• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

ఆదోనిలో మోస్తరు వర్షం

KRNL: ఆదోని పట్టణంలో గురువారం మధ్యాహ్నం వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. ఉదయం నుంచి చల్లటి గాలులు వీయగా మధ్యాహ్నం ఒక్కసారిగా మోస్తరు వర్షం కురిసింది. మూడు రోజులుగా ఎండ తాపానికి ప్రజలు ఉక్కపోతతో ఇబ్బందులు పడ్డారు. ఇవాళ కురిసిన వర్షానికి ఉపశమనం పొందారు. మరోవైపు రాబోయే మూడు రోజులు జిల్లాలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించిన విషయం తెలిసిందే.

April 3, 2025 / 02:21 PM IST

క్రికెట్ టోర్నీ ప్రారంభించిన కలెక్టర్

ASR: పాడేరు మోదకొండమ్మ జాతర మహోత్సవాల సందర్భంగా 36వ రాష్ట్ర స్థాయి మెగా క్రికెట్ టోర్నీని కలెక్టర్ దినేశ్ కుమార్, పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు ప్రారంభించారు. గురువారం పాడేరు ప్రభుత్వ జూనియర్ కళాశాల క్రీడా మైదానంలో రిబ్బన్ కట్ చేసి పోటీలు ప్రారంభించారు. రాష్ట్ర నలుమూలల నుంచి 72 జట్లు ఈ టోర్నీలో పాల్గొంటున్నాయని తెలిపారు.

April 3, 2025 / 02:15 PM IST

స్విమ్మింగ్ పూల్ ప్రారంభించిన ఎమ్మెల్యే

GNTR: నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో గుంటూరులో స్విమ్మింగ్ పూల్ అందుబాటులోకి వచ్చింది. రూ.25 లక్షల వ్యయంతో ఆధునీకరించిన ఈ స్విమ్మింగ్ పూల్‌ను గురువారం ఎమ్మెల్యే గల్లా మాధవి, మేయర్ షేక్ సజీల ప్రారంభించారు. వేసవికాలంలో ప్రజలకు ఇది ఉపయోగకరంగా ఉంటుందని, అందరూ దీనిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

April 3, 2025 / 02:15 PM IST

ఫైరింగ్ ప్రాక్టీస్‌ను పర్యవేక్షించిన ఎస్పీ

VZM: నెల్లిమర్ల మండలం సారిపల్లి వద్ద గల జిల్లా పోలీసు శిక్షణ కేంద్రంలో గురువారం జరిగిన వార్షిక ఫైరింగ్ ప్రాక్టీస్‌‌ను ఎస్పీ వకుల్ జిందాల్ పర్యవేక్షించారు. ఆయన మాట్లాడుతూ.. అత్యవసర పరిస్థితుల్లో పోలీసు అధికారులు సమయస్ఫూర్తితో వ్యవహరించి, రక్షణ చర్యలు చేపట్టడానికి ఫైరింగ్ ప్రాక్టీస్ ఎంతగానో దోహదపడుతుందన్నారు.

April 3, 2025 / 02:08 PM IST

కన్న తల్లిని హతమార్చిన కొడుకు

GNTR: ఉమ్మడి గుంటూరు జిల్లాలోని బొల్లాపల్లి మండలంలో దారుణం చోటు చేసుకుంది. మండలంలోని వెల్లటూరు గ్రామంలో కన్న తల్లిని కొడుకు కొట్టి చంపాడు. వెల్లటూరుకు చెందిన సోమమ్మ మంచం మీద పడుకుని ఉండగా కుమారుడు బాదరయ్య కొట్టి చంపాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

April 3, 2025 / 02:01 PM IST

వైసీపీ మున్సిపల్ ఉపాధ్యక్షుడిగా రంగస్వామి

ATP: గుత్తి మున్సిపాలిటీ వైసీపీ ఉపాధ్యక్షుడిగా రంగస్వామి నియమితులయ్యారు. ఈ మేరకు వైసీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామిరెడ్డి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. మున్సిపల్ ఉపాధ్యక్షుడిగా ఎంపికైన రంగస్వామి మాట్లాడుతూ.. పార్టీ బలోపేతం కోసం తనవంతు కృషి చేస్తానని తెలిపారు.

April 3, 2025 / 01:47 PM IST

తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన

ATP: రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని, కూటమి ప్రభుత్వం ఎన్నికలలో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ గుత్తి తహసీల్దార్ కార్యాలయం ఎదుట అఖిల భారత రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో గురువారం నిరసన చేపట్టారు. పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని తహసీల్దార్ ఓబులేసుకు అందజేశారు.

April 3, 2025 / 01:31 PM IST

సచివాలయాన్ని సందర్శించిన ఎంపీడీవో

VZM: జామి మండలం లొట్లపల్లి సచివాలయాన్ని ఎంపీడీవో అప్పలనాయుడు గురువారం సందర్శించారు. ముందుగా ఆయన సచివాలయంలో రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. సిబ్బంది సమయపాలన పాటిస్తూ, ప్రజలకు అందుబాటులో ఉండాలని కోరారు. ప్రస్తుతం జరుగుతున్న వర్క్ ఫ్రం హోం తదితర సర్వేలను త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు.

