AP: విజయవాడ నుంచి మాజీ మంత్రి అంబటి రాంబాబు గుంటూరు బయలుదేరారు. ఆయన బయలుదేరే ముందు పోలీసులు నోటీసులు ఇచ్చి సంతకం చేయించుకున్నారు. నోటీసులు ఇవ్వడంపై అంబటి ఆగ్రహం వ్యక్తం చేశారు. నోటీసులు ఇవ్వడం సరికాదని, సంఘీభావం తెలిపేందుకు కార్యకర్తలు వస్తే తప్పేంటి అని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో తమకు సంఘీభావం తెలపకుడదా? 18 రోజుల తర్వాత ఇంటికి వెళ్తుంటే నిర్బంధాలు ఏంటని మండిపడ్డారు.