MLG: ములుగు జిల్లాలోని ప్రజలకు అనునిత్యం అందుబాటులో ఉంటామని BRS పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మణ్ బాబు అన్నారు. గోవిందరావుపేట (M) పస్రా గ్రామంలో ఇటీవల మరణించిన వారి కుటుంబ సభ్యులను స్థానిక నేతలతో కలిసి జిల్లా అధ్యక్షులు పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ప్రజల కష్టసుఖాల్లో పాలుపంచుకుంటూ ప్రజలకు అందుబాటులో ఉంటామన్నారు.
NZB: భీంగల్ ఎంపీపీఎస్ పాఠశాలను శుక్రవారం MEO స్వామి సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలలో నిర్వహిస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) AXL కంప్యూటర్ తరగతులను ఆయన పరిశీలించారు. విద్యార్థుల ప్రతిభ, శిక్షణ గురించి ప్రధానోపాధ్యాయుడు సత్య రమేష్ను అడిగి తెలుసుకున్నారు. సాంకేతిక విద్యపై విద్యార్థులు ఆసక్తి చూపడం పట్ల ఎంఈవో హర్షం వ్యక్తం చేశారు.
KDP: పులివెందులలోని స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డ్ ఆవరణంలో ఉన్న చీనీకాయల మార్కెట్ వెలవెలబోతోంది. సాధారణంగా వేసవికాలంలో చీనీ కాయలకు విపరీతమైన డిమాండ్ ఉంటుంది. చీని ధరలు తగ్గడంతో కాయలను రైతులు మార్కెట్కు తీసుకురావడంలేదని పలువురు ఆరోపించారు. ప్రస్తుతం టన్ను చీనీ కాయల ధర రూ.14 వేలు ఉండడంతో రైతులు ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నారు.
KRNL: దేవనకొండ సంత మార్కెట్లో నిర్మిస్తున్న ఆరోగ్య కేంద్రం పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించే లక్ష్యంతో (PM-ABHIM) పథకం కింద రూ.42 లక్షలు మంజూరు చేయడంతో ఈ నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈ ఆరోగ్య కేంద్రం పూర్తైతే దేవనకొండ ప్రాంత ప్రజలకు ప్రాథమిక వైద్య సేవలు మరింత సులభంగా అందుబాటులోకి రానున్నాయని అధికారులు తెలిపారు.
ప్రకాశం: వైద్య ఖర్చులతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) ద్వారా ఆర్థిక సహాయం అందించడం గొప్ప ఉపశమనమని యర్రగొండపాలెం టీడీపీ ఇంచార్జ్ ఎరిక్షన్ బాబు తెలిపారు. స్థానిక టీడీపీ కార్యాలయంలో ఆయన చేతుల మీదుగా 18 మంది లబ్ధిదారులకు మొత్తం రూ.11,90,333 విలువైన చెక్కులను పంపిణీ చేశారు.
CTR: పెనుమూరు మండలం మాజీ ఎంపీపీ, మర్టంపల్లి గ్రామానికి చెందిన వీరప్పల్లి హరిబాబు నాయుడు కుటుంబీకులను పలమనేరు ఎమ్మెల్యే అమరనాథ రెడ్డి దంపతులు శుక్రవారం పరామర్శించారు. హరిబాబు నాయుడు సతీమణి గీతా ఈ నెల 17న అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందింది. దీంతో ఆమె మృతి పట్ల ఎమ్మెల్యే తన సతీమణి రేణుకా రెడ్డితో కలిసి తమ సంతాపాన్ని తెలియజేశారు.
రక్తహీనత తగ్గడానికి ఐరన్ సప్లిమెంట్ మాత్రలను పరగడుపున వేసుకుంటే శరీరం బాగా గ్రహిస్తుంది. వికారం అనిపిస్తే ఏదైనా తిన్నాక వేసుకోవచ్చు. వీటిని నారింజ రసం వంటి విటమిన్-సి పండ్లతో తీసుకుంటే మరింత మంచిది. అయితే క్యాల్షియం మాత్రలతో లేదా పాలతో మాత్రం తీసుకోకూడదు. ఇవి ఐరన్ను శరీరం సరిగా గ్రహించుకోకుండా చేస్తాయి.
