కృష్ణా: విజయవాడ ఆటోనగర్లో మంగళవారం రాత్రి లక్ష్మీ అనే మహిళ మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేయగా హుటాహుటిన పోలీసు అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మహిళ పడి ఉన్న ప్రాంతాన్ని ఏసీపీలు పవన్ కిషోర్, దామోదర్ పరిశీలించారు. నిందితుడిని త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు. భర్త మహంకాళి పరారీలో ఉన్నట్టు చెప్పారు.
JN: సర్దార్ సర్వాయి పాపన్న జీవితాన్ని నేటి తరం ఆదర్శంగా తీసుకోవాలని మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. సర్దార్ సర్వాయి పాపన్న 315వ వర్ధంతిని పురస్కరించుకుని లింగాల ఘన్పూర్ మండల కేంద్రంలోని ఆయన విగ్రహానికి ఎమ్మెల్యే పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన త్యాగాన్ని ఎమ్మెల్యే ప్రజలకు గుర్తు చేశారు.
PDPL: ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారులు ఎప్పటికప్పుడు సిద్ధంగా ఉన్నారని అదనపు కలెక్టర్ &రామగుండం కార్పొరేషన్ ఇంఛార్జ్ కమిషనర్ అరుణ శ్రీ పేర్కొన్నారు. డివిజన్లలో ఉన్న సమస్యలను తీర్చేందుకు ఆన్లైన్ ఫిర్యాదు చేసేందుకు అవకాశం ఉందన్నారు. అలాగే కార్యాలయంలో ప్రత్యేక సేవా కేంద్రాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. టోల్ ఫ్రీ నెంబర్ 14420 నెంబర్కి ఫిర్యాదు చేయవచ్చని పేర్కొన్నారు.
ఖమ్మం: రాజీవ్ యువ వికాసం పథకంలో జర్నలిస్టులకు ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్ను టీడబ్ల్యూజేఎఫ్ జర్నలిస్టులు కోరారు. బుధవారం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ను కలిసి వినతి పత్రం అందించారు. జర్నలిస్టులు పేద, మధ్యతరగతి వర్గాలకు చెందిన వారు కాబట్టి వారి ఆర్థిక స్థితిగతులను దృష్టిలో పెట్టుకుని చర్యలు తీసుకోవాలన్నారు.
KMM: ఆరు గ్యారెంటీ పథకాలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని సీపీఎం మధిర డివిజన్ కార్యదర్శి గోపాల్ రావు అన్నారు. బుధవారం బోనకల్లో మండల కమిటీ ఆధ్వర్యంలో మండల తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. పరిశ్రమల స్థాపన పేరుతో రాష్ట్ర ప్రభుత్వం HUCభూములను ప్రైవేట్ తరం చేయడం సరికాదన్నారు. అనంతరం తహసీల్ధార్కు సమస్యలతో కూడిన వినతి పత్రం అందజేశారు.
TG: ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ ప్రారంభమైంది. తెలంగాణ స్పీకర్ తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదనలు వినిపిస్తున్నారు. ఎమ్మెల్యేల అనర్హతపై స్పీకర్కు గడువు ఇవ్వడంపై హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పు సరికాదని రోహత్గీ తెలిపారు. సింగిల్ బెంచ్ ఉత్తర్వుపై డివిజన్ బెంచ్ తీర్పు సరైనదని అన్నారు.
హర్ష్ రోషన్, కార్తికేయ దేవ్, శాన్వి మేఘన ప్రధాన పాత్రల్లో సీ. సుప్రీత్ కృష్ణ తెరకెక్కించిన సినిమా ‘టుక్ టుక్’. ఇది ఈ నెల 10 నుంచి ప్రముఖ OTT సంస్థ ఈటీవీ విన్లో స్ట్రీమింగ్ కానుంది. దీంతో పాటు పలు సినిమాలు సదరు సంస్థలో రిలీజ్ కాబోతున్నాయి. రేపు ‘ఉద్వేగం’ మూవీ విడుదల కానుండగా.. ‘కొత్త కొత్తగా’ అనే మూవీ ఈ నెల 24 నుంచి అందుబాటులో ఉండనుంది.
KKD: పెద్దాపురం మండలం కాండ్రకోట నూకాలమ్మ జాతరలో విషాదం చోటు చేసుకుంది. మంగళవారం రాత్రి ఇద్దరు వ్యక్తులు ఏలేరు కాలువలోకి స్థాన్నానికి దిగి గల్లంతు అయ్యారు. స్థానికులు వివరాలు.. కాకినాడ, జగన్నాధపురం బిర్యానీ పేటకు చెందిన పిరమాడి విశాల్ (7), కొప్పాడి బాలు (22) ఇద్దరిలో ఒకరి మృతదేహం బుధవారం లభ్యమైంది. మరో మృతదేహం కోసం గాలిస్తున్నారు.
