AP: వైసీపీ నేతలపై ఎమ్మెల్సీ పంచమర్తి అనురాధ ఘాటు వ్యాఖ్యలు చేశారు. శాసనమండలిలో వైసీపీ నాటకాలు ఆడుతోందని విమర్శించారు. ప్రశ్నోత్తరాలు కూడా జరగకుండా అడ్డుకున్నారని మండిపడ్డారు. ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ నియంతలా వ్యవహరిస్తున్నారన్నారు. ఇది రాజారెడ్డి రాజ్యాంగం అనుకుంటున్నారా అని ఎద్దేవా చేశారు.