ATP: గుత్తి పట్టణంలోని బీసీ కాలనీ నందుగల అభయ ఆంజనేయ స్వామి దేవాలయంలో మంగళవారం గుర్తుతెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు. ఆలయంలో ఎవరు లేని సమయంలో హుండీ తాళాలు పగలగొట్టి సుమారు రూ. 20,000 నగదు ఎత్తుకెళ్లినట్లు ఆలయ అర్చకులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆలయ కమిటీ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.