MBNR: రాజీవ్ యువ వికాసం పథకానికి దరఖాస్తు గడువును ఈ నెల 14వ తేదీ వరకు పెంచినట్టు కలెక్టర్ విజయేంద్ర బోయి వెల్లడించారు. గురువారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో బ్యాంకర్లతో సమావేశం నిర్వహించారు. గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారికి వార్షికాదాయం 1.5 లక్షలకు మించరాదని, పట్టణ ప్రాంతాల వారికి రెండు లక్షలకు మించరాదని తెలిపారు.
KMR: జిల్లాలో సన్న బియ్యం పంపిణీ ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 47 శాతం మంది లబ్ధిదారులకు సన్న బియ్యం పంపిణీ పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తెలిపారు. రామారెడ్డిలో గురువారం సన్నం బియ్యం పంపిణీ ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. సన్నం బియ్యం నాణ్యత, తూకంలో ఎలాంటి లోటు పాట్లు లేకుండా చూస్తామని తెలిపారు.
KMR: కామారెడ్డి జిల్లా కేంద్రంలో రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర 3వ వార్డులో DCC అధ్యక్షులు కైలస్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించారు. అనంతరం KMR మండల కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో KMR మండలం షాబ్దీపూర్, క్యాసంపల్లి గ్రామాల్లో జై బాపు, జై భీమ్ జై సంవిధాన్ అభియాన్ కార్యక్రమాన్ని ఇంటింటికి తిరుగుతూ ప్రజలకు వివరిస్తూ పాదయాత్ర నిర్వహించారు.
థాయ్లాండ్ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ.. ఇటీవల భూకంపంలో మృతి చెందిన వారికి భారత్ తరఫున సంతాపాన్ని ప్రకటించారు. భారత్, థాయ్లాండ్ మధ్య శతాబ్దాల అనుబంధం ఉందని వెల్లడించారు. ఈ సందర్భంగా రామాయణ కుడ్య చిత్రాల ఆధారంగా స్టాంప్ను విడుదల చేయడంపై థాయ్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఆ దేశ ప్రధాని పేటోంగ్ టార్న్ షినవత్రాతో పలు అంశాలపై చర్చించారు.
TPT: చిన్నగొట్టిగల్లు మండల కేంద్రంలోని వ్యవసాయ శాఖ కార్యాలయంలో రైతులకు సబ్సిడీ పనిముట్ల పంపిణీ కార్యక్రమం గురువారం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే పులివర్తి నాని ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన రైతులకు వ్యవసాయ పనిముట్లు పంపిణీ చేశారు. 8.48 లక్షల రూపాయల సబ్సిడీ పనిముట్లను రైతులకు పంపిణీ చేసినట్లు ఆయన తెలిపారు.
TG: రాష్ట్రంలో EAPCET-2025 దరఖాస్తు గడువు రేపటితో ముగియనుంది. అర్హత గల అభ్యర్థులకు ఈ ఎంట్రెన్స్ ఎగ్జామ్ ద్వారా ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించనున్నారు. వచ్చే నెల 2 నుంచి 5 వరకు ఇంజినీరింగ్ పరీక్ష, ఈ నెల 29, 30 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మా పరీక్షలు నిర్వహించనున్నారు. పూర్తి వివరాలకు వెబ్సైట్ను సందర్శించండి.
AP: YS వివేకా హత్య కేసుపై PCC అధ్యక్షురాలు షర్మిల కీలక వ్యాఖ్యలు చేశారు. గత ఎన్నికల తర్వాత సునీతారెడ్డి తనను కలిశారని గుర్తు చేశారు. ఒక వైపు తన అన్న ఉన్నా.. సునీతకు మద్దతు ఇస్తూనే వచ్చానని తెలిపారు. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ను అవినాష్ రెడ్డి తన ఇంటికి పిలిపించుకున్నారని అన్నారు. ఆ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్తో బలవంతంగా సంతకం చేయించారనే విషయం తనకు తెలిసిందని ఆరోపించారు.
