MHBD: రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని మునిగల వీడు గ్రామంలో ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం ముస్లిం సోదరులకు గ్రామ సర్పంచ్ చైతన్య నాగరాజు రంజాన్ తోఫా కిట్లను పంపిణీ చేశారు. రంజాన్ పండుగను గ్రామంలో ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని, గ్రామంలో అన్ని వర్గాల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నామన్నారు.
మెదక్ జిల్లా రామాయంపేట మండలం ప్రగతి ధర్మారం గ్రామంలో రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని ముస్లిం సోదరులకు శుక్రవారం ఇఫ్తార్ విందు నిర్వహించారు. గ్రామ సర్పంచ్ బండారి శ్రీనివాస్ గౌడ్ ఉపవాస దీక్షలో ఉన్న ముస్లింలకు పండ్లు, ఖర్జూరాలు అందజేసి దీక్ష విరమింపజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. మత సామరస్యానికి రంజాన్ పండుగ ప్రతీక అని కొనియాడారు.
NZB: ఆలూర్లో దొంగలు బీభత్సం సృష్టించారు. తాళం వేసిన ఇంట్లోకి చొరబడి చోరీకి పాల్పడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆలూర్ మండల కేంద్రంలో తాళం వేసి ఉన్న ఇంటిని లక్ష్యంగా చేసుకున్న దుండగులు, ఇంట్లోని బీరువాలను పగులగొట్టి 10 తులాల బంగారు ఆభరణాలు, రూ.2 లక్షల నగదును అపహరించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
BHNG: చౌటుప్పల్ మున్సిపాలిటీ లక్కారంకు చెందిన గుండెబోయిన రవికుమార్ యాదవ్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఎన్నికైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ ఛైర్మన్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఆకుల ఇంద్రసేనారెడ్డి, లక్కారం కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా సన్మానం చేసి శుభాకాంక్షలు తెలిపారు. మరిన్ని ఉన్నతి పదవులు పొందాలని ఆకాంక్షించారు.
NLG: కేతేపల్లి మండలం భీమవరం గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ పసుపులేటి సైదులు బ్రెయిన్ క్లాట్ కారణంగా ఖమ్మం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఆ కుటుంబాన్ని ‘లిటిల్ సోల్జర్స్’ ఆదుకుంది. ప్రతినిధులు శుక్రవారం సైదులు తండ్రి వెంకటేశ్వర్లుకు రూ.22,200 ఆర్థిక సాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రతినిధులు నరేష్ తదితరులు పాల్గొన్నారు.
TG: బాసర ట్రిపుల్ ఐటీ కాలేజీ దగ్గర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. క్యాంపస్ లో క్యాండిల్ ర్యాలీకి విద్యార్థులు పిలుపునిచ్చారు. దీంతో ర్యాలీలో పాల్గొనేందుకు తేజస్విని తల్లిదండ్రులు వచ్చారు. ఈ క్రమంలో తల్లిదండ్రులకు అనుమతి లేదని యాజమాన్యం చెప్పింది. దీంతో కాలేజీ గేటు ఎదుట తేజస్విని పేరెంట్స్ ఆందోళన వ్యక్తం చేశారు.
ATP: ముస్లిం సోదరులు అత్యంత పవిత్రంగా భావించే రంజాన్ పండుగ తేదీ ఖరారైంది. గుత్తిలో శుక్రవారం సాయంకాలం ఆకాశంలో రంజాన్ మాసపు నెలవంక కనిపించింది. దీంతో ముస్లింలు శుక్రవారం సాయంకాలం ఉపవాస ప్రక్రిను పూర్తి చేశారు. ఈ క్రమంలో రేపే రంజాన్ పండుగను దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకోనున్నట్లు మసీదుల ఇమామ్లు తెలిపారు. నెలవంక ప్రత్యక్షంతో రంజాన్ మాసం 30 రోజులు పూర్తయింది.
సత్యసాయి: సోమందేపల్లి మండల నూతన ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన సుధాకర్ యాదవ్ను శుక్రవారం సోమందేపల్లి ముస్లింలు మర్యాదపూర్వకంగా కలిశారు. శనివారం సోమందేపల్లిలో జరగనున్న రంజాన్ పండుగ సందర్భంగా ర్యాలీగా ఈద్గా వద్దకు వెళ్లనున్న నేపథ్యంలో తగిన పోలీస్ బందోబస్త్ ఏర్పాటు చేయాలని ఎస్సైని కోరారు. దీనిపై అవసరమైన భద్రతా ఏర్పాట్లు చేస్తామని ఎస్సై హామీ ఇచ్చారు.
