SS: సోమందేపల్లి మండలం పోలేపల్లిలో వివాహిత లలిత(36)పై 10 మంది హత్యాయత్నం చేశారని బాధిత మహిళ ఫిర్యాదు మేరకు పది మందిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై రమేశ్ బాబు తెలిపారు. 10 మందిపై 307 సెక్షన్ కింద పెట్టామని, మహిళల పట్ల ఎవరైన అసభ్యంగా ప్రవర్తిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై తెలిపారు.
NZB: హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో CDMA శ్రీదేవి చేతుల మీదుగా ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్ రాజు ప్రశంసా పత్రం అందుకున్నారు. కమిషనర్ రాజు మాట్లాడుతూ.. 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఆస్తి పన్ను వసూళ్లలో ఉత్తమ ప్రతిభ కనబరిచినందుకు ఈ ప్రశంసా పత్రం అందజేశారని తెలిపారు.
JGL: గొల్లపల్లి మండలం చిలువకోడూరు ఉన్నత పాఠశాలలో గురువారం ఉమ్మడి కరీంనగర్ జిల్లా రీజనల్ నార్కోటిక్ కంట్రోల్ సెల్ డీఎస్పీ ఉపేందర్ ఆధ్వర్యంలో విద్యార్థులందరికీ మత్తు పదార్థాల నియంత్రణ అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి జిల్లా విద్యాశాఖ అధికారి కె.రాము హాజరయ్యారు.
KMR: RTC డిపో మేనేజర్ కరుణ శ్రీ గురువారం జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ను మర్యాదపూర్వకంగా కలిశారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన డీఎంను కలెక్టర్ అభినందించారు. జిల్లా ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు అందించేందుకు ఆర్టీసీ కృషి చేయాలని ఆయన సూచించారు. డీఎం మాట్లాడుతూ.. జిల్లాలో ఆర్టీసీ సేవలను మరింత మెరుగుపరిచేందుకు తమవంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
NLR: కందుకూరులోని జనార్ధన్ కాలనీలో ఉర్దూ స్కూల్ వద్ద రూ.35 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్లను ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరావు గురువారం ప్రారంభించారు. దాంతోపాటు పుట్ట ఏరియాలో రూ.14 లక్షలతో నిర్మించనున్న మురుగు కాలువల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఆయనతోపాటు మాజీ మున్సిపల్ వైస్ ఛైర్మన్ ఉప్పుటూరి శ్రీనివాసరావు, TDPముస్లిం మైనార్టీ పాల్గొన్నారు.
NLR: సోమశిల ప్రాజెక్టు ఆప్రాన్ నిర్మాణ పనులను వెంటనే పూర్తి చేయాలని బీజేపీ నమామి గంగే రాష్ట్ర కన్వీనర్ మిడతల రమేష్ డిమాండ్ చేశారు. ఆయన గురువారం సోమశిల ప్రాజెక్టు ఎస్ఈని కలిసి వినతి పత్రం సమర్పించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమశిల డ్యామ్ను సందర్శించి జూలై చివరి లోపల ఆప్రాన్ నిర్మాణ పనులు పూర్తి చేయాలని ఆదేశించిన పూర్తి కాలేదన్నారు.
TPT: చంద్రగిరి మండల పరిధిలోని పుల్లయ్యగారి పల్లిలో గురువారం నడివీధి గంగమ్మ జాతర ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ఎమ్మెల్యే పులివర్తి నాని తనయుడు పులివర్తి వినీల్ హజరయ్యారు. ఈ సందర్భంగా వినీల్కు గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం తీర్థ ప్రసాదాలు అందజేశారు.
JGL: గర్భస్థ శిశు లింగ నిర్ధారణ చట్టరిత్య నేరమని మాత శిశు సంరక్షణ జిల్లా అధికారి ముస్కు జైపాల్ రెడ్డి అన్నారు. స్పెషల్ డ్రైవ్లో భాగంగా పట్టణంలోని స్కానింగ్ సెంటర్లను గురువారం తనిఖీ చేశారు. ఈ మేరకు స్కానింగ్ సెంటర్లలోని స్కానింగ్ మిషన్లను, డాక్టర్ల అర్హత ధ్రువీకరణ పత్రాలను పరిశీలించారు.
NRPT: ప్రభుత్వ నిబంధనల మేరకు వరి ధాన్యం కొనుగోలు చేయాలని కలెక్టర్ శిక్త పట్నాయక్ అన్నారు. గురువారం నారాయణపేట నైపుణ్య అభివృద్ధి కేంద్రంలో వరి కొనుగోళ్ల పై ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో పాల్గొన్నారు. సన్న రకం, దొడ్డు రకం వరి ధాన్యాన్ని వేరువేరుగా కొనుగోలు చేయాలని చెప్పారు. ధాన్యం విక్రయించిన రైతుల వివరాలు పక్కగా నమోదు చేసుకోవాలని సూచించారు.
MBNR: రాజీవ్ యువ వికాసం పథకానికి దరఖాస్తు గడువును ఈ నెల 14వ తేదీ వరకు పెంచినట్టు కలెక్టర్ విజయేంద్ర బోయి వెల్లడించారు. గురువారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో బ్యాంకర్లతో సమావేశం నిర్వహించారు. గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారికి వార్షికాదాయం 1.5 లక్షలకు మించరాదని, పట్టణ ప్రాంతాల వారికి రెండు లక్షలకు మించరాదని తెలిపారు.
KMR: జిల్లాలో సన్న బియ్యం పంపిణీ ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 47 శాతం మంది లబ్ధిదారులకు సన్న బియ్యం పంపిణీ పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తెలిపారు. రామారెడ్డిలో గురువారం సన్నం బియ్యం పంపిణీ ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. సన్నం బియ్యం నాణ్యత, తూకంలో ఎలాంటి లోటు పాట్లు లేకుండా చూస్తామని తెలిపారు.
KMR: కామారెడ్డి జిల్లా కేంద్రంలో రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర 3వ వార్డులో DCC అధ్యక్షులు కైలస్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించారు. అనంతరం KMR మండల కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో KMR మండలం షాబ్దీపూర్, క్యాసంపల్లి గ్రామాల్లో జై బాపు, జై భీమ్ జై సంవిధాన్ అభియాన్ కార్యక్రమాన్ని ఇంటింటికి తిరుగుతూ ప్రజలకు వివరిస్తూ పాదయాత్ర నిర్వహించారు.
థాయ్లాండ్ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ.. ఇటీవల భూకంపంలో మృతి చెందిన వారికి భారత్ తరఫున సంతాపాన్ని ప్రకటించారు. భారత్, థాయ్లాండ్ మధ్య శతాబ్దాల అనుబంధం ఉందని వెల్లడించారు. ఈ సందర్భంగా రామాయణ కుడ్య చిత్రాల ఆధారంగా స్టాంప్ను విడుదల చేయడంపై థాయ్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఆ దేశ ప్రధాని పేటోంగ్ టార్న్ షినవత్రాతో పలు అంశాలపై చర్చించారు.
TPT: చిన్నగొట్టిగల్లు మండల కేంద్రంలోని వ్యవసాయ శాఖ కార్యాలయంలో రైతులకు సబ్సిడీ పనిముట్ల పంపిణీ కార్యక్రమం గురువారం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే పులివర్తి నాని ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన రైతులకు వ్యవసాయ పనిముట్లు పంపిణీ చేశారు. 8.48 లక్షల రూపాయల సబ్సిడీ పనిముట్లను రైతులకు పంపిణీ చేసినట్లు ఆయన తెలిపారు.