AP: అవయవదానంలో రాష్ట్రం ఆరవస్థానంలో ఉందని మంత్రి సత్యకుమార్ తెలిపారు. రాష్ట్రంలో గడిచిన రెండు నెలల్లో జరిగిన అవయవదానాలతో 64 మందికి కొత్త జీవితం కల్పించామన్నారు. అవయవాలను దానం చేస్తున్నవారు అత్యధికంగా 50 ఏళ్ల లోపువారే ఉన్నారని పేర్కొన్నారు. 2025లో రాష్ట్రంలో అవయవదానాల సంఖ్య గణనీయంగా పెరిగిందని తెలిపారు.