• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

ఈద్గాలో ముస్లింలతో కాంగ్రెస్ నేతల సద్భావన సందడి

VKB: రంజాన్ పండుగను పురస్కరించుకుని యాలాల ఈద్గాలో కాంగ్రెస్ మండల మాజీ అధ్యక్షుడు అక్బర్ బాబా ఆధ్వర్యంలో ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం కాంగ్రెస్ నాయకులు పేరి రాజేందర్ రెడ్డి, సర్పంచ్ శివయ్య ముస్లిం సోదరులను ఆలింగనం చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో భక్తులందరికీ కీర్ పంపిణీ చేయడం జరిగింది.

March 21, 2026 / 11:36 AM IST

దామాషా పద్ధతి అంటే ఏమిటి?

దామాషా పద్ధతి అంటే ఏదైనా మొత్తాన్ని అందరికీ సమానంగా కాకుండా, వారి అర్హత, ఉపయోగించుకున్న కాలాన్ని బట్టి లెక్కకట్టి పంచడం. ఉదాహరణకు, స్కూల్ ఫీజు విషయంలో పిల్లాడు ఎన్ని నెలలు చదువుకుంటే అంతవరకే ఫీజు ఉంచుకుని, మిగిలిన మొత్తాన్ని తిరిగి ఇవ్వడాన్ని దామాషా పద్ధతి అంటారు. ఇలా ఎవరి వంతు ఎంత వస్తుందో చూసి సరిగ్గా వాటా తేల్చడమే ఈ పద్ధతి.

March 21, 2026 / 11:35 AM IST

ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు: ఎమ్మెల్సీ

కోనసీమ: పేదవారిని ఆదుకోవాలనే సందేశాన్ని రంజాన్ మాసం అందిస్తుందని రాష్ట్ర సబ్ ఆర్డినేటర్ కమిటీ చైర్మన్, మండపేట వైసీపీ ఇన్‌ఛార్జ్ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు పేర్కొన్నారు. రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని MLC తోట నియోజకవర్గ సోదర సోదరీమనులందరికీ శనివారం హృదయపూర్వక రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. హిందూ-ముస్లిం-క్రైస్తవ సోదరభావం, ఐక్యత మరింత బలపడాలని కోరారు.

March 21, 2026 / 11:35 AM IST

ప్రత్యేక ప్రార్ధనల్లో పాల్గొన్న మంత్రి

MNCL: మందమర్రి పట్టణంలోని CER క్లబ్ వెనుక గల ఈద్గా వద్ద శనివారం రంజాన్ ప్రార్థనలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో మంత్రి వివేక్ వెంకటస్వామి పాల్గొని ముస్లిం సోదరులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ.. రంజాన్ పండుగ శాంతి, సౌభ్రాతృత్వానికి ప్రతీక అని కొనియాడారు. ముస్లిం సోదరులను ఆలింగనం చేసుకొని పండుగ శుభాకాంక్షలు తెలిపారు.

March 21, 2026 / 11:35 AM IST

అకాల వర్షాలతో దెబ్బతిన్న పంటల పరిశీలన

ATP: బెళుగుప్ప మండలం దూదేకుంట గ్రామంలో అకాల వర్షాలకు దెబ్బతిన్న మొక్కజొన్న పంటను రైతు సంఘం నాయకులు శనివారం పరిశీలించారు. అకస్మాత్తుగా కురిసిన వర్షాలతో కోతకు సిద్ధంగా ఉన్న పంట నేలపాలైందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని నాయకులు డిమాండ్ చేశారు. ఆరుగాలం శ్రమించిన రైతుకు అన్యాయం జరగకుండా చూడాలని స్పష్టం చేశారు. 

March 21, 2026 / 11:35 AM IST

శిథిలావస్థకు చేరిన బస్టాండ్

TPT: సూళ్లూరుపేట మండలంలోని కోరిడి గ్రామంలో బస్టాండ్ పూర్తిగా శిథిలావస్థకు చేరింది. పైకప్పు దెబ్బతినడం, గోడలు కూలిపోవడం వల్ల ప్రయాణికులు అక్కడ నిలబడేందుకు కూడా భయపడుతున్నారు. వర్షం, ఎండ నుంచి రక్షణ లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బస్టాండ్ చుట్టూ చెత్త పేరుకుపోయి, మొక్కలు పెరిగి అపరిశుభ్రంగా మారిందని విమర్శలు వస్తున్నాయి.

March 21, 2026 / 11:34 AM IST

అప్పుడు 7 కిలోలు తగ్గా: శ్రేయస్‌ అయ్యర్‌

ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్నప్పుడు తీవ్రమైన గాయం కారణంగా తాను 7 కిలోల బరువు తగ్గినట్లు క్రికెటర్ శ్రేయస్ అయ్యర్ వెల్లడించాడు. కోలుకునే క్రమంలో బరువును తిరిగి పొందడం, ఫిట్‌నెస్ సాధించడం చాలా కష్టమైన సవాలుగా మారిందన్నాడు. అయితే కష్టపడి ఆ దశను అధిగమించడం గర్వంగా ఉందని తెలిపారు.

March 21, 2026 / 11:33 AM IST

నరసాపురంలో రంజాన్ పండుగ వేడుకలు

W.G: ముస్లిం సోదరులు ఎంతో పవిత్రంగా భావించే రంజాన్ పండుగను శనివారం నరసాపురంలో అత్యంత ఘనంగా నిర్వహించారు. మిషన్ హైస్కూల్ రోడ్డులో ఉన్న ఈద్గా మైదానానికి ముస్లింలు, పెద్ద సంఖ్యలో చేరుకుని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా ఒకరికొకరు పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ పాల్గొని రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.

