• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

క్రికెట్ పోటీలను ప్రారంభించిన ఎస్సై

TPT: చిల్లకూరు మండలం కలవకొండలో మండల సీనియర్ క్రికెట్ టోర్నమెంట్ 16వ వార్షికోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎస్సై సురేష్ బాబు చేతుల మీదుగా క్రీడా జెండాను ఎగరవేసి, క్రీడాకారులను పరిచయం చేసుకుని, క్రికెట్ టోర్నమెంట్‌ను ప్రారంభించారు.

February 8, 2025 / 04:54 PM IST

ప్రమాదంలో గాయపడిన యువకుడు మృతి

అన్నమయ్య: రోడ్డు ప్రమాదంలో గాయపడిన యువకుడు వేలూరు ఆసుపత్రిలో శనివారం మృతి చెందాడు. రామసముద్రంలోని కర్నాల వీధికి చెందిన వేణు (25) వారం రోజుల క్రితం తమిళనాడులోని వేలూరులో బైక్‌పై వెళుతుండగా కారు ఢీకొంది. తీవ్రంగా గాయపడిన వేణును స్థానిక వేలూరు ఆసుపత్రిలో చేర్పించారు. వారం రోజులు మృత్యువతో పోరాడి మృతి చెందాడని కుటుంబ సభ్యులు తెలిపారు.

February 8, 2025 / 04:24 PM IST

సీతారాముల విగ్రహ ప్రతిష్ట మహోత్సవంలో మాజీ ఎమ్మెల్యే

AKP: నర్సీపట్నం మున్సిపాలిటీ 14వ వార్డు సుబ్బారాయుడుపాలెంలో శనివారం శ్రీసీతారాముల విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచి గోపూజ, పునఃపూజలు నిర్వహించారు. మధ్యాహ్నం అన్నసమారాధన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ ప్రతిష్ఠ మహోత్సవానికి నర్సీపట్నం మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేశ్ హాజరై సీతారాములు దర్శించుకున్నారు.

February 8, 2025 / 04:18 PM IST

ఆకట్టుకుంటున్న నాతవరం మోడల్ పోలీస్ స్టేషన్

AKP: నాతవరంలో నూతనంగా నిర్మించిన మోడల్ పోలీస్ స్టేషన్ ఆకట్టుకుంటుంది. రూ.2.6 కోట్లతో దీని నిర్మాణం చేపట్టారు. విశాలమైన గదులతో ఆధునికంగా, ఆకర్షణీయంగా ఈ పోలీస్ స్టేషన్ భవనం నిర్మాణం పూర్తి చేసుకొని త్వరలో ప్రారంభానికి సిద్దంగా ఉంది.

February 8, 2025 / 04:17 PM IST

గిరిజన చట్టాల జోలికి వస్తే ఊరుకునేది లేదు

ASR: ప్రభుత్వం ఏదైనా గిరిజన చట్టాల జోలికి వస్తే ఊరుకునేది లేదని, యుద్ధం తప్పదని ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా గౌరవాధ్యక్షులు బోనంగి చిన్నయ్య పడాల్ పేర్కొన్నారు. శనివారం కొయ్యూరు మండలంలోని డౌనూరు గ్రామంలో ఆయన పర్యటించారు. 1/70 చట్టంపై స్పీకర్ అయ్యన్న వ్యాఖ్యలను ఖండిస్తూ ఈనెల 11,12వ తేదీల్లో చేపడుతున్న మన్యం బంద్‌ను విజయవంతం చేయాలని ప్రజలను కోరారు.

February 8, 2025 / 04:14 PM IST

అర్జీలు స్వీకరించిన భూపేశ్ రెడ్డి

KDP: జమ్మలమడుగు టీడీపీ కార్యాలయంలో గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చదిపిరాళ్ల భూపేశ్ సుబ్బరామిరెడ్డి పాల్గొన్నారు. ప్రజలు, కార్యకర్తల నుంచి వచ్చిన అర్జీలను స్వీకరించి సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యలను పరిష్కరించడానికి కృషి చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

February 8, 2025 / 04:06 PM IST

కష్టపడి పనిచేసే ప్రతీ ఒక్కరికీ గుర్తింపు: ఎమ్మెల్యే

ASR: పార్టీ కోసం కష్టపడి పనిచేసే ప్రతీ ఒక్కరికీ పార్టీ గుర్తింపునిస్తుందని అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం పేర్కొన్నారు. శనివారం హుకుంపేట మండలంలోని కొంతిలి గ్రామంలో నియోజకవర్గ పరిధిలోని ఆరు మండలాలకు చెందిన వైసీపీ శ్రేణులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. నూతనంగా ఎన్నికైన వైసీపీ పార్టీ మండల అధ్యక్షులను సన్మానించారు. పార్టీ బలోపేతానికి కృషి చేయాలన్నారు.

