AP: YS మరణం వరకున్న ఆస్తులన్నీ కుటుంబ ఆస్తులేనని YS విజయలక్ష్మీ అన్నారు. ఆస్తుల పంపకం ఎప్పుడు జరగలేదని.. ఆస్తులు నలుగురు మనుమలకు సమానంగా పంచాలని వైఎస్ ఉద్దేశ్యమన్నారు. YS దగ్గర వాళ్లందరికీ తెలిసిన వాస్తవమిదని తెలిపారు. MOUలో రాసిన ప్రతి ఆస్తి షర్మిలకు చెందాల్సినవేనని వెల్లడించారు. ఆస్తుల విషయంలో జగన్.. తన మేనల్లుడికి, మేనకోడలికి అన్యాయం చేశాడని ఆరోపించారు.