NRPT: మక్తల్ మున్సిపాలిటీ పరిధిలోని యాదవ్ నగర్లో ఉన్న శ్రీ వీరభద్ర స్వామి జాతర సందర్భంగా శుక్రవారం ఆలయ కమిటీ సభ్యులు, స్థానికులు జాతర పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆదివారం నుంచి మంగళవారం వరకు స్వామి వారి ఉత్సవాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని జాతరను విజయవంతం చేయాలని కోరారు.
VZM: ఎస్కోట మండలం పల్లపు దుంగాడ గ్రామానికి మంజూరైన రోడ్డు నిర్మాణాన్ని సత్వరమే ప్రారంభించాలని నియోజకవర్గ జనసేన నాయకులు వబ్బిన సన్యాసినాయుడు కోరారు. రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరైనప్పటికీ అధికారులు జాప్యం చేస్తున్నారని మండిపడ్డారు. నిర్మాణం చేపట్టకపోతే ఆందోళన చేస్తామని హెచ్చరిస్తూ శుక్రవారం ఎంపీడీవో సతీష్కు వినతి పత్రం అందజేశారు.
KKD: కూటమి ప్రభుత్వం కేవలం ప్రచారానికే పరిమితమైందని, ప్రజలకు చేసింది శూన్యమని వైసీపీ కాకినాడ రూరల్ ఇంఛార్జ్ కురసాల కన్నబాబు విమర్శించారు. శుక్రవారం తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. లక్షల ఉద్యోగాలతో జాబ్ క్యాలెండర్ ఇస్తామన్న హామీ ఏమైందని నిలదీశారు. యువగళం అంటూ హడావిడి చేసిన లోకేశ్ ఇప్పుడు ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు.
KRNL: ఆస్పరిలో బొడ్రాయి స్థాపన పూజ కార్యక్రమం శుక్రవారం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలూరు మార్కెట్ యార్డ్ ఛైర్మన్ తలారి వెంకటేశ్వర్లు, సర్పంచ్ మూలింటి రాధమ్మ, మూలింటి రాఘవేంద్రతో పాటు గ్రామస్తులు, వార్డు సభ్యులు పెద్ద ఎత్తున హాజరై పూజల్లో పాల్గొన్నారు. గ్రామాభివృద్ధి, శ్రేయస్సు కోసం ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
BDK: కొల్లుగూడెం సమీపంలోని గోదారిలో ఈతకు ఏడుగురు యువకులు ఈతకు వెళ్ళగా అందులో ఐదుగురు గల్లంతు అయిన విషయం తెలిసిందే. తాజాగా గల్లంతయిన వారిలో ఇద్దరి మృతదేహాలు లభ్యమయ్యాయి. ఆ మృతదేహాలు భద్రాచలంకు చెందిన చారుగుండ్ల శ్రీకర్, ఉయ్యూరుకి చెందిన నవదీప్లుగా పోలీసులు గుర్తించారు. మిగిలిన ముగ్గురి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
ATP: ఉగాది పండుగను పురస్కరించుకొని తాడిపత్రి నియోజకవర్గంలోని కోటకొండ ఆంజనేయస్వామి ఆలయంలో శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారిని రంగురంగుల పుష్పాలతో అద్భుతంగా అలంకరించారు. ఈ వేడుకను చూసేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక శోభతో విరాజిల్లింది.
KNR: శంకరపట్నం మండలం మొలంగూరు శివారులో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. జాతీయ రహదారి నిర్మాణ పనులు జరుగుతుండగా వన్ వేలో వాహనాలను అనుమతించారు. వన్ వేలో వెళ్తున్న ఓ కారులో పెట్రోల్ అయిపోవడంతో వాహనం నిలిచిపోయింది. దీంతో వందలాది వాహనాలు రహదారిపై నిలిచిపోయాయి. వాహనదారులు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
SRPT: కోదాడ పట్టణ పరిధిలోని సాలర్జంగ్ పేటలోని ఈద్గా వద్ద రంజాన్ ప్రార్థనలకు కోదాడ మునిసిపల్ పాలక వర్గం అన్ని ఏర్పాట్లు చేస్తుందని మున్సిపల్ ఛైర్పర్సన్ కుసుమ వెంకట్ రత్నం బాబు అన్నారు. శుక్రవారం ఈద్గా వద్ద ముస్లింల ప్రార్థనలకు మున్సిపల్ పాలక వర్గం ఆధ్వర్యంలో జరుగుతున్న ఏర్పాట్లను ఆమె పరిశీలించారు.