April 3, 2025 / 01:31 PM IST

రైల్వే అధికారి ద్విచక్ర వాహనం చోరి

ATP: గుత్తి రైల్వే స్టేషన్ మేనేజర్ ద్విచక్ర వాహనం గుర్తుతెలియని దుండగులు ఎత్తుకెళ్లారు. బుధవారం సాయంత్రం గుత్తి రైల్వే బుకింగ్ కార్యాలయం ఎదుట తన వాహనాన్ని పార్కింగ్ చేసి వెళ్లారు. రాత్రి విధులు ముగించుకుని ఇంటికి వెళ్లడానికి బుకింగ్ కార్యాలయం వద్దకు వచ్చి చూస్తే వాహనం కనబడలేదు. దీంతో ద్విచక్ర వాహనం చోరికి గురైనట్టు గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

April 3, 2025 / 01:21 PM IST

నిన్న ఒక్కరోజే నలుగురు మృతి

ప్రకాశం: జిల్లాలో నిన్న ఒక్కరోజే నలుగురు మృతి చెందారు. పొన్నలూరులోని ముత్తరాజుపాలెం వద్ద ట్రాక్టర్ బోల్తాపడటంతో ఓ వ్యక్తి మృతి చెందగా, మార్కాపురంలో ఓ వ్యక్తి మద్యం సేవించి మృతి చెందాడు. ముండ్లమూరు మండలంలోని చంద్రగిరిలో ప్రమాదవశాత్తు కాలుజారటంతో కాలువలో పడి ఓ వ్యక్తి మృతి చెందాడు. మద్దిపాడులో సీతారాంపురం గ్రామనికి చెందిన వృద్ధుడు మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నాడు.

April 3, 2025 / 11:25 AM IST

వల్లభనేని వంశీ విచారణ.. వాయిదా

AP: YCP నేత వల్లభనేని వంశీ బెయిల్‌ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. కేసు పూర్తి వివరాలు సమర్పించాలని పోలీసులకు హైకోర్టు ఆదేశించింది. అనంతరం విచారణను వారం రోజులకు వాయిదా వేసింది. దిగువ కోర్టు బెయిల్‌కు నిరాకరణతో హైకోర్టులో వంశీ పిటిషన్‌ వేసిన విషయం తెలిసిందే.

April 3, 2025 / 11:22 AM IST

HCU భూములు.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

TG: HCU భూములపై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక ఆదేశాలిచ్చింది. ఇవాళ మధ్యాహ్నం 3:30 గంటలకు నివేదిక అందించాలని తెలంగాణ హైకోర్టు రిజిస్ట్రార్‌కు చెప్పింది. ప్రభుత్వం విక్రయించాలనుకున్న భూములు సందర్శించి నివేదిక ఇవ్వాలని తెలిపింది. హైకోర్టు ఆదేశాలపై స్టే ఇవ్వటం లేదన్న సుప్రీం.. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు అక్కడ ఎలాంటి చర్యలు చేపట్టవద్దని పేర్కొంది.

April 3, 2025 / 11:12 AM IST

మద్యం, డ్రగ్స్ మత్తులోనే అఘాయిత్యాలు

NGKL: జిల్లాలో ఏదో ఒక చోట అత్యాచారం హత్యలు లాంటి ఘటనలు వెలుగుచూస్తున్నాయని స్థానికులు అంటున్నారు. ఊర్కొండ దేవాలయం సమీపంలో వివాహితపై ఏడుగురు సామూహిక అత్యాచారానికి కారణం మద్యం అని పోలీసులు నిర్ధారించారు. గ్రామాలలో విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు కొనసాగుతున్నాయి. మద్యం డ్రగ్స్ వల్లే జిల్లాలో రోజురోజుకు అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయని అభిప్రాయం వ్యక్తమవుతోంది.

April 3, 2025 / 11:10 AM IST

బార్ అసోసియేషన్ అధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి

SDR: బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా 9సారి విష్ణువర్ధన్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అంబేడ్కర్ సేవా సమితి రాష్ట్ర అధ్యక్షుడు జగన్ ఆధ్వర్యంలో విష్ణువర్ధన్ రెడ్డిని జిల్లా కోర్టు ఆవరణలో బుధవారం ఘనంగా సన్మానించారు. దళిత జర్నలిస్ట్ ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షుడు యాదగిరి, బ్యాక్వర్డ్ బీసీ సంఘాల జిల్లా అధ్యక్షుడు హనుమంతు, సురేశ్, తరుణ్ తదితరులు పాల్గొన్నారు.

April 3, 2025 / 09:24 AM IST

ఆన్‌లైన్ బెట్టింగ్.. మాజీ సీఎంపై కేసు

మహదేవ్ బెట్టింగ్ యాప్ కేసులో ఛత్తీస్‌గఢ్ మాజీ సీఎం, కాంగ్రెస్ నేత భూపేశ్ బఘేల్‌పై CBI ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. బెట్టింగ్ యాప్ కుంభకోణం లబ్దిదారుల్లో బఘేల్ ఒకరని తెలిపింది. గతంలో ఈడీ కూడా తన FIRలో ఇదే విషయాన్ని పేర్కొంది. అయితే 19 నిందితుల్లో బఘేల్‌ను ఆరో వ్యక్తిగా పేర్కొంది. కాగా, రాజకీయంగా తనను ఎదుర్కోలేకే కేసులు పెడుతున్నారని బఘేల్ విమర్శించారు.

April 3, 2025 / 08:18 AM IST