VZM: కొత్తవలస పట్టణ పరిధిలో ఉన్న ఒక పాఠశాలలో 7, 8, 9వ తరగతి చదువుతున్న విద్యార్థులకు చెడు వ్యసనాల, వాటి అనర్ధాలపై పట్టణ సీఐ ఎస్. షణ్ముఖరావు విద్యార్థులకు గురువారం అవగాహన కల్పించారు. ప్రస్తుత పోటీతత్వంలో విద్యార్థులు కష్టపడి బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోని, పాఠశాలకు, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని హితవు పలికారు.
NZB: జిల్లా జనసేన పార్టీ ఇంఛార్జ్ గుండా సంతోష్ ఆధ్వర్యంలో గురువారం పోలీస్ కమిషనర్ సాయి చైతన్యను ఆయన ఛాంబర్లో జనసేన నాయకులు కలిశారు. ఈ సందర్భంగా గుండా సంతోష్ పలు అంశాలపై సీపీతో చర్చించారు. అనంతరం పార్టీ ఇంఛార్జ్ మాట్లాడుతూ.. జనసేన పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని అన్నారు. సీపీను కలిసిన వారిలో పార్టీ కార్యదర్శి మహేశ్, ఉపాధ్యక్షుడు శ్రీను ఉన్నారు.
TPT: చంద్రగిరి నియోజకవర్గ పరిధిలోని చిన్నగొట్టిగల్లు, ఎర్రవారిపాలెం, చంద్రగిరి మండలాలకు చెందిన 64 మంది రైతులు ఏనుగుల దాడుల్లో పంటలు నష్టపోయారు. వారికి పరిహారంగా 10.24 లక్షల రూపాయల నష్ట పరిహారాన్ని గురువారం ఎమ్మెల్యే పులివర్తి నాని అందించారు. ఈ సందర్భంగా రైతులు ఆయనకు ధన్యవాదాలు తెలిపారు.
CTR: ప్లాస్టిక్ కవర్ల నియంత్రణకు ప్రజల భాగస్వామ్యం అవసరమని పుంగనూరు మున్సిపల్ కమిషనర్ మధుసూదన్ రెడ్డి పిలుపునిచ్చారు. గురువారం పట్టణంలో ఎన్విరాన్మెంట్ ఇంజినీర్ కృష్ణవేణి ఆధ్వర్యంలో మున్సిపల్ సిబ్బంది పలు దుకాణాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్లాస్టిక్ కవర్లను సీజ్ చేసి వాటి వల్ల కలిగే అనర్థాల గురించి ప్రజలు, వ్యాపారులకు అవగాహన కల్పించారు.
NZB: సదాశివనగర్ మండల కేంద్రంలో బుద్ధుడు, మహాత్మా జ్యోతిరావు ఫూలే, సవిత్రీ బాయి ఫూలే దంపతులు, డాక్టర్ బీ.ఆర్. అంబేద్కర్ & రమాబాయి దంపతుల మహనీయుల విగ్రహాలను ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సమాజంలో సమానత్వం, విద్య, హక్కుల సాధన కోసం ఈ మహనీయుల జీవితాలు మార్గదర్శకంగా నిలుస్తాయని పేర్కొన్నారు.
SS: సోమందేపల్లి మండలం పోలేపల్లిలో వివాహిత లలిత(36)పై 10 మంది హత్యాయత్నం చేశారని బాధిత మహిళ ఫిర్యాదు మేరకు పది మందిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై రమేశ్ బాబు తెలిపారు. 10 మందిపై 307 సెక్షన్ కింద పెట్టామని, మహిళల పట్ల ఎవరైన అసభ్యంగా ప్రవర్తిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై తెలిపారు.
NZB: హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో CDMA శ్రీదేవి చేతుల మీదుగా ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్ రాజు ప్రశంసా పత్రం అందుకున్నారు. కమిషనర్ రాజు మాట్లాడుతూ.. 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఆస్తి పన్ను వసూళ్లలో ఉత్తమ ప్రతిభ కనబరిచినందుకు ఈ ప్రశంసా పత్రం అందజేశారని తెలిపారు.
