KMM: అమెరికాలోని భారతీయ భాదితుల పట్ల ప్రధాని మోదీ శ్రద్ధ తీసుకోవాలని రాష్ట్ర గిడ్డంగుల సంస్థ ఛైర్మన్ రాయల నాగేశ్వరరావు అన్నారు. అమెరికాలో ఉన్న భారతీయులను బేడీలు వేయడానికి నిరసిస్తూ శనివారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఖమ్మంలో ట్రంప్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. కేంద్ర వైఫల్యం కారణంగానే 104 మంది భారతీయులను ట్రంప్ ప్రభుత్వం పంపివేసిందని ఆరోపించారు.
HYD: మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి కుమారుడు కౌశిక్ రెడ్డి కారుపై 28 పెండింగ్ చలాన్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. బంజారాహిల్స్లోని కేబీఆర్ పార్కు వద్ద ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఈ క్రమంలో పట్లోళ్ల కౌశిక్ రెడ్డి కారు తనిఖీ చేశారు. దీంతో 28 పెండింగ్ చలాన్లను పోలీసులు గుర్తించారు.
KMM: ఖమ్మం నగరంలోని VDO’S కాలనీలో ఉన్న రామాలయంలో శనివారం నిర్వహించిన వార్షిక బ్రహ్మోత్సవాల్లో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. మంత్రి పొంగులేటికి ముందుగా ఆలయ అర్చకులు ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం మంత్రి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నగర కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
VSP: గంజాయి అక్రమ రవాణాపై ప్రత్యేక దృష్టి సారించినట్లు నర్సీపట్నం డీఎస్పీ పీ.శ్రీనివాసరావు అన్నారు. శనివారం నాతవరం పోలీస్ స్టేషన్ ను ఆకస్మికంగా సందర్శించారు. స్టేషన్ లోని రికార్డులను తనిఖీ చేశారు. అనంతరం మాట్లాడుతూ.. రోడ్లు ప్రమాదాల నివారణ ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ప్రజలు సైబర్ నేరాలకు గురికాకుండా అవగాహన కల్పిస్తున్నామన్నారు.
అల్లూరి జిల్లా కేంద్రంలో ఉన్న ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో శనివారం ఆదివాసీ ప్రజాసంఘాల నాయకులు అత్యవసరంగా రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ నెల 11,12 తేదీల్లో జరిగే మన్యం బంద్కు తగిన కార్యచరణ ఈ సమావేశంలో రూపొందించారు. ఈ బంద్ని అన్ని వర్గాల ప్రజలు విజయవంతం చేయలని కోరారు. ఈ సమావేశంలో పలువురు రాజకీయ పార్టీ, ప్రజా సంఘ నాయకులు పాల్గొన్నారు.
VZM: కొత్తవలస మండలం మంగళపాలెం గ్రామానికి శనివారం విచ్చేసిన మాజీ ఉప రాష్ట్ర పతి ముప్పవరపు వెంకయ్యనాయుడు ను సెర్ప్ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు పుష్ప గుచ్చం అందజేశారు. మంత్రి తో పాటు ఏస్ కోట ఎమ్మెల్యే కూడా మాజీ ఉప రాష్ట్రపతిని కలిసి పుష్ప గుచ్చం అందజేశారు.
ఢిల్లీ ఎన్నికల ఫలితాలపై మాజీమంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. కంగ్రాట్స్ రాహుల్ గాంధీ అంటూ సెటైర్ వేశారు. బీజేపీని గెలిపించిన రాహుల్కు శుభాకాంక్షలు అని ఎద్దేవా చేశారు. కాగా.. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతూ విజయం దిశగా దూసుకెళ్తోంది. మళ్లీ తమదే అధికారమన్న ఆప్ వెనుకంజలో ఉంది.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. దాదాపు 7 రౌండ్ల కౌంటింగ్ పూర్తయింది. బీజేపీ 43 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా.. ఆప్ 27 స్థానాల్లో లీడ్లో ఉంది. కాంగ్రెస్ ఒక్క స్థానంలో కూడా ఆధిక్యంలో లేదు. సుమారు 8 స్థానాల్లో వెయ్యి ఓట్ల తేడాతో బీజేపీ, ఆప్ మధ్య హోరాహోరీ పోరు నెలకొంది. ఆప్ అధినేత కేజ్రీవాల్ 7వ రౌండ్ తర్వాత వెనకంజలో ఉన్నారు.
