VZM: వ్యవసాయ రంగానికి పూర్వవైభవం తీసుకురావడమే కాకుండా, భూగర్భ జల మట్టాలను పెంచి రైతులకు సాగునీటి కష్టాలు తీర్చడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి అన్నారు. ఎల్.కోట మండలం కొట్యాడ గ్రామంలో సోమవారం ఆమె పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక ఊర చెరువు వద్ద నిర్వహించిన జలధార కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హజరయ్యారు.