AP: కల్తీ పాల ఘటనలో మరో ఇద్దరు బాధితులు మృతిచెందారు. దీంతో మృతుల సంఖ్య 11కు చేరింది. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో ఫిబ్రవరి 15న గణేష్ అనే వ్యక్తి పలువురికి కల్తీ పాలను విక్రయించాడు. దీంతో ఆ పాలను తాగి పలువురు తీవ్ర అస్వస్థతకు గురై ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. తాజాగా ఈరోజు ఇద్దరు మృతిచెందారు.