March 21, 2026 / 11:33 AM IST

ఉద్యోగాల పేరుతో కోట్లు స్వాహా.. కేటుగాడు అరెస్ట్

NLG: స్టాఫ్ నర్స్ ఉద్యోగాలిప్పిస్తామని నమ్మించి కోట్లాది రూపాయలు వసూలు చేసిన నిందితుడు రఘురామ్‌ను సూర్యాపేట పోలీసులు అరెస్ట్ చేశారు. HYDకి చెందిన వాణితో కలిసి సుమారు 60 మంది నుంచి రూ.1.85 కోట్లు కాజేసి ఈ సొమ్ముతో జల్సాలు చేస్తూ ప్లాట్లు, కార్లు కొనుగోలు చేసినట్లు సీఐ వెంకటయ్య వెల్లడించారు. నిందితుడికి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది.

March 21, 2026 / 11:32 AM IST

సీతారాముల కళ్యాణానికి డిప్యూటీ సీఎంకు ఆహ్వానం

KMM: ముదిగొండ మండలంలోని ముత్తారం గ్రామంలో ఈ నెల 27న నిర్వహించనున్న శ్రీ సీతారామచంద్ర స్వామి కల్యాణోత్సవానికి రావాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను ఆలయ కమిటీ సభ్యులు, కాంగ్రెస్ నాయకులు ఆహ్వానించారు. ఇవాళ హైదరాబాద్‌లో మల్లెల అజయ్ ఆధ్వర్యంలో ఆయనను కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు.

March 21, 2026 / 11:31 AM IST

ఈద్గా మైదానంలో ఎమ్మెల్యే కందికుంట ప్రార్థనలు

సత్యసాయి: కదిరి పట్టణం ఈద్గా మైదానంలో ఈద్-ఉల్-ఫితర్ వేడుకలు శనివారం ఘనంగా జరిగాయి. ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ ముస్లిం సోదరులతో కలిసి ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఆయన అందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. నియోజకవర్గంలో సోదరభావం, శాంతి వర్ధిల్లాలని ఆకాంక్షించారు. పండుగ పూట ముస్లిం సోదరులతో కలిసి సమయం గడపడం సంతోషంగా ఉందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

March 21, 2026 / 11:30 AM IST

జీవన్ రెడ్డితో మంత్రుల మంతనాలు

TG: కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డితో మంత్రులు శ్రీధర్ బాబు, లక్ష్మణ్ కీలక చర్చలు జరిపారు. జగిత్యాల వెళ్లిన మంత్రులు ఆయనతో భేటీ అయి, పార్టీ మారవద్దని సూచించారు. నియోజకవర్గంలో ఎదురవుతున్న సమస్యలను అధిష్టానం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. గత కొద్దిరోజులుగా అసంతృప్తితో ఉన్న జీవన్ రెడ్డిని శాంతింపజేసేందుకు ప్రభుత్వం తరఫున ఈ బుజ్జగింపుల పర్వం కొనసాగుతోంది.

March 21, 2026 / 11:30 AM IST

తొర్రూరు మండలంలో అంగన్వాడీలు తాళాలకే పరిమితం

MHBD: తొర్రూరు (M) లోని దుబ్బాతండా, కర్రె బిక్య తండాల్లో అంగన్వాడి కేంద్రాలు మూతపడడంతో చిన్నారుల పోషకాహార సేవలు పూర్తిగా నిలిచిపోయాయి. పర్యవేక్షణ లేకపోవడంతో ప్రభుత్వం అందిస్తున్న పోషకాహార సరుకులు లబ్ధిదారులకు అందడం లేదు. అంగన్వాడీ సేవలు నిలిచిపోవడంతో బాలింతలు, చిన్నపిల్లలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వెంటనే అంగన్వాడీలను పునఃప్రారంభించాలని కోరారు.

March 21, 2026 / 11:29 AM IST

జాతర వేడుకల్లో పాల్గొన్న నర్సాపూర్ ఎమ్మెల్యే

MDK: నర్సాపూర్ నియోజకవర్గం హత్నూర మండలం సికింద్లాపూర్ గ్రామంలో నిర్వహించిన శ్రీ వెంకటేశ్వర స్వామి జాతర ఘనంగా జరిగింది. ఈ జాతరలో నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి పాల్గొన్నారు. జాతర సందర్భంగా MLA స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామ ప్రజలతో కలిసి జాతర ఉత్సవాల్లో పాల్గొని భక్తులకు శుభాకాంక్షలు తెలిపారు.

March 21, 2026 / 11:29 AM IST

లవ్ ఫెయిల్.. యువకుడు సూసైడ్

HYD: నేరెడ్‌మెట్, ఓల్డ్ సఫిల్‌గూడలో హృదయవిదారక ఘటన జరిగింది. ప్రేమ వివాహనికి యువతి తల్లి నిరాకరించడంతో మనస్తాపం చెందిన 23 ఏళ్ల నరేశ్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఉగాది పండుగకు స్నేహితుడు స్వగ్రామానికి వెళ్లగా ఒంటరిగా ఉన్న సమయంలో నరేశ్ గదిలో ఉరేసుకుని మృతి చెందాడు. పోలీసులు సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

March 21, 2026 / 11:28 AM IST