి ఘర్షణకు దారితీసింది. ఈ ఘర్షణలో ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ ఘర్షణలో రాజు, హాబీబ్ అనే ఇరువురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం అనంతపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
MLG: మంగపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా రాష్ట్ర పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ దనసరి అనసూయ (సీతక్క) హాజరై మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ నాయకులు సిద్ధంగా ఉండాలనీ, పార్టీ లైన్లోనే ప్రతి ఒక్కరూ పని చేయాలని కోరారు.
NZB: వర్ని మండలం శ్రీనగర్ గ్రామానికి చెందిన కోటేశ్వరరావు అనే వ్యక్తి గురువారం మధ్యాహ్నం పొలంలో పని చేస్తుండగా గుండెపోటు వచ్చి మృతి చెందినట్లు ఎస్సై రమేశ్ శుక్రవారం తెలిపారు. పోలీస్ల వివరాల ప్రకారం మృతుడు అదే గ్రామానికి చెందిన మేక వెంకటేశ్వర్ రావు వద్ద 10 సంవత్సరాల నుంచి వ్యవసాయ కూలీగా పని చేస్తున్నాడు. కుమారుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు వివరించారు.
KMR: కాంగ్రెస్ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకు శుక్రవారం సుభాష్ రెడ్డిని పార్టీ నుండి సస్పెండ్ చేసిన హైకమాండ్. గత కొన్ని రోజుల క్రితం ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఒక మీటింగ్లో ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్పై మరియు పార్టీని దుర్భాషలాడినందుకు హైకమాండ్ ఇట్టి విషయాన్నీ తీవ్రమైన కఠిన చర్యగా తీసుకొని సస్పెండ్ చేశారు.
ATP: గత వైసీపీ ప్రభుత్వంలో రక్త నిధి కోసం పోరాటం చేస్తున్న గుంతకల్లు జేఏసీ నాయకులు మీద అక్రమంగా పెట్టిన కేసును శుక్రవారం గుంతకల్లు ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టు కొట్టి వేసిందని జేఏసీ నాయకులు మంజుల వెంకటేష్,చక్రపాణి తెలిపారు. వారు మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆసుపత్రిలో రక్తనిధి లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని రక్త నిధి కోసం నిరసనలు చేశామన్నారు.
ATP: గుత్తి ప్రభుత్వ ఆసుపత్రిలో శుక్రవారం గర్భిణీలకు ఉచిత భోజన కార్యక్రమం నిర్వహించారు. గుత్తి టీడీపీ మండల ఇంచార్జ్ నారాయణ, ఆసుపత్రి సూపరిండెంట్ ఎల్లప్ప చేతుల మీదుగా గర్భిణీలకు భోజనాన్ని అందజేశారు. వారు మాట్లాడుతూ.. గర్భిణీలు పౌష్టిక ఆహారం తీసుకుంటేనే తల్లి, బిడ్డ ఆరోగ్యంగా ఉంటారని సూచించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.
PLD: మహా శివరాత్రి సందర్భంగా భారీ సంఖ్యలో వచ్చే భక్తుల కోసం కోటప్ప కొండపై ప్రసాదం కౌంటర్ల సంఖ్య పెంచాలని జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు కోటప్పకొండ ఈవోను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లోని అంబేడ్కర్ సమావేశ మందిరంలో కోటప్పకొండ తిరునాళ్ల నిర్వహణపై సమీక్ష సమావేశం నిర్వహించారు.
AP: వైసీపీ మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణకి ఈడీ షాకిచ్చింది. హయగ్రీవ ఫామ్స్కు చెందిన రూ.44.74 కోట్ల ఆస్తులను జప్తు చేసింది. విశాఖ హయాగ్రీవ భూముల అమ్మకాల్లో ఎంవీవీ, ఆయన ఆడిటర్ జీవీ, మేనేజింగ్ పార్టనర్ గద్దె బ్రహ్మాజీలు సూత్రధారులుగా ఉన్నట్లు తెలిపింది. ప్లాట్లు అమ్మి దాదాపు రూ.150 కోట్లు ఆర్జించినట్లు పేర్కొంది. అలాగే, వివిధ పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించింది.
NDL: కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖల సహాయ మంత్రి హర్ష్ మల్హోత్రాను ఢిల్లీలో డోన్ పట్టణానికి చెందిన ఏపీ బీజేపీ యువ నాయకులు కొట్టె మల్లికార్జున శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. మల్లికార్జున మాట్లాడుతూ పార్టీ ఆదేశాల మేరకు ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ మేనిఫెస్టోను ప్రజలకు వివరించామన్నారు.
ప్రకాశం: YS జగన్ ఆదేశాల మేరకు శుక్రవారం విఠలాపురం సర్పంచ్ మారం ఇంద్రసేనారెడ్డిని జిల్లా వైసీపీ సెక్రటరీగా పార్టీ అదిష్టానం నియమించింది. ఈ సందర్భంగా తనకు అవకాశం ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి, జిల్లా వైసీపీ ఇంఛార్జ్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. తనకు ఇంకా పార్టీ పట్ల బాధ్యత పెరిగిందని, తన పదవికి న్యాయం చేస్తానని అన్నారు.
KRNL: అమెరికాలోకి అక్రమ వలసల నివారణలో భాగంగా ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్ వలసలు వచ్చిన ప్రజలను వారి దేశాలకు పంపే విధానంలో భారతీయుల చేతికి, కాళ్లకు సంకెళ్లు వేసి యుద్ధ విమానంలో పంపడం అమానుషమని పీడీయస్యూ రాష్ట్ర కార్యదర్శి రాజేష్ అన్నారు. ఎమ్మిగనూరులో జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ అమెరికా భారత్ను మిత్రదేశంగా చెప్పుకుంటూ ఇలా చేయడం సరికాదన్నారు.
GNTR: ఈ నెల 10వ తేదీన జాతీయ నులిపురుగుల నివారణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఫిరంగిపురం ఎంపీడీవో వెంకటేశ్వరరావు అన్నారు. మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. ఈనెల 10వ తేదీ 1-19 సంవత్సరాల వయస్సు పిల్లలందరికీ ఆల్బెండజోల్ మాత్రలను మింగించడం జరుగుతుందని అన్నారు.
ప్రకాశం: కనిగిరిలోని సబ్-డివిజనల్ కార్యాలయంలో శుక్రవారం డీఎస్పీ యశ్వంత్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పెండింగ్లో ఉన్న కేసులు, నేరాల సంఖ్య, కేసుల దర్యాప్తు స్థితి తీసుకునే చర్యలపై అధికారులకు దిశా నిర్దేశం చేశారు. పెండింగ్లో ఉన్న కేసులను త్వరగా పరిష్కరించాలని డీఎస్పీ స్పష్టం చేశారు.