KMR: జిల్లాలో పార్టీ బలోపేతం దిశగా పని చేస్తామని డీసీసీ కమిటీలో నియామకమైన నాయకులు పేర్కొన్నారు. కామారెడ్డి జిల్లలో 84 మందితో డీసీసీ కమిటీ ప్రకటించిన విషయం తెలిసిందే. డీసీసీ ప్రధాన కార్యదర్శులుగా నిమ్మ విజయ్ కుమార్ రెడ్డి, జూలూరి సుధాకర్, డీసీసీ ఉపాధ్యక్షులుగా పంపరి లక్ష్మణ్, సబ్బని హరికృష్ణ నియామకమయ్యారు.
ప్రకాశం: CPI ఆధ్వర్యంలో ఈ నెల 24న రాష్ట్ర వ్యాప్త నిరసన సందర్భంగా మార్కాపురం సీపీఐ పూలసుబ్బయ్య భవన్లో నాయకులు పోస్టర్ను శుక్రవారం ఆవిష్కరించారు. పేదలకు ఇళ్ల స్థలాలు, గృహ నిర్మాణానికి రూ.5 లక్షలు అందజేయాలని, అలాగే వృద్ధాప్య పెన్షన్ అందజేయాలని సీనియర్ నాయకులు అందే నాసరయ్య డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు .
SDPT: జగదేవపూర్ మండల కేంద్రంలో బోళ్ల కనకమ్మ నూతనంగా నిర్మించుకున్న ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమం సర్పంచ్ పనుగట్ల శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా సర్పంచ్ గుమ్మడికాయ కొట్టి ఇంటిని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ మచ్చ గణేష్, వివిధ వార్డుల సభ్యులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
BHNG: మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు సతీమణి శ్రీనిత శుక్రవారం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వేద పండితులు ఆమెకు వేద ఆశీర్వచనం, స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. ఆమెతోపాటు ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.
అన్నమయ్య: మదనపల్లెలోని ప్రభుత్వ సర్వజన బోధన ఆసుపత్రి ప్రధాన ద్వారం వద్ద ఉన్న పాత బోర్డు పూర్తిగా జీర్ణావస్థకు చేరింది. తుప్పు పట్టి ప్రమాదకరంగా మారినా, ఇప్పటికీ అధికారులు పట్టించుకోకపోవడం ప్రజల్లో అసంతృప్తి కలిగిస్తోంది. ఎప్పటికైనా ఈ బోర్డును తొలగించి కొత్తదాన్ని ఏర్పాటు చేస్తారా అన్న ప్రశ్న ఉత్కంఠ రేపుతోంది.
MBNR: దేవరకద్ర మున్సిపాలిటీలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ ప్రగతిని శుక్రవారం కలెక్టర్ ఖుష్భూ గుప్తా క్షేత్రస్థాయిలో పరిశీలించారు. లబ్ధిదారులకు అందుతున్న వసతులు, పెండింగ్ పనులపై అధికారులకు కీలక సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ ఛైర్మన్ యుగంధర్ రెడ్డి, కమిషనర్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
AP: YS మరణం వరకున్న ఆస్తులన్నీ కుటుంబ ఆస్తులేనని YS విజయలక్ష్మీ అన్నారు. ఆస్తుల పంపకం ఎప్పుడు జరగలేదని.. ఆస్తులు నలుగురు మనుమలకు సమానంగా పంచాలని వైఎస్ ఉద్దేశ్యమన్నారు. YS దగ్గర వాళ్లందరికీ తెలిసిన వాస్తవమిదని తెలిపారు. MOUలో రాసిన ప్రతి ఆస్తి షర్మిలకు చెందాల్సినవేనని వెల్లడించారు. ఆస్తుల విషయంలో జగన్.. తన మేనల్లుడికి, మేనకోడలికి అన్యాయం చేశాడని ఆరోపించారు.