AP: రాజమహేంద్రవరం కల్తీ పాల ఘటనపై సీఎం చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. మృతి చెందిన నలుగురి కుటుంబాలకు రూ.10 లక్షల పరిహారం అందిస్తామని వెల్లడించారు. ఈ ఘటనకు కారణమైన పాల వ్యాపారిని అరెస్ట్ చేశామని, బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. బాధితులకు మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం 8 మంది బాధితులు చికిత్స పొందుతున్నారన్నారు.