AP: వైసీపీ పాలనలో ఊహించని విధంగా విధ్వంసం జరిగిందని సీఎం చంద్రబాబు విమర్శించారు. రాష్ట్రాన్ని పునఃనిర్మాణం చేయాలని మూడు పార్టీలు భావించినట్లు తెలిపారు. ‘YCP వ్యతిరేక ఓటు చీలకూడదని ఎన్నికల్లో ఒక్కటయ్యాం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సఖ్యతతో పని చేస్తున్నాయి. దారుణమైన ఆర్థిక వ్యవస్థ మనకు వారసత్వంగా వచ్చింది. ఈరోజు తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తును నిర్ణయిస్తాయి’ అని తెలిపారు.