AP: వైసీపీ అధికారంలోకి వచ్చాక ముఖ్యమైన శాఖలకు తాళాలు వేసిందని మంత్రి అచ్చెన్నాయుడు ఆరోపించారు. అన్ని శాఖల్లో నిర్వహణను గాలికొదిలేసిందన్నారు. ఇబ్బందులు సరిదిద్దేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు చేపడుతోందన్నారు. పశు వైద్యశాలల్లో సౌకర్యాలు, ఉపకరణాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి మందులు ఇస్తున్నామని తెలిపారు. వైద్యులు, సిబ్బంది నియామకాలు చేపడుతామన్నారు.