AP: ఒంగోలులో టీడీపీ, వైసీపీ కలిసి పనిచేస్తున్నాయని మాజీమంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు. ‘ఎవరు ఎవరితో కలిసినా నన్ను ఎవరూ ఏం చేయలేరు. ఒంగోలులో టీడీపీ, వైసీపీ కలిసి పనిచేస్తున్నాయి. నేను జనసేనలో చేరడంపై విమర్శలు చేస్తున్నారు. దోచుకున్నది దాచుకోవడానికే అంటూ కామెంట్ చేస్తున్నారు. ఇది పూర్తిగా అవాస్తవం. కేసులకు భయపడే వ్యక్తిని కాదు’ అని పేర్కొన్నారు.