ATP: యాడికిలో జరిగిన జలధార సభలో CM చంద్రబాబు నాయుడు తాడిపత్రి నియోజకవర్గ ప్రగతి నివేదికను స్వయంగా చదివి వినిపించారు. సరిగ్గా పనిచేయని అధికారులను వేదికపైకి పిలిపించి వివరణ కోరారు. పనితీరు మెరుగుపరుచుకోవాలని, ప్రజల సంతృప్తే లక్ష్యంగా సేవలు అందించాలని స్పష్టం చేశారు. ఆదాయం తగ్గినా ఉచిత ఇసుక విధానాన్ని అమలు చేస్తున్నామని తెలిపారు.