సత్యసాయి: జిల్లాలో పదో తరగతి పరీక్షలు రాసే విద్యార్థులకు కూటమి ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఈ నెల 16 నుంచి ఏప్రిల్ 1 వరకు జరిగే పబ్లిక్ పరీక్షల కోసం ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించింది. పరీక్షా కేంద్రాలకు వెళ్లే విద్యార్థులు తమ హాల్ టికెట్ చూపిస్తే చాలు.. ఎటువంటి ఛార్జీ లేకుండా పల్లెవెలుగు, సిటీ ఆర్డినరీ బస్సుల్లో ప్రయాణించవచ్చు.