HYD: టాంకర్ బుకింగ్.. డెలివరీలపై జలమండలి ఎండీ అశోక్ రెడ్డి జీఎంలతో జూమ్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎండీ మాట్లాడుతూ.. వరుసగా వచ్చిన సెలవులతో కొన్ని ప్రాంతాల్లో ట్యాంకర్ బుకింగ్ల పెండింగ్ పెరిగినట్టు రానున్న 2 రోజులు అదనపు గంటలు పనిచేయడానికి ఏర్పాట్లు చేయాలి అధికారులను ఆదేశించారు. రెండు షిఫ్టుల్లో ట్యాంకర్ డెలివరీ చేయడానికి ఏర్పాటు చేసుకోవాలన్నారు.
KKD: ఎవరైనా సరే గ్రామాల్లో శాంతిభద్రతలకు భంగం కలిగించేలా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తప్పవని జగ్గంపేట సీఐ వై ఆర్.కే శ్రీనివాస్ హెచ్చరించారు. బుధవారం గండేపల్లి మండలం ఉప్పలపాడు గ్రామంలో రిప్ రాప్ తిరుగుతున్న 9 మందిని పోలీసులు పట్టుకొని బుధవారం జగ్గంపేట సర్కిల్ ఆఫీసుకి తరలించారు. వారికి జగ్గంపేట సీఐ వై ఆర్.కే శ్రీనివాస్ వారికి కౌన్సెలింగ్ ఇచ్చారు.
E.G: రాజమహేంద్రవరం కార్పొరేషన్ పన్నుల వసూళ్లలో రాష్ట్రంలోనే తొలి స్థానంలో నిలిచింది. ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి ఇంటి పన్ను, నీటి పన్ను, ఖాళీ స్థలాల పై వేసే పన్నులతో పాటు ఇతర పన్నులతో కలిసి రూ.65.19 కోట్లు వసూలు చేసినట్లు అధికారులు ప్రకటించారు. చివరి రోజున హౌస్ ట్యాక్స్ రూ.2.19 కోట్లు, ఖాళీ స్థలాల పన్నులు రూ.44.87లక్షలు, వాటర్ ఛార్జిలు రూ.24 లక్షలు వసూలయ్యయి.
PDPL: మంథని మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో గైనకాలజిస్టును నియమించినట్లు కలెక్టర్ శ్రీహర్ష తెలిపారు. కాంట్రాక్టు పద్ధతిలో నియమితులైన డాక్టర్ బి.సోని విధుల్లో చేరినట్లు పేర్కొన్నారు. ఆసుపత్రిలో స్త్రీ వైద్య సేవలను మరింత మెరుగ్గా అందించడానికి చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. పరిసర ప్రాంత మహిళలు సేవలను వినియోగించుకోవాలని సూచించారు.
KKD: ఏప్రిల్ 4వ తేదీన కరప గ్రామ పంచాయతీ వద్ద దివ్యాంగులకు రాయితీతో కూడిన ఆర్టీసీ బస్సు పాసులు జారీ చేస్తామని కాకినాడ ఆర్టీసీ డిపో మేనేజర్ ఓ ప్రకటనలో తెలిపారు. వైద్యులు జారీ చేసిన సదరం సర్టిఫికెట్, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, ఆధార్ కార్డు,100 రూపాయలుతో దివ్యాంగులు నాలుగో తేదీ ఉదయం పంచాయతీ కార్యాలయానికి రావాలని సూచించారు. ఈ బస్సు పాస్కు 3సంవత్సరాల కాలపరిమితి కలదు.
SDPT: జిల్లా కేంద్రంలోని మారుతీ నగర్లో అర్ధరాత్రి ఓ ఇంట్లో అగ్నిప్రమాదం జరిగింది. ప్రమాదంలో ఒక కారు, 3 బైక్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. కరెంట్ షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
E.G: రాజానగరం నియోజకవర్గంలో రోడ్ల మరమ్మతులకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందని ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ వెల్లడించారు. సీతానగరం నుంచి పురుషోత్తపట్నం వరకు రోడ్డు వేయడానికి ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. ఈ సందర్భంగా ఆయా గ్రామాలకు చెందిన నాయకులు, గ్రామస్తులు బుధవారం ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు.