MNCL: బెల్లంపల్లి మండలం చంద్రవెల్లి గ్రామానికి చెందిన అంతర్జాతీయ కిక్ బాక్సింగ్ క్రీడాకారుడు రాసకొండ సంజీవ్ మరోసారి ప్రతిభ చూపి పోటీల్లో బహుమతి సాధించాడు. ఈనెల 1 నుండి 5 వరకు కేడి జాదవ్ ఇండోర్ స్టేడియం ఐజి కాంప్లెక్స్ న్యూఢిల్లీలో జరిగిన ఏడవ వాకో అంతర్జాతీయ కిక్ బాక్సింగ్ రిఫ్రి సెమినార్ లో పాల్గొని సర్టిఫికెట్, అవార్డు పొందారు. అతన్ని గ్రామస్తులు అభినందించారు.
SRPT: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అందిస్తుందని టూరిజం కార్పొరేషన్ ఛైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఆయన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ.. కులగణన సర్వే సక్రమంగా నిర్వహిస్తే కొంతమంది బీఆర్ఎస్ నాయకులు కావాలని దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఎమ్మెల్సీ, లోకల్ బాడీ ఎన్నికల్లో పోటీ చేయాలని సవాల్ విసిరారు.
BHNG: మోత్కూరు మున్సిపాలిటీ సాయినగర్ కాలనీకి చెందిన వాట్సాప్ గ్రూప్ సభ్యులు గొప్ప మనస్సు చాటుకున్నారు. కాలనీకి చెందిన మధు(భాష ) ఇటీవల అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందాడు. కాలనికి చెందిన వాట్సాప్ గ్రూప్ సభ్యులు తలో రూపాయి కూడబెట్టి, 9,001 రూపాయలు, 50 కేజీల బియ్యంను బాధిత కుటుంబనికి అందించారు.
GNTR: మాజీ సీఎం వైఎస్ జగన్ అబద్ధాల్లో ఆస్కార్ అవార్డు తీసుకున్నారని మంత్రి గుమ్మడి సంధ్యారాణి ఎద్దేవా చేశారు. మంగళగిరి టీడీపీ కార్యాలయంలో శుక్రవారం మంత్రి గుమ్మడి సంధ్యరాణి మీడియాతో మాట్లాడారు. గత ఏడాది ఏప్రిల్, మే నెలలో వైఎస్ జగన్ ప్రభుత్వం చేసిన అప్పు రూ.20వేల కోట్లను ఏం చేశారో చెప్పాలని అన్నారు.
NRML: తునికాకు సేకరణకు టెండర్లు పిలవాలని టీఏజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి శంభు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతిఏటా డిసెంబర్ జనవరి నుంచి సేకరణ ప్రత్యేక సంబంధించి పనులను అటవీశాఖ మొదలు పెట్టేదని, ఈ ఏడాది మాత్రం ఆ ప్రక్రియ నత్తనడకను తలపిస్తున్నదని అన్నారు. టెండర్ల ప్రక్రియను వెంటనే పూర్తిచేసి గిరిజన పేదలకు ఉపాధి కల్పించాలన్నారు.
SRPT: పూర్తిస్థాయిలో రుణమాఫీ చేయకుండా రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తుందని సీపీఐ పార్టీ మండల కార్యదర్శి పోకల వెంకటేశ్వర్లు అన్నారు. శుక్రవారం గరిడేపల్లి మండలం కాల్వపల్లి గ్రామంలో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్ ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో ఒక్కటైన రుణమాఫీ నేటికీ పూర్తిస్థాయిలో అమలు చేయలేదన్నారు.
AKP: భూ యజమానులకు, సర్వే సిబ్బంది, రెవిన్యూ సిబ్బందికి, రీ-సర్వేలో వచ్చిన సందేహాలు నివృత్తి చేయడానికి జిల్లా స్థాయిలో రీ-సర్వే నిపుణుల సెల్ ఏర్పాటు చేసినట్టు అనకాపల్లి జాయింట్ కలెక్టర్ ఎమ్.జాహ్నవి తెలిపారు. పైలెట్ ప్రోజెక్టుగా మండలానికి ఒక గ్రామం చొప్పున రీ-సర్వే నిర్వహించడం జరుగుందన్నారు.
