TG: మఠాన్ని కూల్చడమంటే భక్తుల మనోభావాలు దెబ్బతీయడమే అని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. హైదరాబాద్ కోకపేట నియోపోలిస్లోని విశాఖ శారద పీఠాన్ని హరీష్ రావు పరిశీలించారు. కేసీఆర్ అద్భుతమైన ఆలయాలు నిర్మిస్తే ఈ ప్రభుత్వం అన్నీ కూల్చుతోందని మండిపడ్డారు. ఖమ్మంలో పేదలు ఉంటున్న భూములను స్వాధీనం చేసుకుంటున్నారని విమర్శించారు.