• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

‘గర్భిణీలకు పౌష్టికాహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం’

ATP: గుత్తి ప్రభుత్వ ఆసుపత్రిలో శుక్రవారం గర్భిణీలకు ఉచిత భోజన కార్యక్రమం నిర్వహించారు. గుత్తి టీడీపీ మండల ఇంచార్జ్ నారాయణ, ఆసుపత్రి సూపరిండెంట్ ఎల్లప్ప చేతుల మీదుగా గర్భిణీలకు భోజనాన్ని అందజేశారు. వారు మాట్లాడుతూ.. గర్భిణీలు పౌష్టిక ఆహారం తీసుకుంటేనే తల్లి, బిడ్డ ఆరోగ్యంగా ఉంటారని సూచించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.

February 7, 2025 / 06:39 PM IST

శివరాత్రికి ప్రసాదం కౌంటర్ల సంఖ్య పెంచండి

PLD: మహా శివరాత్రి సందర్భంగా భారీ సంఖ్యలో వచ్చే భక్తుల కోసం కోటప్ప కొండపై ప్రసాదం కౌంటర్ల సంఖ్య పెంచాలని జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు కోటప్పకొండ ఈవోను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని అంబేడ్కర్ సమావేశ మందిరంలో కోటప్పకొండ తిరునాళ్ల నిర్వహణపై సమీక్ష సమావేశం నిర్వహించారు.

February 7, 2025 / 05:26 PM IST

మాజీ ఎంపీకి చెందిన రూ.44 కోట్ల ఆస్తులు జప్తు

AP: వైసీపీ మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణకి ఈడీ షాకిచ్చింది. హయగ్రీవ ఫామ్స్‌కు చెందిన రూ.44.74 కోట్ల ఆస్తులను జప్తు చేసింది. విశాఖ హయాగ్రీవ భూముల అమ్మకాల్లో ఎంవీవీ, ఆయన ఆడిటర్ జీవీ, మేనేజింగ్ పార్టనర్ గద్దె బ్రహ్మాజీలు సూత్రధారులుగా ఉన్నట్లు తెలిపింది. ప్లాట్లు అమ్మి దాదాపు రూ.150 కోట్లు ఆర్జించినట్లు పేర్కొంది. అలాగే, వివిధ పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించింది.

February 7, 2025 / 05:23 PM IST

కేంద్ర మంత్రిని కలిసిన ఏపీ బీజేపీ యువ నాయకులు

NDL: కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖల సహాయ మంత్రి హర్ష్ మల్హోత్రాను ఢిల్లీలో డోన్ పట్టణానికి చెందిన ఏపీ బీజేపీ యువ నాయకులు కొట్టె మల్లికార్జున శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. మల్లికార్జున మాట్లాడుతూ పార్టీ ఆదేశాల మేరకు ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ మేనిఫెస్టోను ప్రజలకు వివరించామన్నారు.

February 7, 2025 / 05:18 PM IST

తాళ్లూరు మండల సర్పంచ్‌కు వైసీపీ కీలక పదవి

ప్రకాశం: YS జగన్ ఆదేశాల మేరకు శుక్రవారం విఠలాపురం సర్పంచ్ మారం ఇంద్రసేనారెడ్డిని జిల్లా వైసీపీ సెక్రటరీగా పార్టీ అదిష్టానం నియమించింది. ఈ సందర్భంగా తనకు అవకాశం ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి, జిల్లా వైసీపీ ఇంఛార్జ్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. తనకు ఇంకా పార్టీ పట్ల బాధ్యత పెరిగిందని, తన పదవికి న్యాయం చేస్తానని అన్నారు.

February 7, 2025 / 05:01 PM IST

‘భారతీయులను చేతికి సంకెళ్లు వేసి పంపడం అమానుషం’

KRNL: అమెరికాలోకి అక్రమ వలసల నివారణలో భాగంగా ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్ వలసలు వచ్చిన ప్రజలను వారి దేశాలకు పంపే విధానంలో భారతీయుల చేతికి, కాళ్లకు సంకెళ్లు వేసి యుద్ధ విమానంలో పంపడం అమానుషమని పీడీయస్‌యూ రాష్ట్ర కార్యదర్శి రాజేష్ అన్నారు. ఎమ్మిగనూరులో జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ అమెరికా భారత్‌ను మిత్రదేశంగా చెప్పుకుంటూ ఇలా చేయడం సరికాదన్నారు.

February 7, 2025 / 04:55 PM IST

నులిపురుగుల నివారణ కార్యక్రమం విజయవంతం చేయాలి

GNTR: ఈ నెల 10వ తేదీన జాతీయ నులిపురుగుల నివారణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఫిరంగిపురం ఎంపీడీవో వెంకటేశ్వరరావు అన్నారు. మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. ఈనెల 10వ తేదీ 1-19 సంవత్సరాల వయస్సు పిల్లలందరికీ ఆల్బెండజోల్‌ మాత్రలను మింగించడం జరుగుతుందని అన్నారు.

February 7, 2025 / 04:52 PM IST

అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన డీఎస్పీ

ప్రకాశం: కనిగిరిలోని సబ్-డివిజనల్ కార్యాలయంలో శుక్రవారం డీఎస్పీ యశ్వంత్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పెండింగ్లో ఉన్న కేసులు, నేరాల సంఖ్య, కేసుల దర్యాప్తు స్థితి తీసుకునే చర్యలపై అధికారులకు దిశా నిర్దేశం చేశారు. పెండింగ్‌లో ఉన్న కేసులను త్వరగా పరిష్కరించాలని డీఎస్పీ స్పష్టం చేశారు.