E.G: గోపాలపురంలో ఉన్న సివిల్ సప్లై గోదాంపై విజిలెన్స్ DSP తాతారావు తన సిబ్బందితో ఆకస్మిక దాడి నిర్వహించారు. రేషన్ బియ్యం, ప్రభుత్వం సరఫరా చేసే నూనె, పంచదార నిల్వలపై సమగ్రంగా పరిశీలించారు. సరుకుల నిల్వలు, రికార్డులు, పంపిణీ విధానం తదితర అంశాలపై అధికారులు ఆరా తీశారు. ఈ తనిఖీలలో డివిజనల్ సివిల్ సప్లై డిప్యూటీ తహశీల్దార్ రంగ ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.
VZM: రహదారి ప్రమాదాల నియంత్రణకు ప్రణాళికాబద్ధమైన చర్యలు చేపట్టాలని జిల్లా ఎస్పీ ఎ.ఆర్. దామోదర్ అధికారులను ఆదేశించారు. చెల్లూరు బైపాస్, అయినాడ, మోదవలస తదితర బ్లాక్ స్పాట్ ప్రాంతాలను శుక్రవారం పరిశీలించి స్పీడ్ బ్రేకర్లు, బ్లింకర్లు, జీబ్రా లైన్లు ఏర్పాటు చేయాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
SRCL: మున్నూరు కాపులు ఐక్యంగా ఉండి ముందుకు సాగాలని ముస్తాబాద్ మున్నూరు కాపు సంఘం మండల అధ్యక్షుడు బొప్ప నర్సయ్య అన్నారు. ముస్తాబాద్లో మున్నూరు కాపులు శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నర్సయ్య మాట్లాడుతూ.. కాపులు బీసీ జనాభాలో అధిక శాతం ఉన్నప్పటికీ చైతన్యంలో వెనుకబడి ఉన్నామని అన్నారు. అందరు ఐక్యంగా ఉండి కలిసికట్టుగా ముందుకు సాగాలన్నారు.
KMM: జిల్లాలో గ్రీన్ ఫీల్డ్ హైవే పనుల్లో ప్రమాదానికి గురైన కార్మికుడు పర్వేష్కు జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి గారు రూ. 31.31 లక్షల నష్టపరిహారపు చెక్కును అందజేశారు. కార్మిక నష్టపరిహార చట్టం కింద సంబంధిత యాజమాన్యం ఈ మొత్తాన్ని చెల్లించింది. పని ప్రదేశాలలో ప్రమాదాలు జరిగినా కార్మికులు వెంటనే జిల్లా కార్మిక శాఖను సంప్రదించాలని సూచించారు.
SRPT: సూర్యాపేటలోని కొత్త వ్యవసాయ మార్కెట్ వద్ద ఇవాళ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో 4 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని, ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. సీలేరు నుంచి గంజాయి తెచ్చి విక్రయిస్తున్న వీరి వద్ద నుంచి రెండు బైకులు, ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు సీఐ వెంకటయ్య తెలిపారు. యువత మత్తుకు దూరంగా ఉండాలని, గంజాయి రవాణాపై సమాచారం ఇవ్వాలని ఆయన కోరారు.
AP: రానున్న 24 గంటల్లో ఉత్తరాంధ్రలోని చాలా ప్రాంతాల్లో వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. గంటకు 30 కిలోమీటర్ల నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీయనున్నాయి. అకాలవర్షాలు, ఈదురుగాలులు ఉండటంతో రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రెండు రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలకు మామిడి, మినుము, వరి, చెరుకు పంటలు దెబ్బతిన్నాయి.
SKLM: ప్రజా సమస్యలను తక్షణమే పరిష్కరించాలని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. శుక్రవారం నిమ్మడ క్యాంపు కార్యాలయంలో ప్రజా సమస్యలను తెలుసుకొని పరిష్కరించేందుకు ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ మేరకు జిల్లా నలుమూలల నుంచి ప్రజలు వారి సమస్యలను దరఖాస్తు రూపంలో అందజేశారు. వినతులను పరిశీలించి తక్షణమే పరిష్కరించాలని అధికారులని ఆదేశించారు.