BHPL: భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 9వ వార్డులో రంజాన్ పండుగ సందర్భంగా ముస్లిం సోదరులకు రంజాన్ తోఫాలను స్థానిక కౌన్సిలర్ అప్పం కిషన్ పంపిణీ చేశారు. కౌన్సిలర్ మాట్లాడుతూ.. రంజాన్ మాసం ఆత్మశుద్ధి, నియమ నిష్ఠలు, సహనం, దాతృత్వం వంటి మహత్తర విలువలను పెంపొందించే పవిత్ర కాలమన్నారు. రంజాన్ వేడుకలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని అన్నారు.
అన్నమయ్య: నెలవంక దర్శనంతో రేపు రంజాన్ పండుగ, దేశవ్యాప్తంగా ఈద్ ఉల్ ఫిత్ర్ వేడుకలు ఘనంగా జరగనున్నాయి. మసీదుల్లో ప్రత్యేక నమాజ్లు, జకాత్–ఫిత్రా విరాళాలతో ముస్లింలు పండుగను ఆనందంగా ఆచరించనున్నారు. పోలీసులు భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. కుటుంబ సభ్యులు, బంధువులతో శుభాకాంక్షల మార్పిడి జరుగనుంది. ఈద్గాహ్లలో భక్తుల రద్దీ ఉండే అవకాశం ఉంది.
సీరియల్ నటి, బిగ్ బాస్ ఫేమ్ శ్రీ సత్య తన వ్యక్తిగత జీవితం గురించి కీలక వ్యాఖ్యలు చేసింది. ‘నేను ఏడో తరగతి చదువుతున్నప్పుడు రోడ్డు మీద నడుస్తూ వెళుతుంటే ఒకడు నా నడుము గిల్లి వెళ్లిపోయాడు. ఆ ఘటన జరిగిన సమయంలో ఎంతోమంది చుట్టూ ఉన్నారు. కానీ ఒక్కరూ ముందుకు వచ్చి ఆపలేదు. నాకు ఇప్పటికీ తప్పుడు ఉద్దేశాలతో ఫోన్ కాల్స్ వస్తుంటాయి‘ అని భావోద్వేగానికి గురైంది.
BPT: జిల్లాలో నిషేధిత భూముల 22ఏ జాబితా నుంచి చట్టబద్ధంగా తొలగింపు ప్రక్రియ కొనసాగుతోందని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వినోద్ కుమార్ తెలిపారు. ఇప్పటికే 530 ఎకరాల భూమిని జాబితా నుంచి తొలగించినట్లు వెల్లడించారు. ఈ ప్రక్రియలో భాగంగా ఇప్పటివరకు 1,406 దరఖాస్తులు స్వీకరించి, వాటిని పరిశీలించిన అనంతరం నిర్ణయాలు తీసుకుంటున్నామని చెప్పారు.
NTR: వత్సవాయి మండలం డబ్బాకుపల్లిలో శుక్రవారం జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త మురళీకృష్ణ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. పార్టీ బలోపేతానికి సభ్యత్వ నమోదు కీలకమని పేర్కొన్నారు. ప్రమాదవశాత్తు ఎవరైనా చనిపోతే వారికి రూ.5 లక్షల బీమాను జనసేన పార్టీ అందిస్తుందని తెలిపారు.
ప్రకాశం: రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి తెలిపారు. శుక్రవారం తర్లుపాడు మండలం మీర్జాపేట గ్రామంలో ఏర్పాటుచేసిన రైతన్న మీకోసం కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ప్రభుత్వం లోటు బడ్జెట్లో ఉన్న రైతుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తుందని, వైసీపీ చేసిన రూ.లక్షల కోట్ల లోటు బడ్జెట్ను చేసిందని మండిపడ్డారు.
ప్రేమదేశం హీరో అబ్బాస్ సుదీర్ఘ విరామం తర్వాత ‘హ్యాపీరాజ్’ సినిమాతో తిరిగి వెండితెరపై మెరవనున్నారు. జీవీ ప్రకాష్ కుమార్ హీరోగా నటించిన ఈ చిత్రంలో అబ్బాస్ ఒక కీలక పాత్ర పోషించనున్నారు. కథ బాగా నచ్చడంతోనే ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని దర్శకుడు మరియా రాజా తెలిపారు. ఈ నెల 27న విడుదల కానున్న ఈ సినిమా ట్రైలర్ లాంచ్ వేడుక హైదరాబాద్లో ఘనంగా నిర్వహించారు.
