AP: పార్వతీపురం జిల్లా కురుపాం గురుకుల పాఠశాలలో బాలికలు డయేరియాకు గురయ్యారు. నలుగురు బాలికలకు వాంతులు, విరేచనాలు కావడంతో కురుపాం ఆస్పత్రికి విద్యార్థినులను తరలించారు. ప్రస్తుతం బాలికలకు చికిత్స కొనసాగుతోంది. అప్రమత్తమైన పాఠశాల సిబ్బంది గురుకులంలో పారిశుధ్యం పనులు చేపట్టారు. విద్యార్థినుల ఆరోగ్యంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.