ELR: దుగ్గిరాల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గురువారం దెందులూరు నియోజకవర్గం పరిధిలోని అధికారులతో ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ సమావేశమయ్యారు. ఆయన మాట్లాడుతూ.. పేద ఎస్సీ ఎస్టీలకు రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా 200 యూనిట్ల విద్యుత్ అందించే దిశగా ముందుకు వెళుతుందన్నారు. నియోజకవర్గంలోని 14 వేల ఎస్సీ ఎస్టీ కుటుంబాలకు సోలార్ విద్యుత్ అందించే విధంగా ప్రయత్నిస్తున్నామన్నారు.
CTR: నాగలాపురానికి చెందిన విలేకరి రాహుల్ గురువారం రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. నాగలాపురం నుంచి స్వగ్రామం సురుటుపల్లికి బైక్పై వెళుతుండగా బయటకొడియంబేడు వే బ్రిడ్జ్ వద్ద బైక్ అదుపు తప్పి ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో రాహుల్కు తలపై, కుడి భుజం ఎముకకు తీవ్ర గాయాలు, ముఖం చేతులకు స్వల్ప గాయాలు అయ్యాయి. చికిత్స కోసం తిరుపతి రుయాకు తరలించారు.
TPT: తిరుపతి నగరంలో అత్యంత వైభవంగా జరగనున్న తాతయ్య గుంట గంగమ్మ జాతరలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను కమిషనర్ మౌర్య ఆదేశించారు. గురువారం ఆమె కార్యాలయంలో అధికారులతో సమావేశమయ్యారు. అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేసి జాతరను విజయవంతం చేయాలని సూచించారు.
KMR: రాజంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గురువారం అమ్మబడి కార్యక్రమం నిర్వహించినట్లు మండల వైద్యాధికారి డాక్టర్ విజయ మహాలక్ష్మి తెలిపారు. ఆమె మాట్లాడుతూ.. గర్భిణులకు వైద్య, రక్త పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేసినట్లు చెప్పారు. రక్తహీనత లేకుండా గర్భిణులు జాగ్రత్త పడాలన్నారు. పౌష్టికారం తీసుకోవాలని గర్భిణులకు సూచించారు.
MBNR: అక్టోబర్ 30న కేంద్రంలోని ఒకటవ పట్టణ పోలీస్ స్టేషన్ ఎదుట నిరసన కార్యక్రమానికి దిగిన కేసులో 18 మంది బీఆర్ఎస్ పార్టీ నాయకులకు గురువారం రెండవ పట్టణ పోలీస్ స్టేషన్లో బెయిల్ లభించింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా అప్పట్లో కేసు నమోదు చేయడం జరిగిందని, తాము ఆ రోజున న్యాయమైన పోరాటమే చేశామని తెలిపారు.
MBNR: రెడ్ క్రాస్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రెడ్ క్రాస్ డయాగ్నస్టిక్ సెంటర్ కోసం భూమి కేటాయించాలని ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మని గురువారం కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహబూబ్ నగర్ రెడ్ క్రాస్ సంస్థ ఎటువంటి లాభాపేక్ష లేకుండా ఆపత్కాలంలో సేవలు అందిస్తుందన్నారు.
KMR: ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ యువతకు రాజీవ్ యువ వికాసం పథకాన్ని నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ పల్వంచ వర్కింగ్ ప్రెసిడెంట్ మజహార్ షరీఫ్ గురువారం సూచించారు. ఏప్రిల్ 14 వరకు రాష్ట్రంలోని యువత ఈ పథకానికి దరఖాస్తు చేసుకొని ఉపాధి పొందాలన్నారు.
TPT: ప్రముఖ ప్రైవేట్ కంపెనీ DMW – CSR నిధుల కింద అందించిన 3 లక్షల రూపాయులతో 10 కంప్యూటర్ లను SKR ప్రభుత్వ జూనియర్ కాలేజ్ యాజమాన్యంకు గూడూరు ఎమ్మెల్యే పీ.సునీల్ కుమార్ అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రభుత్వ కళాశాల అభివృద్ధికి తనవంతు కృషి చేయడం జరుగుతుందని ఇందులో భాగంగా ప్రైవేట్ భాగస్వామ్యంలో భాగంగా ఈ కంప్యూటర్లను అందించామన్నారు.