TG: రైతులకు మద్దతుగా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించాలని మాజీ మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. కొహెడ పండ్ల మార్కెట్పై లక్షలాది మంది ఆధారపడి ఉన్నారని చెప్పారు. భవిష్యత్ అవసరాలకు 200 ఎకరాలు కేసీఆర్ మార్కెట్ కోసం కేటాయించారన్నారు. మార్కెట్ భూసేకరణకు మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఎంతో కష్టపడ్డారని తెలిపారు. అంతర్జాతీయ స్థాయిలో ఫ్రూట్ మార్కెట్ కట్టాలని బీఆర్ఎస్ నిర్ణయించిందన్నారు.