• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

నేడు బోధన్‌కు ఎమ్మెల్సీ అభ్యర్థి రాక

NZB: బోధన్ పట్టణంలో పట్టభద్రులు గళం బలం అనే సమావేశానికి శనివారం కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ నియోజకవర్గ పట్టభద్రుల అభ్యర్థి నరేందర్ రెడ్డి రానున్నారు. ఆయనతో పాటు బోధన్ ఎమ్మెల్యే ప్రొద్దుటూరి సుదర్శన్ రెడ్డి హాజరుకానున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఈ సమావేశంలో చర్చించచున్నారు.

February 8, 2025 / 04:04 AM IST

పంచాయితీ ఎన్నికలపై BIG UPDATE

TG: రాష్ట్రంలో పంచాయితీ ఎన్నికలకు ఎన్నికల సంఘం శరవేగంగా ఏర్పాట్లు చేస్తోంది. MPTC, ZPTC ఎన్నికలకు ఫ్రీ సింబల్స్‌ను ప్రకటిస్తూ.. జిల్లా ఎన్నికల అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. రిటర్నింగ్ అధికారులు, పోలింగ్ సిబ్బందిని ఈనెల 10వ తేదీ వరకు ఖరారు చేయాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించింది. 15వ తేదీ వరకు పోలింగ్ కేంద్రాల తుది జాబితాను విడుదల చేయాలని పేర్కొంది.

February 7, 2025 / 11:07 PM IST

విజయ్ దేవరకొండ ఫ్యాన్స్‌కు డబుల్ ధమాకా

రౌడీ హీరో విజయ్ దేవరకొండ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమా ‘VD12’. ఈ మూవీ అప్‌డేట్ కోసం విజయ్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. తాజాగా రౌడీ హీరో అభిమానులకు చిత్ర బృందం గుడ్‌న్యూస్ చెప్పింది. ఈనెల 12న మూవీ టైటిల్ రివీల్ చేయడంతోపాటు టీజర్ కూడా విడుదల చేయనున్నట్లు సోషల్ మీడియా వైదికగా ప్రకటించింది. ఈ మేరకు ఓ పోస్టర్‌ను షేర్ చేసింది.

February 7, 2025 / 08:29 PM IST

బీసీ నేతలతో కేటీఆర్ భేటీ

TG: అందుబాటులో ఉన్న బీసీ నేతలతో మాజీ మంత్రి కేటీఆర్ భేటీ అయ్యారు. ఎమ్మెల్సీ శంబిపూర్ రాజు నివాసంలో సమావేశం నిర్వహించారు. బీసీలకు కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలుపై చర్చించినట్లు తెలుస్తోంది. బీసీలకు కాంగ్రెస్ ద్రోహం చేసిందని ఆరోపణలు చేశారు. త్వరలోనే బీఆర్ఎస్ కార్యాచరణ ప్రకటించే అవకాశం ఉంది.

February 7, 2025 / 08:25 PM IST

‘జగన్ సీఎంగా ‌1.O ఒక ప్లాఫ్ ‌సినిమా’

E.G: వైసీపీ అధ్యక్షుడు జగన్‌ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 1.O వెర్షన్‌ ఒక ప్లాప్‌ సినిమా అని రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ విమర్శించారు. శుక్రవారం రాజమండ్రి ప్రెస్‌క్లబ్‌లో ఆయన మాట్లాడుతూ.. ఇప్పుడు మళ్లీ 2.O అంటే ఏంటో చూపిస్తానని చెప్పడం, 30సంవత్సారాలు సీఎంగా ఉంటానని భ్రమల్లో ఉన్నాడని ఎద్దేవా చేశారు. ఈసారి 11 సీట్లు కూడా రావని అన్నారు.

February 7, 2025 / 08:19 PM IST

వైసీపీకి మరో షాక్

AP: రాష్ట్రంలో వైసీపీ మరో షాక్ తగిలింది. పల్నాడు జిల్లా వినుకొండ మున్సిపల్ ఛైర్మన్ డాక్టర్ దస్తగిరి వైసీపీకి రాజీనామా చేశారు. ఆయన సతీమణి, 30వ వార్డు కౌన్సిలర్ షకీలా కూడా ఆ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ మేరకు పార్టీ అధినేత, మాజీ సీఎం జగన్‌కు లేఖ రాశారు. త్వరలో ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు సమక్షంలో దస్తగిరి దంపతులు టీడీపీలో చేరనున్నారు.

February 7, 2025 / 08:16 PM IST

ఉమెన్ సేఫ్టీ యాప్పై అవగాహన

కృష్ణా: విజయవాడ విమానాశ్రయం ప్రాంగణం వద్ద శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఉమెన్ సేఫ్టీ యాప్ పై పోలీసులు అవగాహన కల్పించారు. ఈ మేరకు యాప్ సేవల గురించి మహిళా పోలీసులు ప్రయాణికులకు విస్తృతంగా అవగాహన కల్పించారు. అత్యవసర సమయాలలో ఆపద ఎదురైతే ఈ యాప్ ద్వారా పోలీస్ సిబ్బందికి, కుటుంబసభ్యులకు సమాచారం ఇవ్వవచ్చని పోలీస్ సిబ్బంది వివరించారు.