February 7, 2025 / 04:48 PM IST

కలెక్టర్‌తో ఎమ్మెల్యే నారాయణ రెడ్డి భేటీ

ప్రకాశం: మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి కలెక్టర్ తమిమ్ అన్సారీయను ఒంగోలులోని కలెక్టరేట్ కార్యాలయంలో శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మార్కాపురం నియోజకవర్గంలోని పలు సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. నియోజకవర్గంలో సమస్యలు లేకుండా పరిష్కరిస్తానని కలెక్టర్ హామీ ఇచ్చినట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు.

February 7, 2025 / 04:43 PM IST

శ్రేయస్‌ను పక్కన పెట్టొద్దు: జహీర్ ఖాన్

ఇంగ్లండ్‌తో జరిగిన తొలి వన్డేలో శ్రేయస్ అయ్యర్ హాఫ్ సెంచరీతో అదరగొట్టిన విషయం తెలిసిందే. కోహ్లీ స్థానంలో తుది జట్టులోకి వచ్చిన శ్రేయస్ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. దీనిపై భారత మాజీ పేసర్ జహీర్ ఖాన్ స్పందించాడు. శ్రేయస్ ఆత్మవిశ్వాసం అద్భుతమని.. తర్వాతి మ్యాచుల్లోనూ ఇలాగే కొనసాగిస్తే బాగుంటుందని తెలిపాడు. మంచి ఫామ్‌లో ఉన్న బ్యాటర్‌ను పక్కనపెట్టడం సరికాదన్నాడు.

February 7, 2025 / 02:29 PM IST

నా స్థానం మెరుగుపరచుకోవాలి: CM

AP: ఫైల్స్ క్లియరెన్స్‌లో మంత్రుల ర్యాంకులపై CM చంద్రబాబు స్పందిస్తూ.. వేగవంతమైన, మెరుగైన పనితీరుతో సత్వర ఫలితాలు సాధిద్దామన్నారు. ‘బృందంగా పనిచేసినప్పుడే ఉత్తమ ఫలితాలు సాధించగలం. ఎప్పటికప్పుడు సమీక్షించుకుని పనిచేయాలన్నదే మా ఆలోచన. పోటీపడి పనిచేసి పాలనలో వేగం పెంచేందుకు చేసిన ప్రయత్నంలో భాగమే మంత్రులకు ర్యాంకులు. నేను కూడా నా స్థానం మెరుగుపరచుకోవాలి’ అని తెలిపారు.

February 7, 2025 / 02:24 PM IST

కిక్ బాక్సింగ్ పోటీల్లో బెల్లంపల్లి వాసి ప్రతిభ

MNCL: బెల్లంపల్లి మండలం చంద్రవెల్లి గ్రామానికి చెందిన అంతర్జాతీయ కిక్ బాక్సింగ్ క్రీడాకారుడు రాసకొండ సంజీవ్ మరోసారి ప్రతిభ చూపి పోటీల్లో బహుమతి సాధించాడు. ఈనెల 1 నుండి 5 వరకు కేడి జాదవ్ ఇండోర్ స్టేడియం ఐజి కాంప్లెక్స్ న్యూఢిల్లీలో జరిగిన ఏడవ వాకో అంతర్జాతీయ కిక్ బాక్సింగ్ రిఫ్రి సెమినార్ లో పాల్గొని సర్టిఫికెట్, అవార్డు పొందారు. అతన్ని గ్రామస్తులు అభినందించారు. 

February 7, 2025 / 02:06 PM IST

కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం: పటేల్ రమేష్ రెడ్డి

SRPT: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అందిస్తుందని టూరిజం కార్పొరేషన్ ఛైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఆయన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ.. కులగణన సర్వే సక్రమంగా నిర్వహిస్తే కొంతమంది బీఆర్ఎస్ నాయకులు కావాలని దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఎమ్మెల్సీ, లోకల్ బాడీ ఎన్నికల్లో పోటీ చేయాలని సవాల్ విసిరారు.

February 7, 2025 / 02:04 PM IST

వాట్సాప్ గ్రూప్ ద్వారా ఆర్థిక సహాయం అందజేత

BHNG: మోత్కూరు మున్సిపాలిటీ సాయినగర్ కాలనీకి చెందిన వాట్సాప్ గ్రూప్ సభ్యులు గొప్ప మనస్సు చాటుకున్నారు. కాలనీకి చెందిన మధు(భాష ) ఇటీవల అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందాడు. కాలనికి చెందిన వాట్సాప్ గ్రూప్ సభ్యులు తలో రూపాయి కూడబెట్టి, 9,001 రూపాయలు, 50 కేజీల బియ్యంను బాధిత కుటుంబనికి అందించారు.

February 7, 2025 / 01:52 PM IST

‘అబద్దాల్లో ఆస్కార్ అవార్డు తీసుకున్న జగన్’

GNTR: మాజీ సీఎం వైఎస్ జగన్ అబద్ధాల్లో ఆస్కార్ అవార్డు తీసుకున్నారని మంత్రి గుమ్మడి సంధ్యారాణి ఎద్దేవా చేశారు. మంగళగిరి టీడీపీ కార్యాలయంలో శుక్రవారం మంత్రి గుమ్మడి సంధ్యరాణి మీడియాతో మాట్లాడారు. గత ఏడాది ఏప్రిల్, మే నెలలో వైఎస్ జగన్ ప్రభుత్వం చేసిన అప్పు రూ.20వేల కోట్లను ఏం చేశారో చెప్పాలని అన్నారు.

February 7, 2025 / 01:51 PM IST