February 8, 2025 / 03:47 PM IST

రచ్చబండ నిర్మాణంకు శంకుస్థాపన చేసిన గ్రామ పెద్దలు

ASR: గసబ పంచాయితీ మొర్రిగూడ గ్రామంలో రచ్చబండ నిర్మాణంకు గ్రామ పెద్దలు పాంగి అగడ, వంతాల మొస్య శనివారం శంకుస్ధాపన చేశారు. ఈ రచ్చబండ కు 15వ ఆర్ధిక సంఘం నిధుల నుండి రూ.2లక్షలు మంజూరు అయినట్లు వార్డ్ సభ్యులు పీ.సత్యన్నారాయణ తెలిపారు. గ్రామ సమస్యలు చర్చించు కోవడానికి, ప్రభుత్వ కార్యక్రమాలు నిర్వహించడానికి రచ్చబండ ఉపయోగంగా ఉంటుందని మాజీ సర్పంచ్ సురేష్ అన్నారు

February 8, 2025 / 03:19 PM IST

ఢిల్లీ గవర్నర్ కీలక ఆదేశాలు

ఢిల్లీ గవర్నర్ వీకే సక్సేనా కీలక ఆదేశాలు ఇచ్చారు. ఆప్ ఓటమితో ఢిల్లీ సచివాలయం సీజ్ కు గవర్నర్ ఆదేశాలు జారీ చేశారు. సచివాలయం నుంచి కీలక ఫైళ్లు బయటకు పోకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ మేరకు జేఏడీ సెక్రటరీ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేశారు.

February 8, 2025 / 02:20 PM IST

నూతన రేషన్ కార్డుల కోసం మీ సేవ వద్ద క్యూ

HYD: తెలంగాణ ప్రభుత్వం నూతన రేషన్ కార్డుల కోసం ప్రభుత్వం ప్రకటన చేసిన సందర్భంగా శనివారం ఉదయం నుంచి డాక్టర్ ఏఎస్ రావు నగర్‌లో మీ సేవల వద్ద ప్రజలు క్యూ కట్టారు. మీసేవ కేంద్రాల వద్ద నో సర్వర్ బోర్డు పెట్టారు. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారు. ప్రభుత్వం ప్రకటించిన తర్వాత నో సర్వీస్ రావడంతో ప్రజలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు.

February 8, 2025 / 02:08 PM IST

‘అమెరికాలోని భారతీయ భాదితుల పట్ల ప్రధాని మోదీ శ్రద్ధ తీసుకోవాలి’

KMM: అమెరికాలోని భారతీయ భాదితుల పట్ల ప్రధాని మోదీ శ్రద్ధ తీసుకోవాలని రాష్ట్ర గిడ్డంగుల సంస్థ ఛైర్మన్ రాయల నాగేశ్వరరావు అన్నారు. అమెరికాలో ఉన్న భారతీయులను బేడీలు వేయడానికి నిరసిస్తూ శనివారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఖమ్మంలో ట్రంప్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. కేంద్ర వైఫల్యం కారణంగానే 104  మంది భారతీయులను ట్రంప్ ప్రభుత్వం పంపివేసిందని ఆరోపించారు.

February 8, 2025 / 02:06 PM IST

కౌశిక్ రెడ్డి కారుపై 28 పెండింగ్ చలాన్లు

HYD: మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి కుమారుడు కౌశిక్ రెడ్డి కారుపై 28 పెండింగ్ చలాన్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. బంజారాహిల్స్‌లోని కేబీఆర్ పార్కు వద్ద ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఈ క్రమంలో పట్లోళ్ల కౌశిక్ రెడ్డి కారు తనిఖీ చేశారు. దీంతో 28 పెండింగ్ చలాన్లను పోలీసులు గుర్తించారు.

February 8, 2025 / 02:04 PM IST

వార్షిక బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న మంత్రి పొంగులేటి

KMM: ఖమ్మం నగరంలోని VDO’S కాలనీలో ఉన్న రామాలయంలో శనివారం నిర్వహించిన వార్షిక బ్రహ్మోత్సవాల్లో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. మంత్రి పొంగులేటికి ముందుగా ఆలయ అర్చకులు ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం మంత్రి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నగర కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

February 8, 2025 / 02:01 PM IST

గంజాయి అక్రమ రవాణాపై ప్రత్యేక దృష్టి

VSP: గంజాయి అక్రమ రవాణాపై ప్రత్యేక దృష్టి సారించినట్లు నర్సీపట్నం డీఎస్పీ పీ.శ్రీనివాసరావు అన్నారు. శనివారం నాతవరం పోలీస్ స్టేషన్ ను ఆకస్మికంగా సందర్శించారు. స్టేషన్ లోని రికార్డులను తనిఖీ చేశారు. అనంతరం మాట్లాడుతూ.. రోడ్లు ప్రమాదాల నివారణ ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ప్రజలు సైబర్ నేరాలకు గురికాకుండా అవగాహన కల్పిస్తున్నామన్నారు.

February 8, 2025 / 01:40 PM IST

ఆదివాసీ నాయకుల అత్యవసర సమావేశం

అల్లూరి జిల్లా కేంద్రంలో ఉన్న ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో శనివారం ఆదివాసీ ప్రజాసంఘాల నాయకులు అత్యవసరంగా రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ నెల 11,12 తేదీల్లో జరిగే మన్యం బంద్‌కు తగిన కార్యచరణ ఈ సమావేశంలో రూపొందించారు. ఈ బంద్‌ని అన్ని వర్గాల ప్రజలు విజయవంతం చేయలని కోరారు. ఈ సమావేశంలో పలువురు రాజకీయ పార్టీ, ప్రజా సంఘ నాయకులు పాల్గొన్నారు.

February 8, 2025 / 01:39 PM IST