PPM: జియ్యమ్మ వలస మండలంలోని కుందర తిరువాడ పంచాయతీలో నిర్వహించిన ‘రైతన్న-మీ కోసం’ కార్యక్రమంలో ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా 9,233 మంది రైతులకు అన్నదాత సుఖీభవ కింద రూ.3.69 కోట్లు, 8,356 మంది రైతులకు పీఎం కిసాన్ కింద రూ.1.67 కోట్లు అందించినట్లు తెలిపారు. మొత్తం రూ.5.36 కోట్లు రైతుల ఖాతాల్లో జమయ్యాయని ఎమ్మెల్యే వెల్లడించారు.
VKB: ధారూర్ మండలంలోని అల్లాపూర్, రుద్రారం, నాగసమందర్ అటవీ ప్రాంతాల్లో ఇసుక అక్రమ రవాణా కొనసాగుతున్నది. రహస్య మార్గాలు ఏర్పాటు చేసి వాగులను గుల్లగా తరలిస్తూ ప్రభుత్వ వనరులను దోచుతున్నారని స్థానికులు తెలిపారు. రుద్రారం, అల్లాపూర్, గట్టేపల్లి, తిమ్మనగర్ గ్రామాలకు చెందిన కొంతమంది వ్యక్తులు ఈ అక్రమ కార్యకలాపాల్లో పాలుపంచుకుంటున్నట్లు సమాచారం.
HYD మహానగర వాసులు నెట్ జీరో భవనాల వైపు మళ్లుతున్నారు. చుట్టుపక్కల గ్రీనరీ పెంపుతో పాటు, పర్యావరణహిత నిర్మాణాలపై దృష్టి సారిస్తున్నారు. భూతాపం పెరుగుదలను 1.5 డిగ్రీల వరకు పరిమితం చేయాలంటే నిర్మాణ రంగంలో మార్పులు అనివార్యమని నిపుణులు సూచిస్తున్నారు. ఇది భవిష్యత్ తరాలకు స్థిరమైన జీవన విధానానికి దారి చూపుతుంది.
E.G: ప్రజల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తున్నట్లు రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి స్పష్టం చేశారు. శుక్రవారం రాజమండ్రి రూరల్ టీడీపీ కార్యాలయం వద్ద ఎమ్మెల్యే ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రజల నుంచి పలు సమస్యలపై ఫిర్యాదులు స్వీకరించి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు.
E.G: పద్మశ్రీ మందకృష్ణ మాదిగ శనివారం రాజమండ్రికి రానున్నారని MRPS నిడదవోలు ఇన్ఛార్జ్ గాలింకి రాము మాదిగ శుక్రవారం తెలిపారు. మధ్యాహ్నం 2 గంటలకు R&B గెస్ట్ హౌస్కు చేరుకుని, డాక్టర్ దూలపల్లి సుబ్బారావు మాదిగ సంతాప సభలో పాల్గొంటారన్నారు. ఉమ్మడి జిల్లాల MRPS, మహాజన సోషలిస్ట్ పార్టీ నాయకులు, అనుబంధ సంఘాలు పెద్ద ఎత్తున తరలిరావాలని ఆయన పిలుపునిచ్చారు.
NZB: జిల్లా కాంగ్రెస్ కార్యదర్శిగా మెండోరా మండలం బుస్సాపూర్ గ్రామానికి చెందిన శ్రీనివాస్ నియమితులయ్యారు. తనపై నమ్మకంతో ఈ బాధ్యత అప్పగించినందుకు ఆయన శుక్రవారం కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ కార్యాలయం వద్ద నాయకులు ఆయనకు శాలువా కప్పి ఘనంగా సన్మానించారు.
వనపర్తి జిల్లా కాంగ్రెస్ స్పోక్ పర్సన్గా నియమితులైన కోళ్ల వెంకటేష్కు కాంగ్రెస్ సీనియర్ నేత నందిమల్ల చంద్రమౌళి తదితరులు శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు. స్పోక్ పర్సన్గా వెంకటేష్ నియామకంపై హర్ష వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఉన్నత పదవులు పొందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో గోకం బాలరాజు, భాస్కర్, వలి, ఆంజనేయులు, శ్రీకాంత్ పాల్గొన్నారు.