PPM: సాలూరు ఎమ్మెల్యే, గిరిజన సంక్షేమ శాఖా మంత్రి గుమ్మిడి సంధ్యారాణి శుక్రవారం మంగళగిరి టీడీపీ సెంట్రల్ ఆఫీసులో ప్రజల నుండి ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు ప్రజలు తమ సమస్యలను మంత్రికి తెలియజేశారు. ఆమె ప్రతి ఫిర్యాదును ఓపిగ్గా వినిపించి, తగిన పరిష్కార చర్యలు తీసుకోవడానికి అధికారులకు సూచనలు ఇచ్చారు.
ASR: పాడేరు ఐటీడీఏ పీవోగా వీ.అభిషేక్ అందించిన సేవలు మరువలేనివని అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం కొనియాడారు. బదిలీపై వెళుతున్న పీవోకు శుక్రవారం పాడేరులో నిర్వహించిన అభినందన సభలో పాల్గొని మాట్లాడారు. ఐటీడీఏ పరిధిలోని 11 మండలాల్లో రహదారి నిర్మాణాలు, తాగునీటి సౌకర్యాల కల్పనకు పీవో వీ.అభిషేక్ కృషి చేశారని తెలిపారు. ఆయన మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని కోరారు.
W.G: ఆరోగ్యవంతమైన పిల్లల కోసం నులిపురుగుల నివారణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఇరగవరం మండల పరిషత్ అభివృద్ధి అధికారి ఎ.శ్రీనివాస్ కోరారు. ఈ నెల 10న జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమాన్ని పురస్కరించుకుని శుక్రవారం మండల పరిషత్ కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేశారు. అనంతరం నులిపురుగుల నివారణ మాత్రలను అందజేసి వాల్ పోస్టర్లు ఆవిష్కరించారు.
పల్నాడు: ఏపీఎస్ ఆర్టీసీ హెవీ మోటర్ వెహికల్ డ్రైవింగ్ ట్రైనింగ్ స్కూల్లో శిక్షణ పూర్తిచేసుకున్న డ్రైవర్లకు డిపో మేనేజర్ జీవీఎస్వీవీ కుమార్ శుక్రవారం సర్టిఫికెట్లను అందజేశారు. 18వ బ్యాచ్ శిక్షణ పూర్తిచేసుకున్న వారికి సర్టిఫికెట్ల ప్రదానం చేసినట్లు చెప్పారు. 19వ బ్యాచ్ అడ్మిషన్లు జరుగుతున్నట్లు తెలిపారు.
NRML: జిల్లాలోని 19 మండలాలలో ఎంపికైన 256 మందికి సంబంధించిన ఎస్సీ కార్పొరేషన్ రుణాల సబ్సిడీని వెంటనే మంజూరు చేయాలని సీపీఎమ్ జిల్లా కార్యదర్శి బొమ్మెన సురేష్ అన్నారు. శుక్రవారం వారు మాట్లాడుతూ బ్యాంకు మేనేజర్ ద్వారా ఎంపిక చేసిన 2020-21 సంవత్సరానికి సంబంధించి లబ్ధిదారులకు సంబంధించి సబ్సిడీ రుణాలను ఇప్పటివరకు మంజూరు చేయలేదని వాపోయారు
SKLM: కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ఆమోదం తెలిపిన డోలా, పిన్నింటిపేట, నౌపడా రహదారి(33.2కిలోమీటర్లు)కి రూ. 55.7 కోట్లు నిధులు మంజూరు కావడంతో స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ రహదారి మూలపేట పోర్టుకు మణిహారం లాంటిదని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ రహదారి కోసం చొరవ చూపిన కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడుకి ప్రజలు ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పారు.
VZM : విజయనగరం పట్టణం 3వ డివిజన్ బిట్ 1కు చెందిన వైసీపీ నాయకులు రాయితి లక్ష్మణతో పాటు 50 కుటుంబాలు శుక్రవారం అశోక్ బంగ్లాలో విజయనగరం శాసనసభ్యురాలు పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతి రాజు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. ఈ సందర్భంగా వారికి ఎమ్మెల్యే పార్టీ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు.
NDL: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 14న నంద్యాలలో నిరుద్యోగులకు జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా అధికారి మస్తాన్ వలి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా మట్లాడుతు KVSC ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో జరిగే జాబ్ మేళాలో వివిధ సంస్థలకు చెందిన కంపెనీ ప్రతినిధులు హాజరు కానున్నారని విద్యార్హత పత్రాలతో హాజరు కావాలన్నారు.