AP: విజయవాడ ఇంద్రకీలాద్రిపై దుర్గగుడిలో 12 ఏళ్లకోసారి నిర్వహించే కుంభాభిషేకానికి సర్వం సిద్ధమైంది. ఆగమశాస్త్రం ప్రకారం ఇవాళ్టి నుంచి 3 రోజుల పాటు ఈ కార్యక్రమం జరగనుంది. వేడుకల్లో భాగంగా ఆలయ విమాన గోపురాలకు సంప్రోక్షణలు నిర్వహించనున్నారు. కంచికామకోటి పీఠాధిపతి శంకర విజయేంద్ర సరస్వతీస్వామి ఈ క్రతువును వైభవంగా నిర్వహించనున్నారు. ఈనెల 9 వరకు అన్ని ఆర్జిత సేవలు రద్దు చేశారు.