AP: మార్కాపురం జిల్లాలో బస్సు ప్రమాదంపై మంత్రి అచ్చెన్నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రయాణికులు సజీవదహనం కావడం తీవ్రంగా కలచివేసిందని అన్నారు. మృతుల కుటుంబాలకు అన్నివిధాల అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. మరోవైపు మంత్రి పార్థసారథి, ఎమ్మెల్యే దామాచర్ల, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.