TG: పరీక్షలు జరిగే రోజుల్లో విద్యార్థులకు ఇబ్బంది లేకుండా RTC ప్రత్యేక చర్యలు చేపట్టింది. పదో తరగతి, ఇంటర్ హాల్ టికెట్లు చూపిస్తే కోరిన చోట బస్సు ఆపాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. బుధవారం నుంచి ఇంటర్ పరీక్షలు, మార్చి 14 నుంచి పదో తరగతి పరీక్షలు జరగనుండటంతో.. పరీక్షల సమయంలో అదనంగా బస్సులు నడిపేలా చర్యలు తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.