KKD: గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు భూమి పట్టాదారు పాసు బుక్కులు శనివారం అందజేశారు. దేవరపల్లి మండలం యాదవోలులో కొల్లూరు సుబ్బమ్మకి చెందిన 14 ఎకరాల భూమిని 1982 సంవత్సరం నుంచి పాస్ పుస్తకాలు లేకుండా పేదలు వినియోగిస్తున్నారు. దీంతో పట్టదారులు గతంలో న్యాయస్థానాన్ని ఆశ్రయించగా పట్టదారులకే భూమి చెందుతుందని కోర్టు ఇటీవలే ఉత్తర్వులు జారీ చేసింది.