సత్యసాయి: కదిరి ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారు హంస వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. తిరువీధుల్లో విహరిస్తున్న శ్రీవారిని చూసేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. రంగురంగుల పుష్పాలతో అలంకరించిన వాహనంపై స్వామివారి వైభవం భక్తులను మంత్రముగ్ధులను చేసింది. మంగళవాయిద్యాలు, భజనల మధ్య ఉత్సవం అత్యంత వైభవంగా సాగింది.