ASR: కీటక జనిత వ్యాధుల నియంత్రణకు పటిష్ట చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ ఆదేశించారు. జాతీయ కీటక జనిత వ్యాధుల నియంత్రణ కార్యక్రమం కింద పలు శాఖల అధికారులతో కీటక జనిత వ్యాధుల నియంత్రణపై కలెక్టరేట్లో బుధవారం సమావేశం నిర్వహించారు. గత ఏడాది చేపట్టిన మలేరియా నివారణ చర్యలపై ఆరా తీశారు. జిల్లాలో మలేరియా, డెంగ్యూ మరణాలు జరగకూడదన్నారు.
AP: టీటీడీ సేవలు, సౌకర్యాల్లో వంద శాతం మార్పు కనిపించాలని CM చంద్రబాబు అధికారులకు సూచించారు. తిరుమలలో సేవలు బాగుంటేనే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందన్నారు. అభివృద్ధి పనుల పేరుతో టీటీడీ ఇష్టం వచ్చినట్లు ఖర్చు పెట్టొదన్నారు. టీటీడీలో మనం ధర్మకర్తలం, నిమిత్తమాత్రులమని పేర్కొన్నారు. వచ్చే 50 ఏళ్లు అవసరాలకు అనుగుణంగా టీటీడీని తీర్చిదిద్దాలని వెల్లడించారు.
SKLM: ప్రజా సమస్యలు పరిష్కారానికి మొదట ప్రాధాన్యత అని పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు అన్నారు. బుధవారం ఆయన క్యాంప్ కార్యాలయంలో ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో నియోజకవర్గంలో ఉన్న ప్రజల నుండి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి కార్యకర్తను కలిసి సమస్యలు తెలుసుకొని పరిష్కరిస్తామని అన్నారు.
మహాత్మా గాంధీ కుటుంబంలో విషాదం నెలకొంది. గాంధీజీ ముని మనవరాలు నీలంబెన్ పారిఖ్(93) మృతి చెందారు. వృద్ధాప్య సమస్యలతో ఆమె నిన్న గుజరాత్లోని నవ్సరిలో తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆమె అంత్యక్రియలు ఈరోజు వీర్వాల్ శ్మశానవాటికలో జరుగుతాయని వెల్లడించారు. నీలంబెన్ మృతిపట్ల పలువురు సంతాపం వ్యక్తం చేశారు.
GNTR: ప్రభుత్వం అందించే కార్పొరేషన్ రాయితీ రుణాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందుతాయని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి తెలిపారు. బుధవారం టీడీపీ కార్యాలయంలో ప్రజా గ్రీవెన్స్ డేలో ఆమె ప్రజల ఫిర్యాదులను స్వీకరించారు. గుంటూరు కొరిటెపాడు ప్రాంతానికి చెందిన మహిళలు చిట్టీల మోసంపై న్యాయం కోరగా, పోలీసులు చర్యలు తీసుకునేలా చూస్తానని హామీ ఇచ్చారు.
KRNL: గ్రామాల్లో పశువులకు తాగునీటి సమస్య తప్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నీటి తొట్టెల నిర్మాణం చేపట్టిందని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా తెలిపారు. బుధవారం కర్నూలు మం.దిన్నెదేవరపాడు గ్రామ శివార్లలో పశువుల కోసం నీటి తొట్టె నిర్మాణానికి జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే దస్తగిరి భూమిపూజ నిర్వహించారు. ఉపాధి పథకంలో భాగంగా ఈ ప్రాజెక్టును అమలు చేస్తున్నామన్నారు.
KMR: రెవెన్యూ వసూళ్లలో కామారెడ్డి ఆర్టీఏ రాష్ట్రంలోనే టాప్లో నిలిచింది. ఈ మేరకు డీటీవో శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా బుధవారం జిల్లా కార్యాలయంలో కేక్ కట్ చేసి సంబురాలు జరుపుకున్నారు. గతేడాది లక్ష్యం రూ.63 కోట్లు ఉండగా, ఈసారి రూ.73 కోట్ల లక్ష్యానికిగాను రూ. 68.19కోట్లు (92.4 %) వసూలు చేసినట్లు పేర్కొన్నారు.
ATP: గార్లదిన్నెలోని తహసీల్దార్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఎమ్మెల్యే బండారు శ్రావణి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి నేరుగా వివిధ సమస్యలపై అర్జీలు స్వీకరించారు. రెవెన్యూ శాఖకు సంబంధించిన అర్జీలు అధికంగా వచ్చాయని ఎమ్మెల్యే తెలిపారు. వీటన్నింటిపై విచారణ జరిపించాలని ఆమె అధికారులకు ఆదేశించారు.
జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల్ టౌన్ పోలీస్ స్టేషన్ను సందర్శించిన జిల్లా ఎస్పీ టి శ్రీనివాస రావు బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ పరిసరాలను, రికార్డ్లను, సిబ్బంది నిర్వహిస్తున్న విదులను పరిశీలించారు. వారు ఏ ఏ విధులు నిర్వహిస్తున్నారో పరిశీలించారు. పోలీస్ స్టేషన్కు వచ్చే ప్రతి ఫిర్యాదు దారునితో సిబ్బంది గౌరవంగా మెలగాలని అన్నారు.
NZB: ఏఐఎస్ఎఫ్ జిల్లా సమితి ఆధ్వర్యంలో గిరిరాజ్ డిగ్రీ కాలేజ్ ఎదుట నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ తెలంగాణ రాష్ట్ర సహాయ కార్యదర్శి రఘురాం మాట్లాడుతూ.. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో 400 ఎకరాల యూనివర్సిటీ భూములను వేలం ద్వారా విక్రయించే నిర్ణయాన్ని ప్రభుత్వం విరమించుకోవాలని డిమాండ్ చేశారు.
ADB: మహిళలకు ఎలాంటి సమస్యలున్న ఆదిలాబాద్ షీ టీం బృందాలను సంప్రదించాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ బుధవారం తెలిపారు. మహిళలు కళాశాలలు, ఉద్యోగ స్థలాల నందు వేధింపులపై నిరభ్యంతరంగా ఫిర్యాదు చేయాలన్నారు. బాధితులు షీటీం నెంబర్ 8712659953 ను సంప్రదించాలని సూచించారు. మహిళా చట్టాలు, సైబర్ నేరాలు వంటి అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు.
NRPT: పేద ప్రజలకు ప్రభుత్వం నాణ్యమైన సన్న బియ్యం అందజేస్తున్నదని అదనపు కలెక్టర్ రెవెన్యూ బెన్ షాలోమ్ తెలిపారు. బుధవారం కృష్ణా మండల కేంద్రంలోని చౌక ధర దుకాణంలో ప్రభుత్వం పంపిణీ చేస్తున్న సన్న బియ్యం పథకాన్ని ప్రారంభించి లబ్ధిదారులకు బియ్యం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రేషన్ కార్డులు ఉన్న ప్రతి ఒక్కరికీ సన్న బియ్యం అందజేస్తామని తెలిపారు.
NLG: దేవరకొండ మున్సిపల్ కార్యాలయంలోని ప్రజా పాలన సేవ కేంద్రం ద్వారా రాజీవ్ యువ వికాసం పథకానికి దరఖాస్తు చేసుకోవాలని మున్సిపల్ కమిషనర్ వై. సుదర్శన్ బుధవారం తెలిపారు. జిల్లా కలెక్టర్ ఆదేశానుసారం ఈనెల 14 వరకు దరఖాస్తులను స్వీకరించినట్లు తెలిపారు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకొని, సంబంధిత పత్రాలను మున్సిపల్ కార్యాలయంలో అందజేయాలని సూచించారు.
NLG: చిట్యాల పట్టణంలో బుధవారం సీపీఎం ఆధ్వర్యంలో స్థానిక భువనగిరి రోడ్డుపై రాస్తారోకో, నల్ల జెండాల ప్రదర్శన నిర్వహించారు. HCU భూమిని ప్రైవేటు వారికి అప్పగించాలనే ప్రభుత్వ యోచన విరమించుకోవాలని సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు జిట్ట నగేష్, అవిశెట్టి శంకరయ్యలు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. 400 ఎకరాల HCU భూములను చౌకగా అక్రమ పద్ధతుల్లో కొళ్ళగొడుతున్నారన్నారు.
ప్రకాశం: ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య ఆదేశాలతో చీరాలలోని టీడీపీ క్యాంపు కార్యాలయంలో బుధవారం ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో మండల అధ్యక్షులు గంజి పురుషోత్తం, పట్టణ అధ్యక్షులు గజవల్లి శ్రీనివాసరావులు పాల్గొని ఆయా సమస్యలపై వచ్చిన అర్జీలను స్వీకరించారు. మొత్తం 130 అర్జీలు వచ్చాయని, ఎమ్మెల్యే దృష్టికి తీసుకు వెళ్తామని చెప్పారు.