SKLM: జలుమూరు మండలం సురవరంలో అక్రమంగా మద్యం తరలిస్తున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎస్సై పి అశోక్ బాబు తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా వెంకటరమణ అనే వ్యక్తి 72 మద్యం సీసాలతో సురవరం గ్రామానికి వెళ్తున్నట్లు గుర్తించామన్నారు. తక్షణం నిందితుడుని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.
ADB: కారును లారీ ఢీకొన్న ఘటనలో ఒకరికి గాయాలైన ఘటన శుక్రవారం రాత్రి భైంసా పట్టణంలో చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం..నిర్మల్ నుంచి వస్తున్న కారును భైంసా పట్టణంలోని శివాజీ చౌక్ వద్ద కారును లారీ ఢీకొంది, కారులో ఉన్న భైంసా పట్టణానికి చెందిన శంకర్కు గాయాలు కాగా భైంసా ప్రైవేటు ఆసుపత్రికి తరలించినట్లు స్థానికులు తెలిపారు.
పల్నాడు: పిడుగురాళ్ల మండలం జానపాడు గ్రామం శివారులో శనివారం రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి పిడుగురాళ్ల వైపు వస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ అదుపుతప్పి బోల్తా పడింది. బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ ఘటనలో పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. ఎలాంటి ప్రాణ నష్టం లేకపోవడంతో స్థానికులు ఊపిరిపీల్చుకున్నారు.
SKLM: కంచిలి మండలం పెద్ద శ్రీరాంపురం పంచాయతీ పరిధిలో అభివృద్ధి కార్యక్రమాలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ మేరకు గ్రామ దేవత సింధుపోలమ్మ గుడి రోడ్డులో సీసీ డ్రైనేజ్ నిర్మాణానికి శనివారం పనులు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా గ్రామాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం చేస్తున్న కృషి అభినందనీయమని మండల టీడీపీ కార్యదర్శి మాదిన రామారావు అన్నారు.
ADB: ఇటీవల భారత రాజధాని ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు హోరాహోరీగా జరిగాయి. శనివారం ఉదయం 8 గంటల ప్రాంతంలో ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభంఅవ్వగా… ఆదిలాబాద్ జిల్లాలోని పలు మండలాల భాజపా నాయకులు, ఆమ్ ఆద్మీ పార్టీ అభిమానులు లెక్కింపును ఉదయం నుంచే వీక్షిస్తున్నారు. ఢిల్లీలో త్వరలో భాజపా జెండా ఎగరనుందని పార్టీ శ్రేణులు ఆశిస్తున్నారు.
W.G: జిల్లా వ్యాప్తంగా మొదటి విడుత ఇంటర్ ప్రయోగ పరీక్షలు ప్రశాంతంగా ముగిసినట్లు జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి శ్రీధర్ సుమన్ తెలిపారు. ఫిబ్రవరి 3 నుంచి జిల్లా వ్యాప్తంగా ప్రారంభమైన ప్రయోగ పరీక్షలు ఐదు రోజులు నిర్వహించారన్నారు. ప్రతిరోజు ఉ.9 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు రెండు వేళల్లో పరీక్షలు నిర్వహించినట్లు పేర్కొన్నారు.
SRKL: సోంపేట మండలం బేసి రామచంద్రపురం గ్రామ సమీప జాతీయ రహదారిపై శనివారం ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం.. బీహార్ నుంచి శ్రీకాకుళం వస్తున్న ఓ లారి అదుపుతప్పి బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో డ్రైవర్కు స్వల్ప గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న నేషనల్ హైవే అంబులెన్స్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు.