హీరోయిన్ శృతి హాసన్ తన పాఠశాల జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. అందులో భాగంగా నటుడు దుల్కన్ సల్మాన్ గురించి తెలిపారు. దుల్కన్ తాను బాల్యంలో చెన్నైలో ఒకే స్కూల్లో కలిసి చదువుకున్నామని చెప్పారు. ఆ సమయంలో తరచూ కలుసుకునేవారమని పేర్కొన్నారు. ఆయన తనను సోంబి అని పిలిచేవాడన్నారు. కాగా తాజాగా దుల్కర్తో కలిసి ఆమె ఆకాశంలో ఒక తార అనే తెలుగు చిత్రంలో నటిస్తున్నారు.
KMR: జిల్లాలో ప్రస్తుతం కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ(సగభాగం), జుక్కల్ అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. నూతన జనాభా గణాంకాల ఆధారంగా అసెంబ్లీ స్థానాల పెంపుదల జరిగితే కామారెడ్డిలో 1-2 వరకు అసెంబ్లీ స్థానాలు పెరగవచ్చు. దోమకొండ, గాంధారి ప్రాంతాల్లో నియోజకవర్గ పెంపుదల ఉంటుందని, బాన్సువాడ పూర్తిస్థాయి సెగ్మెంట్ జిల్లాలోకి వస్తుందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
కామారెడ్డి: గాంధారి మండలం ఎక్కకుంట తండా ఎంపీపీఎస్ విద్యార్థులు మంగళవారం వెలువడిన గురుకుల ఎంట్రెన్స్ ఎగ్జామ్ ఫలితాల్లో సత్తా చాటారు. 9 మంది ఎగ్జామ్ రాయగా ఏడుగురు సీట్లు రావడం గమనార్హం. మారుమూల తండాలో, ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న విద్యార్థులు ఉత్తీర్ణత సాధించడంతో గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు.
MBNR: ‘రైతుభరోసా’ పథకం డబ్బులు పొందాలంటే దరఖాస్తులకు ఇవాళే చివరి తేదీ అని పెద్దవార్వాల్ AEVO శివలీల తెలిపారు. ఫిబ్రవరి 28 వరకు కొత్త పాస్ బుక్ పొందిన రైతులు, ఇప్పటివరకు రైతు భరోసా పొందని, బ్యాంక్ వివరాలు నమోదు చేయని వారు అప్లై చేయాలి. అప్లికేషన్తో పాస్ బుక్, ఆధార్, బ్యాంక్ పాస్ బుక్ జిరాక్స్, మొబైల్ నంబర్ వివరాలు సమర్పించాల్సి ఉంటుందని పేర్కొన్నారు.
AP: ఇంటర్ ప్రవేశాలకు ఇంటర్మీడియట్ విద్యామండలి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏప్రిల్ 1 నుంచి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కానుంది. ఏప్రిల్ 6 నుంచి జూన్ 1 వరకు అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగుతుంది. కొత్త విద్యా సంవత్సరం తరగతులు జూన్ 1 నుంచి ప్రారంభమవుతాయని బోర్డు స్పష్టం చేసింది. విద్యార్థులు గడువులోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.
నంద్యాల శాంతీరామ్ ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థిని వెంకటేశ్వరి జాతీయ స్థాయి ఖోఖో పోటీలకు ఎంపికైనట్లు ప్రిన్సిపల్ సుబ్రహ్మణ్యం మంగళవారం తెలిపారు. అనంతపురంలో జరిగిన యూనివర్సిటీ పోటీల్లో ఆమె ప్రతిభ కనబరిచారు. ఏప్రిల్ 1 నుంచి 4 వరకు కర్ణాటకలోని దావణగెరె యూనివర్సిటీలో జరిగే దక్షిణ భారత అంతర్ విశ్వవిద్యాలయాల టోర్నమెంట్లో ఆమె పాల్గొంటారని వెల్లడించారు.
BPT: అద్దంకి వద్ద మినీ లారీ బోల్తా పడిన ఘటన మంగళవారం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో డ్రైవర్కు తీవ్ర గాయాలు కావడంతో వెంటనే సమీప ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. టోల్ ప్లాజా సిబ్బంది, అద్దంకి పోలీసులు కలిసి లారీని రోడ్డుపై నుంచి తొలగించారు. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
NDL: కొలిమిగుండ్ల గ్రామ సమీపంలోని గ్యాస్ గోడౌన్ వద్ద ఇవాళ ఇసుక లారీ బోల్తా పడింది. ఈ ఘటనలో డ్రైవర్, క్లీనర్కు తీవ్ర గాయాలు కాగా.. చికిత్స కోసం అవుకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నడిరోడ్డుపై లారీ బోల్తా పడటంతో రోడ్డుకి ఇరువైపుల భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అనంతరం పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ట్రాఫిక్ అంతరాయం లేకుండా చర్యలు తీసుకున్నారు.
ATP: పామిడి నుంచి గుత్తి మున్సిపాలిటీకి తాగునీటి సరఫరా చేసే సత్యసాయి తాగునీటి పైప్లైన్ లీకేజీ కావడంతో బుధవారం పైప్లైన్ లీకేజ్కు మున్సిపాలిటీ సిబ్బంది మరమ్మత్తు పనులు చేపట్టారు. దీంతో గుత్తి మున్సిపాలిటీకి రెండు రోజులు పాటు తాగునీటి సరఫరాకు అంతరాయం కలుగుతుందని మున్సిపల్ కమిషనర్ జబ్బర్ మియా తెలిపారు.
శ్రీకాకుళం రైల్వే ప్రయాణికులకు ఈస్ట్ కోస్ట్ రైల్వేశాఖ శుభవార్త తెలిపింది. శ్రీకాకుళం మీదుగా చర్లపల్లి-సాలిమార్-చర్లపల్లి(17065/66)మధ్య అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైలును నడపనున్నట్లు బుధవారం ఓ ప్రకటనలో తెలిపింది. ఈ రైలు సర్వీసులు ఏప్రిల్ 7వ తేదీ నుంచి ప్రారంభమవుతాయని జిల్లాలో శ్రీకాకుళం రోడ్, పలాస రైల్వే స్టేషన్లలో ఈ రైలు ఆగనుందని రైల్వేశాఖ తెలిపింది.
కోనసీమ: నేడు అమలాపురం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు పర్యటన వివరాలను ఎమ్మెల్యే కార్యాలయ సిబ్బంది వెల్లడించారు. ఉదయం 10 గంటలకు గొల్లవెల్లి గ్రామంలో ఉచిత పశువైద్య శిబిరాన్ని ప్రారంభిస్తారు. 11 గంటలకు ఉప్పలగుప్తంలో ఆత్మ కమిటీ ప్రమాణస్వీకార కార్యక్రమంలో పాల్గొంటారు. 12 గంటలకు భీమనపల్లి గ్రామంలో ఆర్అండ్బీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తారు.
BHPL: జిల్లా కోర్టులో ఈనెల 28న జరగనున్న జాతీయ మెగా లోక్ అదాలత్ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా SP సంకీర్త్ గౌడ్ అన్నారు. రాజీ పడదగిన క్రిమినల్, సివిల్, కుటుంబ వివాదాలను పరస్పర సమ్మతితో పరిష్కరించుకోవచ్చని, దీని వల్ల సమయం, డబ్బు ఆదా అవుతుందని ఆయన తెలిపారు. రాజీ మార్గమే రాజా మార్గమని ఆయన పేర్కొన్నారు.
KNR: చిగురుమామిడి మండలం ముల్కనూర్ గ్రామంలో గర్భిణీలకు పౌష్టికహారం ప్రాముఖ్యతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ సూపర్వైజర్ సుల్తానా, ప్రణీత గర్భిణీలు తీసుకోవలసిన సమతుల్య ఆహారం, పోషకాహారం,నియమిత ఆరోగ్య పరీక్షల అవసరం, మాత, శిశువు ఆరోగ్య సంరక్షణపై వివరించారు. ఈ సందర్భంగా సర్పంచ్ భారతమ్మ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
TG: డీలిమిటేషన్, 50% పార్లమెంట్ స్థానాల పెంపునకు వ్యతిరేకంగా అందరూ కలిసి పోరాడాలని CM రేవంత్ పిలుపునిచ్చారు. ‘ఇదంతా ఏ లెక్కన జరుగుతోంది? ఇదే జరిగితే ఉత్తరాది రాష్ట్రాల్లో సీట్ల పెంపుతో దక్షిణాది రాష్ట్రాలతో పనిలేకుండానే కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటవుతుంది. ఫలితంగా దక్షిణాది అవసరం లేకుండా పోయి, తీవ్ర నష్టం జరుగుతుంది. అన్నింటా చర్చించి ముందుకు వెళ్లాలి’ అని పేర్కొన్నారు.