NLG: నల్గొండలో న్యాయవాద పరిషత్తు రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఆదివారం జరిగింది. జిల్లా అధ్యక్షులు గూడూరు శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సభకు జాతీయ అధ్యక్షులు విష్ణుమూర్తి ముఖ్య అతిథిగా విచ్చేశారు. న్యాయవాదులు సమాజం పట్ల బాధ్యతగా ఉండాలని, యువ న్యాయవాదులు నిరంతరం అధ్యయనం చేస్తూ సేవాభావం పెంపొందించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.