KDP: వైఎస్ విజయమ్మ ఆస్తుల విషయంలో స్టాంప్ వేసి ప్రకటన చేయడం భాద కలిగిందని ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి అన్నారు. ఇది TDPకు చెందిన వారి నుండే బయటికి వచ్చిందని, వైఎస్ కుటుంబ ఇంటి గుట్టు మొదట వారికే చేరవేస్తున్నారని రాచమల్లు అన్నారు. విజయమ్మ, షర్మిల, సునీతలు జగన్ మోహన్ రెడ్డిని రెండు రాష్ట్రాలలో దిగజారుస్తున్నారన్నారు.
CTR: రొంపిచర్ల మండలం చిచ్చిలివారిపల్లికి చెందిన వైసీపీ నియోజకవర్గ బీసీ సెల్ అధ్యక్షుడు బాలాజీ రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు. పీలేరులోని ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న ఆయనను ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి శుక్రవారం పరామర్శించారు. ఈ సందర్భంగా త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు.
JN:స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ ముస్లిం సోదర,సోదరీమణులకు రేపు రంజన్ పర్వదినాన్ని పురస్కరించుకొని ఎమ్మెల్యే కడియం శ్రీహరి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. చెడు భావనల్ని, అధర్మాన్ని, ద్వేషాన్ని రూపుమాపే గొప్ప పండుగ రంజాన్ అని అన్నారు. ఈ పవిత్ర మాసం దీక్షలు, ప్రేమ, దయ,సౌభ్రాతృత్వ గుణాలను పంచుతుందని పేర్కొన్నారు.
TG: దేశం వికసిత్ భారత్గా అభివృద్ధి చెందాలంటే గ్రామాల అభివృద్ధి జరగాలని బీజేపీ ఎంపీ డీకే అరుణ అన్నారు. రహదారులు, పాఠశాలలు, విద్యుత్ ఇవన్నీ ఉన్నప్పుడే గ్రామం అభివృద్ధి చెందుతుందని అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఇస్తున్న నిధులతో గ్రామాలు శరవేగంగా అభివృద్ధి చెందుతున్నాయని అన్నారు.
MHBD: ఓ ప్రముఖ న్యూస్ ఛానల్ ఆధ్వర్యంలో రూపొందించిన శ్రీ పరాభవ నామ సంవత్సర పంచాంగంని ఎస్పీ డా.శబరీష్ శుక్రవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన జర్నలిస్టులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. జర్నలిస్ట్ గాడిపల్లి శేఖర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో TUWJ(IJU) జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్, జిల్లా ప్రధాన కార్యదర్శి గాడిపల్లి శ్రీహరి, తదితరులున్నారు.
2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఫాస్టాగ్ వార్షిక పాస్ ధరలను NHAI పెంచింది. ప్రస్తుత వార్షిక పాస్ ధర రూ.3 వేలు ఉండగా.. దీనిని రూ.3075కు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. పెంచిన ఈ ధరలు ఏప్రిల్ 1 నుంచి అమలులోకి వస్తాయని అధికారులు వెల్లడించారు.
అన్నమయ్య: మదనపల్లె(మం) చీకుల బైలు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు బాలురు(భువనేష్ రెడ్డి-6, కుశిల్ రెడ్డి-10)మృతి చెందారు. ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొనడంతో ఈ ఘటన జరిగింది. తండ్రి శివారెడ్డితో సహా మరో బాలుడు ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుల కుటుంబాలను శ్రీరామ్ చిన్నబాబు పరామర్శించారు.
W.G: గ్రామాలను అభివృద్ధి చేసి చూపిస్తున్నామని, ప్రతి గ్రామానికి పక్కా రోడ్లు వేయిస్తున్నామని ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. భీమవరం మండలంలో సుమారు రూ. 5 కోట్లతో జరిగే కాళీపట్నం-భీమవరం రహదారి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. కూటమి ప్రభుత్వం రహదారుల అభివృద్ధికి పెద్ద పీట వేస్తుందన్నారు.