GNTR: అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాటం ఆపేది లేదని అసోసియేషన్ రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి చంద్రశేఖరరావు స్పష్టం చేశారు. కొత్తపేటలో ఆదివారం మాట్లాడుతూ..యాజమాన్య కుట్రలను ఆయన తప్పుబట్టారు. బాధితులకు తక్షణమే చెల్లింపులు జరపాలని డిమాండ్ చేస్తూ, మార్చి 2 నుంచి విజయవాడ ధర్నా చౌక్లో చేపట్టే రిలే దీక్షలు జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.