JGL: గొల్లపల్లి మండలం చిలువకోడూరు ఉన్నత పాఠశాలలో గురువారం ఉమ్మడి కరీంనగర్ జిల్లా రీజనల్ నార్కోటిక్ కంట్రోల్ సెల్ డీఎస్పీ ఉపేందర్ ఆధ్వర్యంలో విద్యార్థులందరికీ మత్తు పదార్థాల నియంత్రణ అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి జిల్లా విద్యాశాఖ అధికారి కె.రాము హాజరయ్యారు.
KMR: RTC డిపో మేనేజర్ కరుణ శ్రీ గురువారం జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ను మర్యాదపూర్వకంగా కలిశారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన డీఎంను కలెక్టర్ అభినందించారు. జిల్లా ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు అందించేందుకు ఆర్టీసీ కృషి చేయాలని ఆయన సూచించారు. డీఎం మాట్లాడుతూ.. జిల్లాలో ఆర్టీసీ సేవలను మరింత మెరుగుపరిచేందుకు తమవంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
NLR: కందుకూరులోని జనార్ధన్ కాలనీలో ఉర్దూ స్కూల్ వద్ద రూ.35 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్లను ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరావు గురువారం ప్రారంభించారు. దాంతోపాటు పుట్ట ఏరియాలో రూ.14 లక్షలతో నిర్మించనున్న మురుగు కాలువల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఆయనతోపాటు మాజీ మున్సిపల్ వైస్ ఛైర్మన్ ఉప్పుటూరి శ్రీనివాసరావు, TDPముస్లిం మైనార్టీ పాల్గొన్నారు.
NLR: సోమశిల ప్రాజెక్టు ఆప్రాన్ నిర్మాణ పనులను వెంటనే పూర్తి చేయాలని బీజేపీ నమామి గంగే రాష్ట్ర కన్వీనర్ మిడతల రమేష్ డిమాండ్ చేశారు. ఆయన గురువారం సోమశిల ప్రాజెక్టు ఎస్ఈని కలిసి వినతి పత్రం సమర్పించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమశిల డ్యామ్ను సందర్శించి జూలై చివరి లోపల ఆప్రాన్ నిర్మాణ పనులు పూర్తి చేయాలని ఆదేశించిన పూర్తి కాలేదన్నారు.
TPT: చంద్రగిరి మండల పరిధిలోని పుల్లయ్యగారి పల్లిలో గురువారం నడివీధి గంగమ్మ జాతర ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ఎమ్మెల్యే పులివర్తి నాని తనయుడు పులివర్తి వినీల్ హజరయ్యారు. ఈ సందర్భంగా వినీల్కు గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం తీర్థ ప్రసాదాలు అందజేశారు.
JGL: గర్భస్థ శిశు లింగ నిర్ధారణ చట్టరిత్య నేరమని మాత శిశు సంరక్షణ జిల్లా అధికారి ముస్కు జైపాల్ రెడ్డి అన్నారు. స్పెషల్ డ్రైవ్లో భాగంగా పట్టణంలోని స్కానింగ్ సెంటర్లను గురువారం తనిఖీ చేశారు. ఈ మేరకు స్కానింగ్ సెంటర్లలోని స్కానింగ్ మిషన్లను, డాక్టర్ల అర్హత ధ్రువీకరణ పత్రాలను పరిశీలించారు.
NRPT: ప్రభుత్వ నిబంధనల మేరకు వరి ధాన్యం కొనుగోలు చేయాలని కలెక్టర్ శిక్త పట్నాయక్ అన్నారు. గురువారం నారాయణపేట నైపుణ్య అభివృద్ధి కేంద్రంలో వరి కొనుగోళ్ల పై ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో పాల్గొన్నారు. సన్న రకం, దొడ్డు రకం వరి ధాన్యాన్ని వేరువేరుగా కొనుగోలు చేయాలని చెప్పారు. ధాన్యం విక్రయించిన రైతుల వివరాలు పక్కగా నమోదు చేసుకోవాలని సూచించారు.