AP: జీఎస్టీ ఎగవేతపై కేంద్ర ప్రభుత్వ అధికారులు చర్యలు చేపట్టారు. విశాఖలో రూ.81.25 కోట్ల విలువైన నకిలీ ఇన్వాయిస్లు సృష్టించిన కేసులో చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో రూ.11.54 కోట్ల జీఎస్టీ ఐటీసీని అక్రమంగా వాడిన కీలక వ్యక్తిని అరెస్ట్ చేశారు. నకిలీ బిల్లులతో ప్రభుత్వ ఖజానాకు రూ.11.54 కోట్ల నష్టం కలిగించినట్లు గుర్తించారు.