AP: తిరుమల లడ్డూ అంశంపై శాసనమండలిలో గందరగోళం కొనసాగుతోంది. ఒకే అంశంపై రెండు తీర్మనాలు ఇవ్వడం సరికాదని మంత్రి నాదెండ్ల తెలిపారు. సభలో చర్చ జరిగిన తర్వాతే తాము బయటకు వెళ్తామని మంత్రి పయ్యావుల పేర్కొన్నారు. సభలో ఎంతసేపైనా చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. చారిత్రాత్మక తప్పిదం మండలిలో జరగకూడదనేదే తమ ఉద్దేశమని చెప్పారు.