February 7, 2025 / 08:11 PM IST

చంపాపేట్లో సమస్యలు తెలుసుకున్న మధుయాష్కి గౌడ్

హైద్రాబాద్: ఎల్బీనగర్ పరిధి చంపాపేట డివిజన్ ఉదయ నగర్ కాలనీలో కాంగ్రెస్ తెలంగాణ ప్రచార కమిటీ ఛైర్మన్ మధుయాష్కి గౌడ్ పర్యటించారు. కాలనీ ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వీలైనంత తొందరలోనే కాలనీలోని సమస్యలు తీరుస్తామని కాలనీ వాసులకు హామీ ఇచ్చారు.

February 7, 2025 / 07:54 PM IST

మొక్కల సంరక్షణ సక్రమంగా చేపట్టాలి : ఆర్డీవో

KMR: ఎల్లారెడ్డి నర్సరిలో మొక్కల సంరక్షణ సక్రమంగా చేపట్టాలని ఆర్డీవో ప్రభాకర్ శుక్రవారం సూచించారు. మండలంలోని బ్రాహ్మణపల్లి నర్సరీని అయిన శుక్రవారం పరిశీలించారు. నర్సరీలో పెరుగుతున్న మొక్కల వివరాలు అడిగి తెలుసుకున్నారు. వర్షాకాలంలో మొక్కలు నాటేందుకు సంసిద్ధం చెయాలనీ నిర్వహకులకు సూచించారు.

February 7, 2025 / 07:51 PM IST

శ్రీ అన్నపూర్ణేశ్వరిని సన్నిధిలో మాజీ మంత్రి

సత్యసాయి: భారతదేశంలో ప్రసిద్ధిగాంచిన హోరనాడులోని శ్రీ అన్నపూర్ణేశ్వరి అమ్మవారిని మాజీ మంత్రి, పెనుకొండ నియోజకవర్గ వైసీపీ ఇన్‌ఛార్జ్ ఉషశ్రీ చరణ్ శుక్రవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా శ్రీ అన్నపూర్ణేశ్వరి ఆలయంలో ఆమె ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. మాజీ మంత్రి వెంట పెనుకొండ వైసీపీ నాయకులు ఉన్నారు.

February 7, 2025 / 07:37 PM IST

పాత కక్షల కారణంగా ఇరువర్గాల మధ్య ఘర్షణ

ATP: బుక్కరాయసముద్రం మండల కేంద్రంలో శుక్రవారం పాత కక్షల కారణంగా ఇరు వర్గాల మధ్య మాట మాట పెరిగి ఘర్షణకు దారితీసింది. ఈ ఘర్షణలో ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ ఘర్షణలో రాజు, హాబీబ్ అనే ఇరువురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం అనంతపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

February 7, 2025 / 07:35 PM IST

ఎన్నికలకు పార్టీ నేతలు సిద్ధంగా ఉండాలి: మంత్రి

MLG: మంగపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా రాష్ట్ర పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ దనసరి అనసూయ (సీతక్క) హాజరై మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ నాయకులు సిద్ధంగా ఉండాలనీ, పార్టీ లైన్‌లోనే ప్రతి ఒక్కరూ పని చేయాలని కోరారు.

February 7, 2025 / 07:16 PM IST

గుండె పోటుతో వ్యవసాయ కూలీ మృతి

NZB: వర్ని మండలం శ్రీనగర్ గ్రామానికి చెందిన కోటేశ్వరరావు అనే వ్యక్తి గురువారం మధ్యాహ్నం పొలంలో పని చేస్తుండగా గుండెపోటు వచ్చి మృతి చెందినట్లు ఎస్సై రమేశ్ శుక్రవారం తెలిపారు. పోలీస్ల వివరాల ప్రకారం మృతుడు అదే గ్రామానికి చెందిన మేక వెంకటేశ్వర్ రావు వద్ద 10 సంవత్సరాల నుంచి వ్యవసాయ కూలీగా పని చేస్తున్నాడు. కుమారుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు వివరించారు.

February 7, 2025 / 07:11 PM IST

శుభాష్ రెడ్డి‌ని సస్పెండ్ చేసిన హైకమాండ్

KMR: కాంగ్రెస్ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకు శుక్రవారం సుభాష్ రెడ్డిని పార్టీ నుండి సస్పెండ్ చేసిన హైకమాండ్. గత కొన్ని రోజుల క్రితం ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఒక మీటింగ్‌లో ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్‌పై మరియు పార్టీని దుర్భాషలాడినందుకు హైకమాండ్ ఇట్టి విషయాన్నీ తీవ్రమైన కఠిన చర్యగా తీసుకొని సస్పెండ్ చేశారు.

February 7, 2025 / 07:03 PM IST

జేఏసీ నాయకులపై అక్రమ కేసు కొట్టివేత

ATP: గత వైసీపీ ప్రభుత్వంలో రక్త నిధి కోసం పోరాటం చేస్తున్న గుంతకల్లు జేఏసీ నాయకులు మీద అక్రమంగా పెట్టిన కేసును శుక్రవారం గుంతకల్లు ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టు కొట్టి వేసిందని జేఏసీ నాయకులు మంజుల వెంకటేష్,చక్రపాణి తెలిపారు. వారు మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆసుపత్రిలో రక్తనిధి లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని రక్త నిధి కోసం నిరసనలు చేశామన్నారు.

February 7, 2025 / 06:55 PM IST